గోపురబంధం
సాహితీమిత్రులారా!
నాదెళ్ళ పురుషోత్తమకవి కృత
చిత్రకందపద్యరత్నాకరం - లోని
గోపురబంధం చూడండి-
రామా మహితా మనమున
నీమంబును గొని తలంతు నినుఁగను గతి నీ
నామమునె యనుదు మనుపవె
ప్రేమ న్సతతంబు మీకు భృత్యుండ గదా
గోపురబంధం-
సాహితీమిత్రులారా!
నాదెళ్ళ పురుషోత్తమకవి కృత
చిత్రకందపద్యరత్నాకరం - లోని
గోపురబంధం చూడండి-
రామా మహితా మనమున
నీమంబును గొని తలంతు నినుఁగను గతి నీ
నామమునె యనుదు మనుపవె
ప్రేమ న్సతతంబు మీకు భృత్యుండ గదా
గోపురబంధం-
సాహితీమిత్రులారా!
కొడవలూరి రామచంద్రరాజుగారి
మహాసేనోదయం నుండి
ఈ గోమూత్రికాబంధం ఆస్వాదించండి-
సురనరవరపరిపాలా
శరనిధిగర్వాపవిజిత శౌర్యవిధానా
మరపరహర భరితైలా
హర విధిశర్వాణివినుత యార్యనిధానా
(2- 253)
దీనిలో పూర్వర్థము పొడవుగా వ్రాసి
దానిక్రింద ఉత్తరార్థం వ్రాయగా
ఈ విధంగా వస్తుంది-
సురనరవరపరిపాలా శరనిధిగర్వాపవిజిత శౌర్యవిధానా
మరపరహర భరితైలా హర విధిశర్వాణివినుత యార్యనిధానా
ఇపుడు ప్రతి పాదములో 2,4,6,8,10,12,14 అక్షరాలను
అంటే సరిసంఖ్యలోని అక్షరాలను గమనిస్తే
రెండింటిలోనూ ఒకే వర్ణం ఉన్నట్లు గమనించగలం.
సురనరవరపరిపాలా శరనిధిగర్వాపవిజిత శౌర్యవిధానా
మరపరహర భరితైలా హర విధిశర్వాణివినుత యార్యనిధానా
దీన్ని ఈ క్రిందివిధంగా వ్రాయడం వలన
గోమూత్రికా బంధమవుతుంది -
సాహితీమిత్రులారా!
కొడవలూరు రామచంద్రరాజు కృత
మహాసేనోదయం నుండి
పుష్పమాలికాబంధం
ఆస్వాదించండి-
జనకనరేనజాస్య జలజన్మజగద్దృశ కాశభేశచం
దనవనఫేనకీర్తి నగనన్దనసేవ్యపదాపదాపహా
వినయనదీనతుల్య విలువిద్యవిభాసిత పాతకాంతకా
బ్జనయన దానశౌండ పరిపన్దిపలాశన కానవానలా
ఈ మాలలో 12 పుష్పాలున్నాయు.
ఒక్కొక పుష్పంలో 7 అక్షరాలున్నాయి
మొదటి పుష్పంలో ఈ లాగున్నాలిచూడండి-
జ
రేనక
జా
దీనిలో 5 అక్షరాలే కనిపిస్తాయి
కాని చదవడంలో 7 అక్షరాలోస్తాయి
జనకనరేనజా - ఇందులో 7 అక్షరాలున్నాయి కదా
ఇలాగే ఏడు రెండ్ల 14 అక్షరాలు
తగ్గిపోతాయి ఈ బంధరచనవల్ల
పద్యం చూస్తూ బంధచిత్రాన్ని చదవండి
అంతా తెలిసిపోతుంది.
సాహితీమిత్రులారా!
శ్రీకొడవలూరు రామచంద్రరాజు కృత
మహాసేనోదయములోని ప్రథమాశ్వాసములోని
ఈ పద్యం ఖడ్గబంధంలో కూర్చబడినది-
చూడండి-
పురహరసురనుతపాదా
కరిదై తేయాసుహర్త కంధినిషంగా
గిరిజాహృదయరంజన
సరసీరుహనాభమిత్ర సమ్మనిసంగా
చిత్రము చదవడం సులభతరం చేయడం కోసం
కవిగారు చిత్రములో పాదము సంఖ్యలు చూపడం
జరిగింది సులువుగా చదువవచ్చు.
పద్యాన్ని చూస్తూ బంధచిత్రం చూచి చదవండి
కవి ఎలా బంధాన్ని రచించారో అవగతమౌతుంది.
సాహితీమిత్రులారా!
శ్రీకొడవలూరు రామచంద్రరాజు కృత
మహాసేనోదయము నందు గల
గిరిబంధము పద్యం చూడండి-
గిరిబంధములో మొదట 1 అక్షరము,
తరువాత 3 అక్షరములు, 5 అక్షరములు,
7 అక్షరములు, 9 అక్షరములు, 11 అక్షరములు,
11 అక్షరములు ఉండునట్లు కూర్చబడిన చిత్రములో
చూపిన విధంగా వ్రాసిన గిరిబంధము ఏర్పడును.
ఈ విధంగా వ్రాయడం వలన పైనుండి మధ్యలో
కవి పేరుగాని, ఇష్టదేవత పేరుగాని కవి కూర్చును
ఈ పద్యంలో కొడవలూరి రామచంద్రరాజు గారు
తన ఇష్టదైవమైన శ్రీరామలింగేశ్వరుని
నమస్కరించిన విధంగా కూర్చారు.
శ్రీహీరాన్గద కమలద
వాహ నిలింపార్చితాంఘ్రి వనజాగసుత
స్నేహ మునినిచయవంద్యా
దేహజగర్వాద్రికులిశ దేవసుచరితా
సాహితీమిత్రులారా!
వేదాంతదేశికుల వారి పాదుకా సహస్రంలోని
బంధచిత్రాలను వీక్షించండి-