Saturday, May 20, 2017

పాదగోపనము


పాదగోపనము




సాహితీమిత్రులారా!


కిరాతార్జునీయంలోని
పాదగోపనము చూడండి-

ద్యువియద్గామినీ తార
సంరావ విహత శ్రుతిః
హైమీషుమాలా శుశుభే

దీనిలో నాలుగవపాదం గోపనమైనది
దీనిలో బాగా గమనించినట్లయిన
మొదటి రెండుపాదాలలోనే
నాలుగవపాదం గోపనం చేశారు

ద్యువియద్గామినీ తా
సంరా విత శ్రుతిః
హైమీషుమాలా శుశుభే

ఆ అక్షరాలను గుర్తించి వ్రాయగా
విద్యుతామివసంహతి - అనే పాదం
బహిర్గతమౌతుంది.

ద్యువియద్గామినీ తా
సంరా విత శ్రుతిః
హైమీషుమాలా శుశుభే
విద్యుతామివసంహతి

శివుని స్వర్ణమయాలైన బాణాల పంక్తులు
స్వర్గ అంతరిక్షాలలో సంచరించగలవి,
తమస్వరంతో కర్ణకుహరాలను ఛేదించగలవై
విద్యుత్ సమూహంతో సమానంగా వెలుగొందాయి-
అని భావం.

No comments: