Showing posts with label గూఢ చిత్రం. Show all posts
Showing posts with label గూఢ చిత్రం. Show all posts

Friday, May 15, 2020

దాగిఉన్న శ్లోకం (గూఢశ్లోకం)


దాగిఉన్న శ్లోకం (గూఢశ్లోకం)




సాహితీమిత్రులారా!

ఒక పద్యంలోగాని, శ్లోకంలోగాని మరొక పద్యం ఇమిడి ఉంటే దాన్ని
గూఢశ్లోకం లేదా పద్యం అంటాము. ఇక్కడ 8వ శతాన్దికి చెందిన
రాజానక రత్నాకర కవి కూర్చిన హరవిజయం నుండి
దీనికి ఉదాహరణ గమనిద్దాం-

సశ్రీమానమృదుర్నిసర్గగహనే దర్పాత్రికృత్తద్విషో
వంశ్యశ్చారుయశస్తదా దధదధః సద్యో హృతశ్రీరిపోః
దత్తార్ఘో నయమార్గగోచరగుణః పుష్టీభవన్మారణే
సేవానమ్రలసత్కరాఞ్జలిపుటైవీతారిశఙ్కం సురైః
ఇత్థం దుర్ధరదక్పదోర్ద్రుమతయా మృన్దంశ్చమూరాతతా
భాస్వన్సానుమతి క్షపా ఇవ తదా సూదారశోభానుగః
టాంకారైర్వ్యథితారిసంహతి ధనుర్వ్రత్యా(వ్రాతా)త్తకీర్తి రణే
యత్నాసఞ్జితశిఞ్జినీకసరటః కామం తమవ్యంసయత్
                                                                                                (హరవిజయం - 46 - 71,72)
ఇందులో రెండు శ్లోకాలున్నాయి.
అందుకే వీటిని యుగలశ్లోకాలంటారు.

దీనిలో ఒక శ్లోకం దాగి ఉంది ఆ శ్లోకాన్ని ఈ విధంగా గుర్తించవచ్చు.
దీనిలో క్రిందగీతలు గీచిన వాటిని విడిగా వ్రాయడంవల్ల ఆ శ్లోకం బహిర్గతమౌతుంది.
శ్రీమానమృదుర్నిసర్గగహనే ర్పాత్రికృత్తద్విషో
వంశ్యశ్చారుయశస్తదా దధదధః ద్యో హృతశ్రీరిపోః
త్తార్ఘో నమార్గగోచరగుణః పుష్టీభవన్మాణే
సేవామ్రసత్కరాఞ్జలిపుటైవీతారిశఙ్కం సురైః
త్థం దుర్ధరక్పదోర్ద్రుతయా మృన్దంశ్చమూరాతా
భాస్వన్సానుమతి క్షపా ఇవ తదా సూదారశోభానుగః
టాంకారైర్వ్యథితారిసంహతి నుర్వ్రత్యా(వ్రాతా)త్తకీర్తి ణే
త్నాసఞ్జితశిఞ్జినీటః కామం తమవ్యంసయత్

దాగిఉన్న శ్లోకం -
శ్రీదుర్గదత్తవంశ్యః సహృదయగోష్ఠీరసేన లలితాఙ్కమ్
ఇదమమృతభానుసూనుర్వ్యధత్త రత్నాకరః కావ్యమ్


Sunday, February 2, 2020

ఆకాశమే నడుము గిరులే స్తనములు


ఆకాశమే  నడుము   గిరులే స్తనములు




సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి
ఇందులో అన్నీ పుణ్యక్షేత్రాలున్నట్లున్నను
అందులో నాయికా వర్ణనకూడ ఉన్నది.

మధ్యం విష్ణుపదం కుచౌ శివపదం వస్త్రం విధాతు: పదం
ధమ్మిల్లస్సుమన: పదం ప్రవిలసత్కాంచీ నితమ్బ స్థలీ
వాణీ చేన్మధురా ధరో2రుణ ధర: శ్రీరంగ భూమిర్వపు
స్తస్యా: కిం కథ యామి భూరి సుకృతం మాన్యాసదా నిర్జరై:

ఈ శ్లోకం ఒక నాయికను వర్ణించే శ్లోకం.
ఇందులో శ్లేషను ఆధారంగా తీసుకొని
శరీరఅవయవాలను పుణ్యక్షేత్ర
సంబంధమైనవిగా ఒక అర్థం,
శృంగార పరంగా మరొక అర్థం కనబడుతుంది.

పుణ్యక్షేత్ర సంబంధమైన అర్థం-
మధ్యం - నడుము, మిష్ణుపది - వైకుంఠము, కుచౌ - స్తనములు,
శివపదం - కైలాసం, వక్త్రం - ముఖం, విధాతు: పదం - బ్రహ్మలోకం,
ధమ్మిల్ల: - కొప్పు, సుమన: పదం - దేవతల లోకం,
నితంబస్థలీ - మొలప్రదేశం,
ప్రవిల సత్కాంచీ - ప్రకాశించే కాంచీ పట్టణం, వాణీ - నోరు,
మధురా - మధురా పట్టణం, అధర: - క్రింది పెదవి,
అరుణధర: - అరుణాచల క్షేత్రం, వపు: - శరీరం,
శ్రీరంగభూమి: - శ్రీరంగక్షేత్రం, తస్యా: - ఆమె యొక్క,
భూరి సుకృతం - పుణ్యాన్ని, కిం కథ యామి? - ఏమి చెప్పుదును,
నిర్జరై: - దేవతల చేత, సదా - ఎల్లపుడు, మాన్యా - పూజింప తగినది.


వీటికే శృంగార సంబంధమైన అర్థం -
విష్ణు పదం - ఆకాశం(నడుము శూన్యము) , శివపదం - కైలాస పర్వతము
(స్తనాలు పర్వాలవంటివి), ముఖము బ్రహ్మ జన్మస్థానమైన పద్మమువంటిది,
సుమన: పదం - పూవులకు స్థానం (కొప్పు  పుష్పాలు ధరించినది),
నితంబస్థలీ - నడుముభాగము కాంచి(ఒడ్డాణం)తో ప్రకాశిస్తున్నది.
వాణీ మధురా - వాక్కు తీయగా ఉంటుంది,
అధర: అరుణధర: - పెదవి ఎరుపురంగు కలిగినది,
శరీరము, శ్రీరంగభూమి: - లక్ష్మీదేవికి నాట్యవేదిక,
నగలతో ఆమె శరీరం సంపదకు నెలవుగా ఉన్నది. - అని భావం.

Monday, August 20, 2018

అనంతాక్షర సౌరభాల గనులు


అనంతాక్షర సౌరభాల గనులు





సాహితీమిత్రులారా!


ఈ కవితలో ఉత్పలమాల పద్యాలు ఉన్నాయి.
కాని వీటిని ఒక కవితగా వ్రాశాడు ఎలనాగగారు
చూడండి-

పుస్తకమే నయం
కుమిలిపోయిన ఆత్మల మీద
ప్రేమతో కాస్త ప్రమోదరశ్మిని
సుఖాన్ని ప్రతుష్టిని చల్లుతుంది
ఈ ఆస్తిని యెప్పుడూ
మన గృహాంతర సంపద
చేయగల్గినామా
స్తిమితం అనేది
మన మానసవీధిని
కమ్మటం నిజం

అక్షరమే అనంత నిధి
ఆ యెరుకే
వొక సాటి లేని భాగ్యం
క్షితిపై మనీష
తన కాంతిని పూసిన
సాధనం యిదే
సాక్షరుడైనవాడి మనసంత
వసంత విరాజితం!
అనంతాక్షర
సౌరభాల గనులైన
కితాబుల మైత్రి ఓ వరం
                                  (వాకిలి సాహిత్య పత్రిక  నుండి)

ఉత్పలమాల పద్యాలు-

పుస్తకమే నయం కుమిలిపోయిన ఆత్మల మీద ప్రేమతో 
కాస్త ప్రమోదరశ్మిని సుఖాన్ని ప్రతుష్టిని చల్లుతుంది ఈ 
ఆస్తిని యెప్పుడూ మన గృహాంతర సంపద చేయగల్గినా
మా స్తిమితం అనేది మన మానసవీధిని కమ్మటం నిజం


అక్షరమే అనంత నిధి ఆ యెరుకే వొక సాటి లేని భా
గ్యం క్షితిపై మనీష తన కాంతిని పూసిన సాధనం యిదే
సాక్షరుడైనవాడి మనసంత వసంత విరాజితం! అనం
తాక్షర సౌరభాల గనులైన కితాబుల మైత్రి ఓ వరం

Monday, July 30, 2018

మానిషాద ప్రతిష్ఠాం


మానిషాద ప్రతిష్ఠాం




సాహితీమిత్రులారా!

వాల్మీకి నోట అప్రయత్నంగా వెలువడిన ఛందోబద్ధమైన వాక్యం
అవే వాక్యంలోని పదాలను గమనిస్తే అవి అనుష్టుప్ ఛందస్సులో
వ్రాయబడిన శ్లోకంగా గమనించ వచ్చు. ఆ శ్లోకం-

మానిషాద ప్రతిష్ఠాం త్వమగమ శ్శాశ్వతీస్సమాః
యత్క్రౌంచమిథునాదేక మవధీః కామమోహితమ్
                            (శ్రీమద్రామాయణం- బాలకాండ - 2 - 15)

ఓరి నిషాదుడా! పరస్పరం కామమోహంతో ఉన్న పక్షులలో పోతుపిట్టను
చంపిన కారణంగా ఎక్కువకాలం నువ్వుండరాదు సుమా! - అని ఒక
తిట్టు దీని భావం.

మంగళాచరణ శ్లోకంగా దీని అర్థం-

ఓ శ్రీనివాస!(మానిషాద) ఓరామా!  సీతవిషయంలో కామమోహితుడైన రావణుణ్ణి, రావణమండోదరుల జంటనుండి చంపి శాశ్వత ప్రిష్ఠనీ, కీర్తినీ పొందుదువుగాక!

రామాయణంలోని అన్నికాండల కథా వస్తువులు దీనిలో
ఉండాలని సరస్వతీదేవి ఇలా పలికించిందని చెబుతారు
దాని వివరణ-

ఏడు పదాలు ఏడు కాండలను సూచిస్తాయని
వివరించడం జరిగింది-

1. బాలకాండ - మానిషాద - సీతా భర్తా(సీత వివాహం ప్రధానమైంది)

2. అయోధ్యకాండ - ప్రతిష్ఠాం త్వమగమః - పితృవాక్యపరిపాలన జగద్విఖ్యాతి

3. అరణ్యకాండ - శాశ్వతీస్సమాగమాః - ప్రతిజ్ఞాపాలన కోసం అనేక సంవత్సరాలు వనవాసం

4. కిష్కింధకాండ - క్రౌంచమిథునాత్ -కుటిల ప్రవర్తనకల తారవాలి జంటలో వాలిని చంపడం

5. సుందరకాండ - ఏకమ్ - కార్యసాధకుడు ఒక్కడు, అసహాయశూరుడు హనుమంతుడు

6. యుద్ధకాండ - అవధీః - రావణవధ

7. ఉత్తరకాండ - కామమోహితమ్ - సీతారాముల వైకుంఠ ప్రయాణం

Sunday, July 8, 2018

విశాలా కళ్యాణీ స్ఫుటరుచిర


విశాలా కళ్యాణీ స్ఫుటరుచిర




సాహితీమిత్రులారా!

శంకరాచార్యుసౌందర్యలహరిలో
జగన్మాతను  ప్రముఖమైన
ఉత్తరభారతదేశ పట్టణాలతో
వర్ణించారు గమనించండి-


విశాలా కళ్యాణీ స్ఫుటరుచి రయోధ్యా కువలయైః
కృపాధారా2ధారా కిమపి మధురా2 భోగవతికా
అవన్తీ సృష్టిస్తే బహునగర విస్తార విజయా
ధ్రువం త త్తన్నా మవ్యవహరణ యోగ్యా విజయతే
                                                          (సౌుదర్యలహరి - 49)


విశాలా కళ్యాణీ స్ఫుటరుచి రయోధ్యా కువలయైః
కృపాధారా2ధారా కిమపి మధురా2 భోగవతికా
అవన్తీ సృష్టిస్తే బహునగర విస్తార విజయా
ధ్రువం త త్తన్నా మవ్యవహరణ యోగ్యా విజయతే

ఇందులో వర్ణించిన నగరాలకు నగరపేరుగా అర్థం లేకుండా
మరో అర్థం వచ్చేలా కూర్చారు శంకరులవారు

తే - నీ, దృష్టిః - చూపు, విశాలా - విస్తృతమైనది, కళ్యాణీ - మంగళ
స్వరూపం, స్ఫుట రుచిః - చక్కని కాంతివంతం, కువలయైః - నల్లకలువలచే,
అయోధ్యా - జయించడానికి వీలుకాని, కృపాధారాధారా-
దయకుఆధారమనదగ్గ, కిమపి - ఇలాంటిదని చెప్పడానికి వీలుకానిది,
మధురా - గొప్ప ఆనందదాయక, ఆ భోగవతికా - విశాలదృక్పధం గలది,
అవంతీ - రక్షణ లక్షణం కలది, బహునగర విస్తార - పలునగర విస్తీర్ణం గలది,
విజయ - విజయం గల, తత్ నామ వ్యవహరణా - ఆ పట్టణాల పేర్లతో 
పిలువబడేది, యోగ్యా విజయతే ధ్రువం - నిశ్చయంగా అందుకు తగింది.



Sunday, June 10, 2018

సరసం లో గూఢం


సరసం లో గూఢం




సాహితీమిత్రులారా!


సరసం అంటేనే భార్యా భర్తల మధ్యగాని,
ప్రేయసీ ప్రియుల మధ్యగాని జరిగేది.
అవి ఎంత గూఢంగా ఉంటాయో ఇక్కడ చూడండి-

ఇక్కడ భార్యాభర్తల సుభాషణ చూద్దాం-
భోజనసమయంలో

భర్త (భార్యను) - పశువ (అన్నాడు)

భార్య(భర్తను) - కోతి    (అన్నది)

ఇందులో ఏముంది సహజమేకదా!
అదీ నిజమే


కాని ఒక అవధాని ఈ సుభాషణను ఇలా వివరించారు


భర్త (భార్యను) - ళ్లెం శుద్ధంచేసి డ్డించవే (అన్నాడు)


భార్య(భర్తను) - కోరినంత తినండి (అన్నది)


దీనిలోని గూఢత తెలిసిందికదా!


Saturday, June 2, 2018

ధరభుజగైణసింహములఁ దద్గణ


ధరభుజగైణసింహములఁ దద్గణ



సాహితీమిత్రులారా!

తెనాలి రామలింగకవి కందర్పకేతు విలాసం లోనిదే
ఈ పద్యం-

ధరభుజగైణసింహములఁ దద్గణవేణ్యవలోకనద్వయో
దరములకోడి వారిధిపదంబులఁ బుట్టలఁ బూరులన్ గుహాం
తరములఁ బూన నిక్కఁ దిన డాఁగ స్రవింపఁగ నూర్పులూర్ప స
త్వరముగ నేఁగి నీడఁ గని తత్తఱ మందఁగఁ జేసి తౌ చెలీ.

ఇది చాగంటి శేషయ్యగారు 1951లో ప్రకటించిన ఆంధ్రకవితరంగిణిలో (సంపుటం 8; పుట 39) తెనాలి రామకృష్ణుని చరిత్రలో, ‘చాటుపద్యమణిమంజరి నుండి యుద్ధృతము’ అని ఉదాహరించిన పద్యపాఠం. ఇది చాటుపద్యమని పేర్కొంటూనే, శేషయ్యగారు “ఈ పద్యము మనకు లభ్యము కాని యేకందర్పకేతువిలాసములోనిదో యై యుండునని నాయభిప్రాయము” అని కూడా సూచించారు. 1951లోనే అచ్చయినవే, ఆంధ్రకవితరంగిణి మరికొన్ని ప్రతులలో ‘దరభుజగైణసింహముల’ అన్న పాఠం కూడా ఉన్నది. అది సవరణ పాఠమై ఉంటుంది.

పద్యార్థాన్ని పరిశీలిద్దాము. కావ్యనాయిక అందాన్ని ఆమె చెలికత్తె మెచ్చుకొంటున్నదని తెలుస్తూనే ఉన్నది. అయితే, పద్యం ముమ్మొదటను ఉన్న ‘ధర’ అన్న ఉపక్రమణికకు అర్థం లేదు. అది, ఈ భూమియందు అని అర్థం చెప్పుకొని కేవలం పాదపూరకమని సరిపుచ్చుకోవటానికి వీలులేని స్థానంలో ఉన్నది. ధర భుజగైణసింహములన్, అన్నది కర్మార్థకమైతే, దానికి ‘ఓడి’ మొదలైన ధాత్వర్థాలతో ఫలాశ్రయత్వం లేదు. తత్+గణ అన్నప్పుడు ఆ ‘గణ’ శబ్దానికి అర్థం లేదు. అన్వయం లేదు. అంతకంటె, దరభుజగైణసింహముల అన్న పాఠం మేలు. ‘స్రవింపఁగ’ అన్న పదానికి పద్యంలో అన్వయం లేదు.

వేటూరి ప్రభాకరశాస్త్రిగారి చాటుపద్యమణిమంజరికి 1988లో వెలువడిన తృతీయ ముద్రణ ప్రతిలో ఈ పద్యపాఠం ఈ విధంగా ఉన్నది:

దరభుజగైణసింహములఁ దద్గతవేణ్యవలోకనద్వయో
దరముల కోడి వారిధిపదంబులఁ బుట్టలఁ బూరులన్ గుహాం
తరములఁ బూన నిక్కఁ దిన డాఁగ స్రవింపఁగ నూర్పులూర్ప స
త్వరముగ నేఁగి నీడగని తత్తఱ మందఁగఁ జేసి తౌ చెలీ.

ఇందులోనూ మొదటి పాదంలో ‘తత్+ గత’ అన్నదానికి అన్వయం లేదు. మూడవ పాదంలో ‘స్రవింపఁగ’ అని ఉన్నదానికి అర్థాన్వయాలు రెండూ లేవు. ‘స,త్వరముగ నేఁగి’ అన్న క్త్వాంత దళానికి కారకాన్వయం కనబడదు. మొదటి పాదంలో ‘తద్గళ’ అన్న పాఠాన్ని స్వీకరిస్తే, నిర్దేశకార్థాన్ని నాయికా సంబుద్ధితో అన్వయింపవలసివస్తుంది. అదీ కుదరదు.

పై ఇద్దరికంటె మునుపే, 1893లో శ్రీ గురుజాడ శ్రీరామమూర్తిగారు తమ కవిజీవితములు (పు.241)లో చూపిన పాఠం:

దర, భజ, గేణ, సింహములు తద్గళ, వే, ణ్యవలోకనద్వయో
దరముల కోడి, వారిధిపదంబులఁ బుట్టలఁ బూరులం గుహాం
తరముల పూన నిక్క, తిన డాఁగ, స్రవింప, నిటూర్పులూర్చ స
త్వరముగ నేఁగి నీడఁగని తత్తరమందఁగఁ జేసి తౌ చెలీ.

ఇందులోనూ పైని పేర్కొన్న దోషజాతం ఉండనే ఉన్నది. కాగా, మూడు పాఠాలలోనూ మూడవ పాదంలో యతి తప్పింది. గుహా(న్త)రముల – (డాఁ)గ అన్నప్పుడు అనుస్వారసంబంధ యతి చెల్లదు. కనుక దోషం. భుజగేణసింహములు అన్నచోట అపసంధి. పద్యంలో అర్థాన్వయం ఎలాగూ లేదు.

పై మూడు పాఠాలలోని దోషాలను సవరిస్తే, రామలింగకవి పద్యం ఈ విధంగా ఉంటుంది:

దర, భుజ, గైణ, సింహములు త్వ ద్గళ, వే, ణ్యవలోకనద్వ, యో
దరముల కోడి – వారిధిపదంబులఁ బుట్టలఁ బూరులన్ గుహాం
తరములఁ – బూన, నిక్కఁ, దిన, దాఁగ; భ్రమింపఁగ, నూర్పు లూర్ప, స
త్వరముగ నేఁగ, నీడఁ గని తత్తరమందఁగఁ జేసి తౌఁ జెలీ!

‘తద్గళ’ అన్న నిర్దేశానికి అర్థం లేదు. చెలికత్తెను సంబోధిస్తున్న మాట కాబట్టి – త్వత్ + గళ అని ఉండాలి. ‘డాఁగ’ అన్నప్పటి యతిదోషం దాఁగ అని సవరించుకొంటే సరిపోతుంది. అది ‘స్రవించటం’ కాదు – ‘భ్రమించటం.’ స్రవింపఁగ అన్నదానిని భ్రమింపఁగ అని దిద్దుకోవాలి. లేకపోతే పద్యార్థం బోధపడదు.

పద్యభావం ఇది: ఓ చెలీ! లోకంలో ఉపమానద్రవ్యములైన 1) దర (శంఖము) 2) భుజగ (పాము) 3) ఏణ (జింక) 4) సింహము అన్నవి వరుసగా నీయొక్క 1) గళ (కంఠము) 2) వేణి (జడ) 3) అవలోకనద్వయ (కనుగవ) 4) ఉదరములకు సాటిరాలేక – అంటే, దరము గళానికి, భుజగము వేణికి, ఏణము కన్నుగవకు, సింహము ఉదరానికి సాటి కాలేకపోయాయి. ఆ అవమానభారం వలన –

దరము గళమునకున్ ఓడి – వారిధిపదంబులన్ పూనన్; భ్రమింపఁగన్.
శంఖము గళానికి ఔపమ్యలోపం వలన సముద్రతలంలో తలదాచుకొనవలసి రాగా; భ్రమింపఁగన్ = తిరుగుళ్ళు పడగా (శంఖం నీటిలో భ్రమింపవలసిరావటం – కొట్టుమిట్టుకులాడుతుండటం అని ఒక అర్థం; తిరుగుళ్ళు అంటే శంఖానికి దక్షిణావర్తము, వామావర్తము అని భేదాలేర్పడటం అని మరొక అర్థం).

భుజగము వేణికిన్ ఓడి – పుట్టలన్ నిక్కన్; ఊర్పులు + ఊర్పన్.
పాము ఆమె జడకు సాటిరాలేక పుట్టలలో నిక్కవలసిరాగా (అనగా, తలదాచుకొనవలసిరాగా), ఊర్పులు + ఊర్పన్ = చేసేది లేక నిట్టూర్పవలసి ఉండటం (బుసలుకొడుతూ ఉండిపోవటం).

ఏణము అవలోకనద్వయమునకున్ ఓడి – పూరులన్ తినన్; సత్వరముగన్ ఏఁగన్.
జింక ఆమె కన్నుల వంటి అందమైన కన్నులు తనకు లేవన్న అవమానంకొద్దీ పూరి మేయవలసిరాగా (దురవస్థకు లోనయిందని భావం), ఆ బెదురు కారణాన పరుగులు తీయవలసిరాగా.

సింహము ఉదరమునకున్ ఓడి – గుహాంతరములన్ దాఁగన్; నీడఁ గని తత్తరమున్ + అందఁగన్.
సింహము ఆమె నడుము వంటి సన్నని నడుము తనకు లేనందువల్ల (ముఖం చెల్లక, సిగ్గుతో) గుహాంతర్భాగంలో దాగి ఉండేట్లుగా, తన నీడను చూసి తానే భయపడేట్లుగా.

ఒనర్చితివి = చేశావు. ఔన్ = అవును, ఇది నీకే తగును – అని ప్రశంసార్థం.
పద్యంలో క్రమాన్వయం సార్థకంగా ఉండటం వల్ల ఇది యథాసంఖ్యమనే అలంకారం. మెడ, జడ, కన్నులు, నడుము అన్న నాలుగు ఉపమేయవస్తువుల శోభాతిశాయిత వల్ల శంఖము, పాము, జింక, సింహము అన్న వస్త్వంతరాలను అణగింపజేశాడు. ఇది మీలనము అనే అలంకారమని కావ్యాలంకారసంగ్రహంలో భట్టుమూర్తి. ఇది పద్యంలోని అలంకారశోభ. తెనాలి రామలింగకవి వర్ణనానైపుణికి, పద్యరచనాకౌశలికి, అతివిస్తారమైన వ్యుత్పత్తిగౌరవానికి, అనల్పకల్పనాశిల్పానికి, చిత్తవిస్తారరూపమైన చమత్కృతధోరణికి నిదర్శకాలైన పద్యాలివి. దురన్వయాలను సరిచేసి సమన్వయించుకొంటే విశేషార్థాలు వెల్లడవుతాయి. మహాకవుల శబ్దసాగరం ఎంత లోతైనదో తెలిసివస్తుంది.
----------------------------------------------------
రచన: ఏల్చూరి మురళీధరరావు
ఈమాట అంతర్జాల మాసపత్రిక సౌజన్యంతో

Friday, June 1, 2018

తెనాలి రామలింగకవి శబ్దార్థ గూఢచిత్ర పద్యం


తెనాలి రామలింగకవి శబ్దార్థ గూఢచిత్ర పద్యం






సాహితీమిత్రులారా!



ప్రథమాంధ్ర కవిజీవిత చరిత్రనిర్మాత శ్రీ గురజాడ శ్రీరామమూర్తి 1893లో ప్రకటించిన తమ కవిజీవితములు సంపుటంలో చెన్నపురి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలోని వ్రాతప్రతుల ఆధారంగా, రామకృష్ణుని చాటుధారాపద్యములు అని ఉదాహరించిన వాటిలోని ఈ అందమైన పద్యం నిజానికి తెనాలి రామలింగకవి రచించిన కందర్పకేతు విలాసము లోనిది:

ఉ.   ఆ నలినాక్షి వేనలికి _నంబుధరంబు సమంబు గామిచేఁ
      దా నిరువ్రయ్యలై చనినఁ _ద ద్దశఁ జూచి దయార్ద్రులై బుధుల్
      దాని పదాంతరంబునను _దారు వసించినవారు గావునన్
      బూని తదంశమున్ సమతఁ _బోల్చిరి తత్సతి దృ క్కుచంబులన్.

శబ్దచిత్రానికి నిదర్శనార్హమైన మేలి రచనమిది. ఇటువంటి కూర్పును విద్యానాథుడు ప్రతాపరుద్రీయము లోనూ, విశ్వేశ్వర దేశికుడు తన చమత్కార చంద్రికలో ‘సతృణాభ్యవహారత్వం’ అన్నాడు. భావవ్యక్తి సుబోధం కానిదే దీనికి ప్రతిపదార్థం చెప్పటమూ, తాత్పర్యం రాయటమూ కొంచెం కష్టమే.

కందర్పకేతు విలాసము కావ్యనాయిక వాసవదత్త వేనలికి (అంటే జుట్టుకు) అంబుధరము (నీరు నిండి నలుపుతేరిన మబ్బు) తులనీయం కాలేక పోయినందువల్ల ఇరువ్రయ్యలు కాగా దాని దుర్దశను పరికించి దయగొన్న బుధుల సుకృతాచరణాన్ని వర్ణిస్తున్నది ఈ పద్యం.

ఆ పద్మాక్షి వేణీభరం నీలిమకు అంబుధరం సాటి కాలేకపోయింది. ఆ దుఃఖభారం వల్ల (ఏడ్చి ఏడ్చి గుండె పగిలి కాబోలు) అది రెండు ముక్కలయిపోయింది. ఆ దుఃస్థితిని చూసిన దేవతలకు — వారూ ఆ గగనపదంలోని వారే కనుక — జాలి కలిగింది. వేణీభరంతో ఉపమింప లేకపోతే ఏమయింది? ఆమె చూపులతో, వక్షోజాలతో తదంశమాత్రాన్నైనా పోల్చి చెప్పవచ్చును కదా! అని ఔపమ్యాన్ని ఘటించారు.

ఇంతకీ పద్యభావం ఇది:

బుధ శబ్దానికి 1) దేవత 2) కవి (లేదా) పండితుడు అని ఇక్కడ రెండర్థాలు. బుధ వృద్ధౌ పణ్డితేఽపి అని అమరకోశం. బుధః కవౌ అని విశ్వప్రకాశ కోశం. బుధౌ విద్వద్గ్ర హామరాః అని మంఖకోశం.

బుధుల్ – అంటే, దేవతలు. వారు — దాని పదాంతరంబున వసించినవారు కావునన్ — ఆ అంబుధర పదాంతరంలో, అంటే – మబ్బులకు ఉనికిపట్టయిన గగనతలంలో (దివియందు) నివసిస్తున్నవారు కాబట్టి, నాయిక వేనలితో సాటి కాలేక మనస్తాపం వల్ల దానికి కష్టకాలం దాపురించినప్పుడు వారికి దానియందు సానుభూతి.

బుధుల్ – అంటే, పండితులు కూడాను. ఆ పండితులు — దాని పదాంతరంబున వసించినవారు కావునన్ — ఆ అంబుధరమంటే వారికీ దయే. దాని పదాంతరంబున అంటే, ఆ అం బు ధ ర పదమధ్యంలో (అంతరంబున) ఉన్నవారు ఆ పండితులు. అందువల్ల వారికి దానియందు జాలి.

అంతే కాదు. అంబుధర శబ్దం ఇరువ్రయ్యలు అయి, అంబు – ధరగా విడిపోయినప్పుడు బు, ధ అనే అక్షరాలు కూడా చెఱొక పదంలోకీ పడిపోయినందువల్ల వీరూ బాధితులే. కనుకనే వీరికీ సానుభూతి.

ఇంతకీ జరిగిందేమిటంటే; అంబుధరం వేనలికి సాటి రాలేక ఇరువ్రయ్యలైనపుడు ఆ దేవతలూ, ఆ విద్వాంసులూ, తదంశముల్ పూని అంటే, ఆ విడిపోయిన పదాంతరాల అర్థాలను లేదా, ఆ పదాల అర్థాంతరాలను గ్రహించి, సమతఁ బోల్చిరి తత్సతి దృక్కుచంబులన్. వాటిని ఆమె చూపులతోనూ, ఆమె వక్షోజములతోనూ సాటి చేసి, ఎంతో కొంత ఊరటను కల్పించారు.

అంబుధర శబ్దం అంబు, ధరలుగా భిన్నత్వాన్ని పొందింది. అంబు అంటే నీరు అని అర్థం కదా. ఆ అంబు శబ్దానికి గల పర్యాయపదాల్లో ఒకటి అమృతం. అమృతం… తోయ పానీయ నీర క్షీరామ్బు శమ్బరమ్ అని అమరకోశం. అమృతమంటే నీరు అని అర్థం. అమృతమంటే దేవతలకు ఆహారమైన సుధ. న మృతా భవ న్త్యనేనే త్యమృతమ్. మృతి లేని శాశ్వతస్థితిని కల్పించే దివ్యమైన పానీయం. పీయూష మమృతం సుధా అని అమరకోశం. ఆ అమృతమును తత్ + సతి = ఆ పతివ్రతయొక్క (కందర్పకేతుని భార్య అయిన వాసవదత్త యొక్క), దృక్కులన్ = దృక్కులతో (కడకంటి చూపులతో), సమతన్ + పోల్చిరి = సమానధర్మం కలిగి ఉండటాన్ని ఉపమించారన్నమాట. కటాక్షామృతమని భావన చేశారని భావం.

ఇక, ఉత్తరపదమైన ధర అంటే భూమి. ధరా ధరిత్రీ ధరణిః. ఆ ధర శబ్దానికి గల అర్థాంతరం పర్వతం. మహీధ్రే శిఖరి క్ష్మాభృ దహార్య ధర పర్వతాః అని అమరకోశం. ఆ పర్వతమును తత్ + సతి = కుచంబులన్, సమతఁ బోల్చిరి = ధర్మసామ్యం మూలాన ఉపమించారన్నమాట.

పద్యం పూర్వార్ధంలో ఉపమేయమైన వేనలికి ఉపమానమైన అంబుధరము యొక్క ఆపకర్షను చెప్పి, ఉత్కర్ష సాధింపబడుతున్నది. ఈ ఉపమానాపకర్ష సాదృశ్యలోపం వలన సంభవించింది. అంబుధరమును ఇరువ్రయ్యలుగా చేసినప్పుడు అర్థాంతరాక్షిప్తి మూలాన సాదృశ్యం ఘటిల్లింది. మొదటిది శాబ్దమైన అపకర్ష. రెండవది ఆర్థికమైన ఔపమ్యం. ఇందులో వ్యంజన ఏమీ లేదు. పద్యంలో అంబుధర శబ్దాన్ని తీసివేసి దానికి పర్యాయంగా వేఱొక పదబంధాన్ని కూర్చితే పద్యంలోని చమత్కారం భగ్నమైపోతుంది. పదాలు పరివృత్తిని సహింపవు కనుక దీనిని ‘పరివృత్త్యసహిష్ణుత’ అంటారు. శబ్దచిత్రము యొక్క ప్రాథమికలక్షణం ఇదే.

ఉపమానోపమానాల విశేషణోపాదానం వల్ల వ్యతిరేకాలంకారం సిద్ధిస్తుందని అలంకారసర్వస్వకారుడు రుయ్యకుని నిర్వచనం. ఉపమానాని కంటె ఉపమేయానికి ఆధిక్యం సిద్ధించి, భేదప్రధానమైన సామ్యం గమ్యమానం కావటం వ్యతిరేకమని విద్యానాథుడు అన్నాడు. ఈ ఉపమేయానికి న్యూనతను ఆపాదించటం పరిపరి విధాలుగా ఉంటుంది. పైని పద్యంలో ఉపమానానికి విశేషణవిశిష్టమైన ఇతరధర్మి ప్రతిపాదింపబడినప్పుడు వ్యతిరేకానుప్రాణితమైన ఔపమ్యవ్యక్తి ఉన్నది. సామాన్యంగా వ్యతిరేకాలంకారం శ్లేషగర్భితంగానే ఉంటుంది. అయినా శబ్దచిత్రంలోని అలంకర్మీణతకే ప్రాధాన్యవివక్ష.

తెనాలి రామలింగకవి కందర్పకేతు విలాసం రచించిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకు అదే కథను తీసికొని పెద్దాపురం సంస్థానంలోని వక్కలంక వీరభద్రకవి వాసవదత్తా పరిణయమును చెప్పాడు. అందులోని కల్పన ఇది:

ఉ.   కొప్పు ఘనంబు; చూడ నల క్రొమ్ముడి కన్న సమున్నతప్రభన్
      విప్పగుఁ గన్నుదోయి; కచవిభ్రమరోచి కెక్కుడై
      యొప్పగుఁ జన్ను లున్నతి; సముజ్జ్వల కైశికదృక్కుచప్రభల్
      గప్పుఁ బృథుత్వవైభవముఁ గాంచి కటిస్థలి, లేమ కెన్నఁగన్. – (2-64)

అయితే, తెనాలి రామలింగకవి చిత్రకర్మశిల్పం, సతృణాభ్యవహారత్వం, శబ్దగూఢత్వం, చమత్కృతధోరణి ఆయనకు పట్టుబడలేదు. తెనాలి రామలింగకవి అంతటి విశాలమైన పాండిత్యనైపథ్యం ఉన్నవాడు కాడు. అందువల్ల ఆయన కవిత్వం కథాకథనమాత్రం పర్యవసాయిగా మిగిలిపోయింది. ‘తత్సతి దృక్కుచంబులన్’ అన్న దళాన్ని మాత్రం ఒకపాటి చాయాసంవాదంగా అనుసరణిస్తూ ‘సముజ్జ్వల కైశిక దృక్కుచప్రభల్’ అన్నాడు.

ఇదొక అర్థనిర్ణయం దుష్కరమైన ప్రౌఢపద్యం. అయితే, చమత్కృతిమత్కృతి. ఆ చమత్కారం చిత్తవిస్తార రూపం అని పెద్దలన్నారు. చిత్తానికి విస్తృతిని సాధించిపెట్టే వ్యాసంగం అన్నమాట. అది విస్మయాపర పర్యాయం అని సాహిత్యదర్పణంలో విశ్వనాథు డన్నాడు. ఊర్జస్వలమైన ఆ వచశ్శోభకు పాఠకుడు ఆశ్చర్యచకితు డైనప్పటి ఆ స్థితి కవికీ, సహృదయుడికీ ఇద్దరికీ అభిలషణీయమే. తిక్కన నిర్వచనోత్తర రామాయణంలో వాడిన ‘ఆనంద సాంద్రస్థితి’ కవి-సహృదయు లిద్దరికీ అనుభవనీయమే. అది రసోత్తరం కాదనటం భావనీయం కాదు. కవిత్వమే జీవితంగా వెలసి విలసిల్లిన ఆ మహానుభావుల సరస్వతీతత్త్వం ఒక్కొక్క సన్నివేశంలో ఒక్కొక్క రీతీమహితమై ఎన్ని భంగులలో సాక్షాత్కరించినదో తలచుకొంటే ఎటువంటివారికైనా హృదయోల్లాసంగా ఉంటుంది.
--------------------------------------------------------
రచన: ఏల్చూరి మురళీధరరావు,
ఈమాట అంతర్జాల మాసపత్రిక సౌజన్యంతో

Wednesday, May 16, 2018

ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం!


ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం!




సాహితీమిత్రులారా!

ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం!
అనే పేరున ఒక వ్యాసం డా. ఏల్చూరి మురళీధరరావుగారు
ఈ మాట అంతర్జాల మాసపత్రికలో వ్రాసియున్నారు
అందుండి ఈ పద్యాన్ని ఇక్కడ వారి వివరణను
యథాతథంగా ఉంచుతున్నాను ఆస్వాదించండి-

వేయేండ్లుగా వెలసి విలసిల్లుతున్న ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం ఏది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పటం సులభమేమీ కాదు. వేలకొద్దీ వెలసిన కావ్యాలలో అప్రతీతపదప్రయోగం వల్ల, అన్వయక్లేశం మూలాన, భావప్రౌఢి కారణవశాన అర్థనిర్ణయం దుష్కరమైన పద్యాలెన్నో ఉన్నాయి. ఇప్పుడా అలవాటు లేదు కాని, ఒకప్పుడైతే విద్యాగోష్ఠులలో —

కమలాకరకమలాకర
కమలాకర కమల కమల కమలాకరమై
కమలాకర కమలాకర
కమలాకరమైన కొలను గని రా సుదతుల్.

— వంటి పద్యాలనిచ్చి అర్థతాత్పర్యాలు చెప్పమనటం పరీక్షకులకూ, పరీక్ష్యులకూ ఒక కేళీవినోదంకరణగా ఉండేదట. మాడుగుల సంస్థానానికి వెళ్ళినపుడు అల్లమరాజు సుబ్రహ్మణ్యకవిగారిని ఈ పద్యానికి అర్థం చెప్పమని అడిగారట. తెనాలి రామకృష్ణకవి కందర్పకేతువిలాసములోని శబ్దచిత్రం ఇది.

ఆ సుదతుల్ – అందమైన పలువరుసతో అలరారుతున్న ఆ సుందరాంగులు; కమలా = లక్ష్మీదేవియొక్క, కరకమల = పద్మము వంటి చేయి, ఆకర = ఉనికిపట్టుగా కలిగిన, కమల = తామరపూవునకు, ఆకర = జన్మస్థానమై, కమల కమల కమలాకరమై – కమల = బెగ్గురు పక్షులకు, కమల = పరిశుద్ధజలములకు, కమల + అ = పద్మములయొక్క సమూహమునకు, ఆకరమై = నివేశనమైనది; కమలాకర – క = మన్మథునియొక్క, మ = సమ్మోహనకరమగు, లా = వశీకరణశక్తిని, కర = కూర్చునదై, కమలాకర – కమలా = పద్మినీజాతి స్త్రీలకు, క = శరీరములందు, ర = కామాగ్నిని ఉద్దీపింపజేయునదై, కమలాకరము + ఐన = సర్వసంపత్ప్రదమైన, కొలనున్ = సరోవరమును, కనిరి = నేత్రపర్వముగా వీక్షించిరి – అని అన్వయించుకోవాలి. సుబ్రహ్మణ్యకవిగారు ప్రవచించిన సంప్రదాయార్థం లభింపనందువల్ల నేను ఉన్నంతలో పద్యాన్ని మేనమామ పోలికగా అన్వయించాను.

అల్లంరాజు సుబ్రహ్మణ్యంగారి వివరణకంటే ఇందే బాగుందని
నా అభిప్రాయం ఎందుకంటే అది నేను ఒకసారి చూసి
ఉన్నాను. అందుకే ఇది ఇక్కడ ఉంచడం జరిగింది.

Wednesday, February 21, 2018

ఒకే పద్యంలో రామాయణం


ఒకే పద్యంలో రామాయణం




సాహితీమిత్రులారా!



వెల్లూరు నరసింగకవి కృత,
రాచకన్యాపరిణయం అనే కావ్యంలో
కవి దశావతార స్తుతి సందర్భంలో
చేసిన రామస్తుతి ఈ పద్యం.
ఈ పద్యంలో ప్రధానాంశాలతో
సంగ్రహ రామాయణంలా కూర్చాడు.
దీనిలో ప్రతికాండను గురించి కనబడుతుంది
కాని సుందరకాండను వదలివేశాడు
కారణం అందులో రాముడు చేసినదిగాని
అగుపించడంగాని లేదుకదా అందువల్లట.

గమి యాగాహితులం జయించి, హరకోదండంబు ఖండిం చి, సీ
తమనాసక్తి పరిగ్రహించి, భృగురామాటోపమున్ మాన్పి, శీ
ఘ్రమె సాకేతపుటాస బెంచి, వనులంగష్టించి, సుగ్రీవనా
మము హెచ్చించి, దశాస్యునొంచితివి రామస్వామివై మాధ వా!
                                                                                      (రాచకన్యా పరిణయము - 2- 157)
విశ్వామిత్రుని యాగం రక్షించి, శివధనుర్భంగము,
సీతాపరిగ్రహణము, పరశురామ గర్వభంగము, దశరథుని
రామపట్టాభిషేక ప్రయత్నము, అరణ్యవాసము,
వాలివధ, రావణసంహారము మొదలైన ముఖ్యాంశాలు వర్ణితాలు.
బాల అయోధ్యకాండలు, అరణ్యకిష్కింధకాండలు, యుద్ధకాండలు
ఇందులో కనిపిస్తాయి. సుందరకాండలో రామప్రసక్తి పరోక్షంలో
వుందికాని దాని విషయం ఇందులో ప్రస్తావించలేదు కవి.


Saturday, December 30, 2017

జలధిశ్రుతినిధిశశి


జలధిశ్రుతినిధిశశి




సాహితీమిత్రులారా!


మన కవులు వారు వ్రాసిన కృతి
ఏ సంవత్సరంలో వ్రాయబడిందో
వారు వారి కృతిలోనే గూఢంగా
చెప్పిన తీరు ఇక్కడ చూద్దాం-

జలధి శ్రుతినిధి శశి సం
ఖ్యలఁగ్రీస్తుశకాంచిత గతియగు తారణయం
దలి కార్తికాదిలో రా
జిలు తదియన్ దీని నేరచించితి గృష్ణా

రాప్తాడి ఓబిరెడ్డిగారు 
తన నిరోష్ఠ్యకృష్ణశతకంలో
98వ పద్యంగా దీన్ని కూర్చారు.
దీనిలో క్రీస్తుశకం సంవత్సరం గూఢపరచడం జరిగింది
దాని ఎలా గుర్తించాలో చూడండి-
ఈ పద్యం మొదట్లో జలధిశ్రుతినిధిశశి
అని వాడారు దీని అర్థం గ్రహిస్తే సంవత్సరం దొరికినట్లే
ఇక్కడ దీనిలో నాలు పదాలున్నాయి అవి
జలధి, శ్రుతి, నిధి, శశి - వీటికి ఇలా అర్థం తీసుకోవాలి
జలధి - సముద్రం - సముద్రాలు నాలుగు
శ్రుతి - వేదాలు - వేదాలు నాలుగు
నిధి - నిధులు - నవనిధులు
శశి - చంద్రుడు - ఒకటి
వీటిని చివరనుండి తీసుకుంటే

శశి(1), నిధి(9), శ్రుతి (4), జలధి(4)
అంటే - 1944లో వ్రాశారు అని చెప్పుకున్నాడు
కవిగారు.

Thursday, December 14, 2017

నాకు భూమిని దానం చేయవయ్యా


నాకు భూమిని దానం చేయవయ్యా




సాహితీమిత్రులారా!


ఒకానొక కవి సమాసాలపేర్లతో తన స్థితిని
వర్ణించి చెప్పి రాజు మన్ననలతో 
భూమిని పొందాట 
సమాసాలతో కూర్చిన ఆ శ్లోకం చూడండి-

ద్వన్ద్వో ద్విగురపి చాహం
మద్గేహే నిత్య మవ్యయీ భావః
తత్పురుషః కర్మధారయ 
యేనాహం స్వామ్ బహువ్రీహిః



ద్వన్ద్వో ద్విగురపి చాహం
మద్గేహే నిత్య మవ్యయీ భావః
తత్పురుషః కర్మధారయ 
యేనాహం స్వామ్ బహువ్రీహిః

మేము భార్యాభర్తలము(ద్వన్ద్వః)
పైగా మాకు రెండు గోవులున్నాయి(ద్విగుః)
మాయింట్లో వ్యమనేది లేదు. వ్యయించటానికేమైనా
వుంటేకదా(అవ్యయీభావః) కనుక అయ్యా(తత్ పురుష)
నేను బహుధాన్యం కలవాణ్ణి (బహువ్రీహిః) అయ్యే పని
చెయ్యి (కర్మధారయ)
నాకు భూమిని అనుహ్రహించవయ్యా మహారాజా - అని భావం







Friday, October 6, 2017

గూఢచిత్రం


గూఢచిత్రం




సాహితీమిత్రులారా!



సమాజంలో తిన్నగా మాట్లాడటం కంటె
గూఢంగా మాట్లాడడం కొందరికి అలవాటు
కొన్ని విషయాలను నేరుగాగాక గూఢంగా
చెప్పి ఆనందించడం అలవాటుగా ఉన్నవారు
సమాజంలో కనబడుతుంటారు. అలాంటి
వాటిలో కొన్ని............

దింపడే వాన సిరా

అని కొందరితో వ్రాయించి
తిప్పి చదవమంటుంటారు

వ్రాసి తిప్పి చదవండి-
ఇదోక విలోమ(గతిచిత్ర) చమత్కారం.

ఇలాకాక పద్యంలోని పాదాల మొదటి అక్షరాలను కలుపగా
ఒక రకమైన బూతు, చివరి అక్షరాలు కలుపగా మరోరకమైన
బూతుమాటలు వచ్చే పద్యం ఇది దీన్ని సెట్టి నరసింహంగారు
కూర్చారు చూడండి-

పూర్ణశశి సమమై మోము పొలిచెనేమొ
కురులపేరి మబ్బులు దగుల్కొనియె నడ్డ
నాతి మిన్న తోడ నిన్న మగ లాగు
కుతుకమున సల్పఁ దానెపై కొన్నయపుడు

పై చెప్పిన ప్రకారం కూర్చుకొని చూడండి మీకే తెలుస్తుంది.
ఇలాంటివి ఆ కాలంలో ఒక ప్రత్యేక ప్రయోజనమాసించి
వ్రాశారని కొందరంటున్నారు. అదేమో మనకు తెలియదు.

Tuesday, October 3, 2017

గూఢచిత్రం


గూఢచిత్రం




సాహితీమిత్రులారా! 



ఈ చిత్రం చూడండి-



దీన్ని క్రింది నుండి పైకి త్రిప్పితే
ఈ చిత్రం వస్తుంది. దీన్ని చూడండి-






Wednesday, September 13, 2017

శ్రీ శ్రీ - లోని వింతేమిటి?


శ్రీ శ్రీ - లోని వింతేమిటి?




సాహితీమిత్రులారా!


ఈ చిత్రమేమిటో చూడండి-
శ్రీ శ్రీ అని వ్రాయబడిన చిత్రంలోని
వింతేమిటో గమనించండి-


Thursday, September 7, 2017

శివశివ రాతి రాతి శ్రితజీవన


శివశివ రాతి రాతి శ్రితజీవన




సాహితీమిత్రులారా!


ఈ గూఢచిత్ర పద్యం చూడండి-

శివశివ రాతి రాతి శ్రితజీవన జీవన యాత్మ యాత్మ బాం
ధవధవ రాజిరాజిత పదావర దావర ధీరధీర దీ
నవనవ సంతసంతత సునందన నందన భాను భాను గౌ
రవరవ కాండకాండద నిరంజన రంజన కాయకాయజా
                                                                              (సారంగధరీయము - 4-123)

శివ - శుభమైన, శివరాతి - శంకర ఆప్తుడగు కుబేరుని వంటి,
రాతి - ఈవినిగలవాడా, శ్రితజీవన - ఆశ్రితులకు జీవనమైనవాడా,
జీవ - బృహస్పతివంటి, నయ - నీతియుక్తమైన, ఆత్మ -
బుద్ధిగలవాడా, ఆత్మబాంధవ - ప్రాణస్నేహితులైన,
ధవరాజి - రాజసముదాయముచేత, రాజిత - ప్రకాశింపబడిన,
పదా - స్థానముగలవాడా, వరదా - కోర్కెల నిచ్చువాడా,
వర - శ్రేష్ఠమైన, ధీర - పర్వతమువంటి, ధీర - ధైర్యముగలవాడా,
దీనవన - దీనజనులనే అరణ్యమునకు, వసంత - వసంతునివంటివాడా,
సంతత - నిరంతరమును, సునందన -
మంచి సంతానముయొక్క, నందన - సంతోషముగలవాడా,
భాను - సూర్యుని వంటి, భాను - కాంతులుగలవాడా,
గౌరవ - గురుత్వమైన, రవ - ధ్వనులయొక్క, కాండ -
సముదాయమునందున, కాండద - మేఘమువంటివాడా,
నిరంజన - దోషరహితమైన, రంజన - రంజించునట్టి,
కాయ - శరీరము నందున, కాయజా - మన్మథునివంటివాడా

ఇది అర్థకాఠిన్యం కారణంగా గూఢచిత్రంగా చెప్పబడుతున్నది.

Monday, September 4, 2017

సిప్రాలి - శ్రీ.శ్రీ.


సిప్రాలి - శ్రీ.శ్రీ.




సాహితీమిత్రులారా!


సిప్రాలి అనే శ్రీ.శ్రీ. కావ్యము
పేరును ఎలాసూచించారో చూడండి-

ఇందులో మూడు రకాల కవితలున్నాయి.

1. సిరిసిరిమువ్వలు

2. ప్రాసక్రీడలు

3. లిమఋక్కులు





Friday, August 18, 2017

విభక్తి గూఢము


విభక్తి గూఢము




సాహితీమిత్రులారా!



ఒక పద్యం లేక శ్లోకంలో కర్తను మరుగుపరచిన
దాన్ని కర్తృగూఢమంటారు. అలాగే విభక్తిని మరుగు
పరచిన విభక్తిగూఢము అంటారు.
దీని ఉదాహరణగా ఈ శ్లోకం చూడండి-

పాయా న్మా మురసావితః శ్రియమునా రాధ్యాం ప్రపద్యేత మాం
కోవా న స్థిర మశ్నుతే శమధనో2 ప్యాలోకితో జాతుచిత్
వేదాంతై ర్వినుతాంఘ్రయే న కి ముతశ్శ్రేయోనతిం తన్వ తాం
సేవా మో రచయామి మానస సదా భక్త్యా పహా వాదరమ్

దీనిలో సప్త విభక్తులు- ప్రథమావిభక్తి నుండి సప్తమీవిభక్తి వరకు
ఉన్న 7 విభక్తులు గూఢం చేయబడినవి. అవి తెలియాలంటే
ముందుగా శ్లోకాన్ని పదవిభాగాలుగా చేసుకోవాలి-
పదవిభాగం-
పాయాత్, మాం, ఉరి, అసే, ఇతః, శ్రియం, ఉనా,
ఆరాధ్యాం, ప్రపద్యేతమాం, కరి, వా, న, స్థిరం, అశ్నుతే,
శం, అధనః, అపి, ఆలోకితః, జాతుచిత్, వే, దాంతైః,
వినుతాంఘ్రయే, న, కిమ్, ఉతః, శ్రేయః, నతిం,
తన్వతాం, సేవాం, ఓః, రచయామి, మానస, సదా,
భక్త్యా, ఆవహ, ఔ, ఆదరమ్.

దీనిలో లక్ష్మీ వాచకమైన ఉ - శబ్దం యొక్క ఏడు విభక్తులు
సంధిమూలంగా దాగిఉన్నాయి.
ఓ మనసా, లక్ష్మి యందు ఎల్లపుడు ఆదరాన్ని కలిగి ఉండమని
కోరే శ్లోకం ఇది.
ఉరసాపాయాత్, వేదాంతైః, సేవామో, భక్త్యావహౌ
మొదలైన చోట్ల అపార్థ భ్రమ కలిగించే విధంగా
శ్లోకం కూర్చబడింది.
ఉ - శబ్దానికి క్రమంగా 7 విభక్తులలో రూపాలు-
ఉః, ఉం, ఉనా, వే, ఓః, ఓః, ఔ - అని ఉంటాయి.
శ్లోకంలో ఉరసా అనే చోట ఉః - అనే ప్రధమ(కర్త) గుప్తము.
శమధనః - లో శం అనే ద్వితీయ(కర్మ) గుప్తమైంది.
యమునా రాధ్యాం - లో ఉనా - తృతీయవిభక్తి(కరణం) గుప్తం.
శ్రియముతః - లో ఉతః - అనే చోట పంచమీ(అపాదానం) గుప్తం
పంచమ్యర్థంలో తసిల్ ప్రత్యయం - సేవామోరచయామి - అనే చోట
ఓః - అని షష్ఠి గుప్తము, భక్త్యావహౌ - అనే చోట ఔ - అనే సప్తమీ గూఢంగా ఉంది.

ఈ లక్ష్మి నన్ను కాపాడుగాక,
శివునిచే పూజింప దగిన లక్ష్మిని
నేను ఆశ్రయిస్తున్నాను.
ఆమె కటాక్షానికి పాత్రుడైన
ఏ దరిద్రుడు సంపదను పొందడు
దాంతులైన మునులచే నమస్కరించబడు
లక్ష్మి వలన వారికి శ్రేయస్సుకలుగుటలేదా
ఓ మనసా........ లక్ష్మి యందు ఆదరము
కలిగి ఉండుము. ఆమెకు సేవ చేస్తాను-
శ్లోక భావం.

Saturday, August 12, 2017

ఒకరి కొకరు ఘనులు గారె


ఒకరి కొకరు ఘనులు గారె




సాహితీమిత్రులారా!




ఈ గూఢచిత్రపద్యం చూడండి-

అతఁడు నందికేశ్వరావతార మతండు
పుత్రకుండు భోగి భూషణునకు
శౌరి మూఁడవ యవతార మాతండ; సా
క్షాత్తు నొకరి కొకరు ఘనులుగారె


నందికేశ్వరాతారము - ఎద్దు
భోగి భూషణుడు - శివుడు
శివుని పుత్రుడు - కుక్క(భైరవుడు)
శౌరి మూడవ అవతారం - పంది(వరాహము)

Monday, July 31, 2017

చతుర్థ పాద గోపనము


చతుర్థ పాద గోపనము




సాహితీమిత్రులారా!


రావూరి దొరస్వామి గారి పద్యం ఇది

ఈ పద్యంలోని నాలుగవ పాదము
మొదటి మూడు పాదములలో
గుప్తము చేయబడి ఉంది అది గమనించడమే
ఇందులోని చిత్రం దీన్ని చతుర్థపాద గూఢమంటారు.


విశ్వపాలక భాసిల్లు వితమయంబు
పిసగనమి మహిమను బెనుపు సరి మాద్రి
యెనయ జలజాక్ష గురుపాద గనయము నను

దీనిలోని నాలుగవ పాదం చూడాలంటే
మొదటి పాదం మొదటి అక్షరం మొదలు
రెండు అక్షరములను వదలుతూ మూడవ అక్షరం
తీసుకుంటే నాలుగవపాదం వస్తుంది.

విశ్వపాక భాసిల్లు విమయంబు
పిసనమి హిమను బెనుపు సరి మాద్రి
యెయ జజాక్ష గురుపా గనము నను

నాలుగవ పాదం-
విలసితంబుగ మనువు మానలఁగు దయను 

పూర్తి పద్యం-

విశ్వపాలక భాసిల్లు విత్తమయంబు
పిసగనమి మహిమను బెనుపు సరి మాద్రి
యెనయ జలజాక్ష గురుపాద గనయము నను
విలసితంబుగ మనువు మానలఁగు దయను