Showing posts with label ఏకాక్షర పాదచిత్రం. Show all posts
Showing posts with label ఏకాక్షర పాదచిత్రం. Show all posts

Wednesday, September 14, 2016

ఏకాక్షర పాదచిత్రం

ఏకాక్షర పాదచిత్రం



సాహితీమిత్రులారా!

ఈ శ్లోకాన్ని చూడండి
ఇది ఒక పాదంలో ఒకే హల్లును ఉపయోగించి కూర్చిన శ్లోకం కావున దీన్ని
ఏకాక్షర పాదచిత్రం అంటాము. ఇది మాఘకవి శిశుపాలవధలోని శ్లోకం చూడండి

జజౌజోజాజిజిజ్జాజీ
తం తతో2తితతాతతుత్
భాభో2భీభాభిభూభాభూ
రారారిరరిరీరర:
              (శిశుపాల వధ - 19-03)

యుద్ధశీలుడును, రణకోవిదుల శౌర్యముచేత
సంభవించిన సంగ్రామాలను జయించినవాడు,
శుక్రాది తారల కాంతివంటి కాంతిగలవాడై భయమెరుగని
ఏనుగుల ఓడింపగల పౌరుషమునకు ఆశ్రయమైనవాడు ఐన
బలభద్రుడు శత్రువైన వేణుదారుని సమీపించెను.


ఇందులో నాలుగు పాదాలలో ప్రతి పాదమున
ఒక హల్లుమాత్రమే ఉయోగించి
శ్లోకాన్ని కూర్చాడు మాఘకవి.
ఇందులో మొదటిపాదంలో - ,
రెండవ పాదంలో- ,
మూడవ పాదంలో- ,
నాలుగవ పాదంలో -   ను
ఉపయోగించాడు అచ్చులు ఏవైనా వాడవచ్చు
దీన్ని ఏకాక్షర పాదశ్లోకంగా చెబుతారు.