Wednesday, February 28, 2018

ఓరోరి అన్నరో, నీ వళ్లంతా ముళ్లురో


ఓరోరి అన్నరో, నీ వళ్లంతా ముళ్లురో




సాహితీమిత్రులారా!





ఈ విచ్చుడు కథలను వినండి విప్పండి

ఓరోరి అన్నరో, 
నీ వళ్లంతా ముళ్లురో,
కారాకు పచ్చరా,
నీ కండంతా చేదురా

దీనికి ఒళ్లంతా ముండ్లు
మరి రంగో కారు(దట్టమైన) పచ్చ
దీని కండంతా చేదు -
అదేమిటో చెప్పాలి.

సమాధానం - కాకరకాయ

ఓహోహో రాజుగారు
వళ్లంతా గజ్జి ఏమిటండీ
కండంతా తీపేమిటండీ

దీని ఒళ్లంతా గజ్జి
కండేమో తీపి ఇదేమిటో చెప్పాలి-

సమాధానం - సీతాఫలం

ఓహో సన్నాసి -
నీ పెయ్యనిండా విభూతి 
నీ సేతులకు శంఖుచక్రాలు
నెత్తిన రుద్రాక్షలు

దీని ఒళ్లంతా విభూతి
చేతులేమో శంఖచక్రాలు
నెత్తిమీద రుద్రాక్షలట-
ఇదేమిటో చెప్పాలి

సమాధానం - ఆముదం చెట్టు

Tuesday, February 27, 2018

పాతువో గిరిజామాతః


పాతువో గిరిజామాతః




సాహితీమిత్రులారా!



అనేకార్థక (శ్లేషాలంకార)చిత్రం-

పాతువో గిరిజామాతా
యస్య ద్వాదశలోచనః
పాతువో గిరిజామాతా
ద్వాదశార్థర్థలోచనః

ఇది కుమారస్వామిని, శివుని ఇద్దరికి
నమస్కారం పెట్టినట్లు చెప్పే
శ్లోకం. ఇందులో 1,3 పాదాలు
ఒకలానే ఉన్నాయి కానీ అర్థంలో
మార్పు వున్నది. ఇక్కడ ఈ శ్లోకానికి
గరికపాటివారి వ్యాఖ్యానం చూద్దాం-
ఈ వీడియో వీక్షించండి.
దీనితో పాటు
ఒక దత్తపదిని కూడ వినండి.



Monday, February 26, 2018

పూతమెఱుంగులుం


పూతమెఱుంగులుం



సాహితీమిత్రులారా!



భువన విజయ సభలో ఒకమారు కృష్ణదేవరాయలు
కవితాకళగురించి ఆశువుగా చెప్పినవారికి గండపెండెరము
తొడుగుతానని ప్రకటించాడు దానికి ఎవరు స్పందించక
పోవడంతో కృష్ణదేవరాయలు ఈ విధంగా చెప్పాడు-

ముద్దుగ గండపెండెరమున్ గొనుఁడంచు బహూకరింపఁగా
నొద్దిక నాకొసంగుమని యొక్కరు గోరగలేరు లేరకో

దీనికి అల్లసానిపెద్దన లేచి -
పెద్దనబోలు సత్కవులు పృథ్విని లేరని నీవెరుంగవే
పెద్దనకీదలంచినను బేరిమి నాకిడు కృష్ణరాణ్ణృపా

అని మిగిలిన పద్యం పూరించి ఈ విధంగా
రాయలువారు అడిగిన విధంగా కవితాకళను గురించి
ఆశువుగా చెప్పిన ఉత్పలమాలిక(29 పాదాలు)

  1. పూతమెఱుంగులుం బసరుపూపబెడంగులుఁ జూపునట్టి నా
  2. కైతలు జగ్గునిగ్గునెనగావలెఁ గమ్మునగమ్మనన్వలెన్
  3. రాతిరియుంబవల్ మఱపురాని హొయల్ చెలియారజంపు ని
  4. ద్దాతరితీపులంబలెను దారసిలన్వఁలె లోఁదలంచినన్
  5. బ్రాతిగఁబైకొనన్వలెను బైదలికుత్తుకలోని వల్లటీ
  6. కూతలనన్వలెన్ సొగసుకోర్కులు రావలె నాలకించినన్
  7. జేతికొలందిఁ గౌఁగిటను జేర్చిన గన్నియచిన్నిపొన్నిమే
  8. ల్మూతల చన్నుదోయివలె ముచ్చటగావలె బట్టిచూచినన్
  9. డాతొడనున్నమన్నులమిటారపు ముద్దుగుమ్మకమ్మనౌ
  10. వాతెఱ దొండపండువలె వాచవిగావలెఁ బంటనూదినన్
  11. గాతలదమ్మిచూలిదొర కైవసపుంజవరాలి సిబ్బెపు
  12. న్మేతెలియబ్బురంపుజిగినిబ్బర పుబ్బగు గబ్బిగుబ్బపొం
  13. బూతల నున్నకాయ సరిపోడిమి కిన్నెరమెట్లబంతి సం
  14. గాతపు సన్నబంతి బయకారపుఁగన్నడ గౌళవంతుకా
  15. సాతతతానతానల వసం దివుటాడెడు కోటమీటుబల్
  16. మ్రోతలునుంబలెన్ హరువు మొల్లము గావలె నచ్చతెన్గు లీ
  17. రీతిగ, సంస్కృతంబు పచరించినపట్టున భారతీవధూ
  18. టీ తపనీయగర్భనికటీభవదాననపర్వసాహితీ
  19. భౌతికనాటకప్రకరభారతభారతసమ్మతప్రభా
  20. పాతసుధాప్రపూరబహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ
  21. జాతకతాళయుగ్మలయసంగతిచుంచువిపంచికామృదం
  22. గాతతతేహిత త్తహితహాదితదంధణుదాణుధింధిమి
  23. వ్రాతలయానుకూలపదవారకహూద్వహహారికింకిణీ
  24. నూతన ఘల్ఘలాచరణ నూపుర ఝాళఝళీమరంద సం
  25. ఘాతవియద్దునీచకచకద్వికచోత్పలసాసంగ్రహా
  26. యాతకుమారగంధవహహారిసుగంధవిలాసయుక్తమై
  27. చేతము చల్లఁజేయ వలెఁజిల్లునఁజల్లవలె న్మనోహర
  28. ద్యోతక గోస్తనీఫలమధుద్రవగోఘృతపాయసప్రసా
  29. రాతిరసప్రసారరుచిరప్రసరంబుగ సారెసారెకున్


దీనిలో ఉన్న ప్రత్యేకత మొదటంతా అచ్చతెనుగు పదాలతో కూర్చి
చివరికి సంస్కృతపదాలతో కూర్చారు పెద్దనగారు. కావున దీన్ని
భాషాచిత్రంగా చెప్పవచ్చు

  1. పూతమెఱుంగులుం బసరుపూపబెడంగులుఁ జూపునట్టి నా
  2. కైతలు జగ్గునిగ్గునెనగావలెఁ గమ్మునగమ్మనన్వలెన్
  3. రాతిరియుంబవల్ మఱపురాని హొయల్ చెలియారజంపు ని
  4. ద్దాతరితీపులంబలెను దారసిలన్వఁలె లోఁదలంచినన్
  5. బ్రాతిగఁబైకొనన్వలెను బైదలికుత్తుకలోని వల్లటీ
  6. కూతలనన్వలెన్ సొగసుకోర్కులు రావలె నాలకించినన్
  7. జేతికొలందిఁ గౌఁగిటను జేర్చిన గన్నియచిన్నిపొన్నిమే
  8. ల్మూతల చన్నుదోయివలె ముచ్చటగావలె బట్టిచూచినన్
  9. డాతొడనున్నమన్నులమిటారపు ముద్దుగుమ్మకమ్మనౌ
  10. వాతెఱ దొండపండువలె వాచవిగావలెఁ బంటనూదినన్
  11. గాతలదమ్మిచూలిదొర కైవసపుంజవరాలి సిబ్బెపు
  12. న్మేతెలియబ్బురంపుజిగినిబ్బర పుబ్బగు గబ్బిగుబ్బపొం
  13. బూతల నున్నకాయ సరిపోడిమి కిన్నెరమెట్లబంతి సం
  14. గాతపు సన్నబంతి బయకారపుఁగన్నడ గౌళవంతుకా
  15. సాతతతానతానల వసం దివుటాడెడు కోటమీటుబల్
  16. మ్రోతలునుంబలెన్ హరువు మొల్లము గావలె నచ్చతెన్గు లీ
  17. రీతిగ, సంస్కృతంబు పచరించినపట్టున 


ఇక్కడి (17 పాదాలు)వరకు అచ్చతెనుగు

ఈ దిగువ నుండి సంస్కృతం ( 12 పాదాలు)

  1.                                                                                భారతీవధూ
  2. టీ తపనీయగర్భనికటీభవదాననపర్వసాహితీ
  3. భౌతికనాటకప్రకరభారతభారతసమ్మతప్రభా
  4. పాతసుధాప్రపూరబహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ
  5. జాతకతాళయుగ్మలయసంగతిచుంచువిపంచికామృదం
  6. గాతతతేహిత త్తహితహాదితదంధణుదాణుధింధిమి
  7. వ్రాతలయానుకూలపదవారకహూద్వహహారికింకిణీ
  8. నూతన ఘల్ఘలాచరణ నూపుర ఝాళఝళీమరంద సం
  9. ఘాతవియద్దునీచకచకద్వికచోత్పలసాసంగ్రహా
  10. యాతకుమారగంధవహహారిసుగంధవిలాసయుక్తమై
  11. చేతము చల్లఁజేయ వలెఁజిల్లునఁజల్లవలె న్మనోహర
  12. ద్యోతక గోస్తనీఫలమధుద్రవగోఘృతపాయసప్రసా
  13. రాతిరసప్రసారరుచిరప్రసరంబుగ సారెసారెకున్


Sunday, February 25, 2018

ఒకే వస్తువును తింటాం, తాగుతాం, చిబుకుతాం


ఒకే వస్తువును తింటాం, తాగుతాం, చిబుకుతాం




సాహితీమిత్రులారా!


పొడుపు కథలను సంస్కృతంలో ప్రహేలికలు అని,
ఆంగ్లంలో రెడిల్స్ అని పిలుస్తాం. కాశ్మీరీ వాళ్ళు
ప్రత్ష్ అంటారు. ఇక్కడ కాశ్మీరీ పొడుపుకథలను
కొన్నిటిని గమనిద్దాం-

1. అకి అంద సియహ బే అంద సపేద్
   (ఒకవైపు నలుపు మరోవైపు తెలుపు)
   - రాత్రి - పగలు

2. సుబహన్ త్సు జొంగ్,
   ద్వాహ్లిదు జొంగ్,
   షామన్ బాగీ త్రు జొంగ్.
   (పొద్దున నాలుగు కాళ్ళు,
    మధ్యాహ్నం రెండు కాళ్ళు,
    సాయంత్రం మూడు కాళ్ళు)
   - మనిషి
     మనిషి బాల్యం(పొద్దున) దోగాడుతాడు కదా!
     అప్పుడు అతనికి 4 కాళ్ళు.
     యౌవనం(మధ్యాహ్నం) రెండు కాళ్ళు.
     ముసలితనం(సాయంత్రం) మూడుకాళ్ళు
     అంటే రెండు కాళ్ళతోటి ఒక చేతికర్రకూడ
     అప్పుడు మూడు కాళ్ళు కదా!

3. ఖ్యోన్ కొన్ త త్రుకున్
   (ఒకే వస్తువును తింటాం, తాగుతాం, 
     చిబుకుతాం అదేమిటి?)
   - కరబూజా పండు

4. ఆమ్ త అసాన్ ద్రావ్ త వదాన్
   (నవ్వుతూ వస్తాడు, ఏడుస్తూ పోతాడు)
   - మంచు

5. యాం జాన్ తామ్ ఖోట్ కానీ పెఠ్
   (పుట్టిన వెంటనే అటక ఎక్కి కూర్చుంటుంది)
   - పొగ

   

Friday, February 23, 2018

మయూరుడు - సూర్యశతకం


మయూరుడు - సూర్యశతకం




సాహితీమిత్రులారా!


మయూరుడు సంస్కృత మహాకవి. 
మానతుంగాచార్యుడు, తన భక్తామరస్తోత్ర వ్యాఖ్యలో
పేర్కొన్నదాన్ని బట్టి ఉజ్జయినీ రాజయిన భోజుని 
ఆస్థానంలో మయూరకవి ఉన్నాడనీ, బాణభట్టు 
నకు మామగారని తెలుస్తుంది. మేరుతుంగుడు 
వ్రాసిన ప్రబంధచింతామణి అనే గ్రంథంలో
బాణభట్టు భార్యకు మయూరుడు సోదరుడని
చెప్పాడు. వీటన్నిటిని బట్టి ఒకటిమాత్రం నిజం
మయూరుడు 7వ శతాబ్ది పూర్వార్థంలో ఉన్నాడన్నది
నిశ్చయించుకోవచ్చు. సూర్యశతకం, మయూరకవి
రచనలన్నిటిలోనూ శిరోభూషణం వంటిది. 
సుప్రసిద్ధమైంది కూడ. సంస్కృత శతక సాహిత్యంలో
దీనికి గల స్థానం మరోదానికి లేదనవచ్చు. 
ఈ శతకాన్ని రచించడం ద్వారా మయూరుడు
వ్యాధి విముక్తిని సాధించినట్లు చెబుతారు.
సూర్యశతకాన్ని మయూరుడు స్రగ్ధర వృత్తంలో
రచించాడు. ఇందులో
సూర్యద్యుతికి సంబంధించినవి                                  - 43 శ్లోకాలు
సూర్యుని అశ్వాలను గురించినవి                                - 06 శ్లోకాలు
సూర్యుని రథసారథి అరుణుని గురించినవి              - 12 శ్లోకాలు
సూర్యరథాన్ని గురించినవి                                           - 11 శ్లోకాలు
సూర్యభగవానుని వర్ణన                                                 - 08 శ్లోకాలు
101వ శ్లోకం ఫలశ్రుతి చెప్పడం జరిగింది.
మయూరుడు దీన్ని వర్ణన ప్రధానమైన శతకంగా
కూర్చాడు. దీనిలో శ్లేష, రూపకం, ఉత్ప్రేక్ష 
మొదలైన అలంకారాలను ఉపయోగించాడు.
కొన్నిటిలో శబ్దాలంకార తత్పరత కనిపిస్తుంది.
దీనిలో సూర్యుని ఆధ్యాత్మికంగా వర్ణించింది 
తక్కువంటారు. ఈ శతకాన్ని వల్లభదేవుడు,
మధుసూధనుడు, త్రిభువన పాలుడు
అనే ముగ్గురు ప్రాచీన పండితులు వ్యఖ్యానాలు 
కూర్చారు. యజ్ఞేశ్వరశాస్త్రి రచించిన టీకా 
ఆధునికమైందిగా చెబుతారు. 

Thursday, February 22, 2018

మోరోపంత్ - 108 రామాయణాలు


మోరోపంత్ - 108 రామాయణాలు




సాహితీమిత్రులారా!

మరాఠీ సాహిత్యంలో 1700 - 1850 వరకు గల కాలాన్ని
షీష్వాయుగం అంటారు. ఈ షీష్వాయుగానికి వన్నెతెచ్చి
మరాఠీ సాహిత్యంలోేనే కవిసార్వభౌముడని బిరుదును
పొందినవాడు మోరోపంత్ తాంబె. ఈయన 1729 - 94
మధ్యాకాలంలో జీవించినవాడు. ఈయన ప్రధానంగా
పౌరాణికుడు. పురాణాలను చదివి వ్యాఖ్యానించడం
ఇతని వృత్తి. పండితుడేకాక కవితలో, కథా కథనంలో,
నైపుణ్యం గలవాడు. ఇతడు తాత్విక చర్చల జోలికిి
పోకుండా కళాత్మకంగా కావ్యాలు మలిచినవాడు. 
లవకుశోపాఖ్యానం, ప్రహ్లాద విజయం, సప్తశతి, 
సీతాగీతం, సావిత్రీగీత, కృష్ణవిజయం, హరివంశం,
కేకావళి ఇతడు వ్రాసిన కొన్ని గ్రంథాలు. 
మహాభారతాన్ని పూర్తిగా ఆర్యా వృత్తాలతో రచించాడు.
రామాయణగాథనే అనేక దృక్పథాల నుంచి పరిశీలించి
రకరకాల ఛందస్సులలో వేరువేరుగా వ్రాయటం
ఆయన సాధించిన ఒక విశిష్టత. సీతారామాయణం
(అయోధ్యకు తిరిగి వచ్చిన తరువాత సీత తన 
తోడికోడండ్రకు చెప్పినట్లు వ్రాసిన గాథ)
మొదలైనవి. ఇవిగాక 108 రామాయణాలు
వివిధ పేర్లతో వ్రాశారు ఇదంతా గర్భకవిత్వమనవచ్చు.
108 రామాయణాల్లో ఇప్పుడు కేవలం 90 రామాయణాలు 
మాత్రమే లభ్యమౌతున్నట్లు తెలుస్తున్నది. వాటిలో కొన్ని 
పేర్లు ఇక్కడ తెలుసుకుందాం-

మంత్రరామాయణం, నామరామాయణం, మంత్రమయ రామాయణం
బాలమంత్ర రామాయణం, అద్భుత రామాయణం, అభంగ రామాయణం
అష్టోత్తరశత రామాయణం(ఆర్యాగీతి ముక్తావలి), ఆధ్యార్య రామాయణం
ఉమారామాయణం, అవతారమాలాంతర్గత రామాయణం, అనుష్టుప్ రామాయణం, ఋషిరామాయణం, ఏకపాది రామాయణం, ఏకశ్లోకి రామాయణం, ఓవి రామాయణం, ఓవిగీత రామాయణం, నిరోష్ఠ రామాయణం, పరంతు రామాయణం, పీయూష రామాయణం, కన్యారత్న రామాయణం, కధాసుధా రామాయణం ,దండి రామాయణం
దివ్య రామాయణం, దోహా రామాయణం, ధన్యరామాయణం,
ధర్మరామాయణం, ధీర రామాయణం, లఘురామాయణం,
కాశీరామాయణం, గంగా రామాయణం, కవిప్రియ రామాయణం,
కల్పలతా రామాయణం, కల్యాణ రామాయణం, ఛందో రామాయణం,
తీర్థ రామాయణం, దండక రామాయణం, దామ రామాయణం,
దాస రామాయణం ఇలా 108 రామాయణాలు వ్రాశారు.

Wednesday, February 21, 2018

ఒకే పద్యంలో రామాయణం


ఒకే పద్యంలో రామాయణం




సాహితీమిత్రులారా!



వెల్లూరు నరసింగకవి కృత,
రాచకన్యాపరిణయం అనే కావ్యంలో
కవి దశావతార స్తుతి సందర్భంలో
చేసిన రామస్తుతి ఈ పద్యం.
ఈ పద్యంలో ప్రధానాంశాలతో
సంగ్రహ రామాయణంలా కూర్చాడు.
దీనిలో ప్రతికాండను గురించి కనబడుతుంది
కాని సుందరకాండను వదలివేశాడు
కారణం అందులో రాముడు చేసినదిగాని
అగుపించడంగాని లేదుకదా అందువల్లట.

గమి యాగాహితులం జయించి, హరకోదండంబు ఖండిం చి, సీ
తమనాసక్తి పరిగ్రహించి, భృగురామాటోపమున్ మాన్పి, శీ
ఘ్రమె సాకేతపుటాస బెంచి, వనులంగష్టించి, సుగ్రీవనా
మము హెచ్చించి, దశాస్యునొంచితివి రామస్వామివై మాధ వా!
                                                                                      (రాచకన్యా పరిణయము - 2- 157)
విశ్వామిత్రుని యాగం రక్షించి, శివధనుర్భంగము,
సీతాపరిగ్రహణము, పరశురామ గర్వభంగము, దశరథుని
రామపట్టాభిషేక ప్రయత్నము, అరణ్యవాసము,
వాలివధ, రావణసంహారము మొదలైన ముఖ్యాంశాలు వర్ణితాలు.
బాల అయోధ్యకాండలు, అరణ్యకిష్కింధకాండలు, యుద్ధకాండలు
ఇందులో కనిపిస్తాయి. సుందరకాండలో రామప్రసక్తి పరోక్షంలో
వుందికాని దాని విషయం ఇందులో ప్రస్తావించలేదు కవి.


Tuesday, February 20, 2018

చంపక గర్భితోత్పలమాల


చంపక గర్భితోత్పలమాల




సాహితీమిత్రులారా!



"సుగ్రీవపట్టాభిషేకం" - అనే కావ్యం
"అబ్బరాజు హనుమంతరావు"గారు
కూర్చారు. ఇందులోని ద్వితీయాశ్వాసంలోని
120వ పద్యం గర్భకవిత్వం రకానికి చెందినది
"చంపక గర్భితోత్పలమాల" ఇందులో
ఉత్పలమాలలో చంపకమాలను ఇమిడ్చాడు
అబ్బరాజు హనుమంతరావుగారు.

చంపక గర్భితోత్పలమాల -
కుల్కుచుఁవారు తీరమున కుంజనిసార్ద్రపటమ్ములూడ్చి హొం
గొల్కుల పట్టుపుట్టములఁ గొబ్బునఁదాల్చి  సువర్ణభూషలం
దల్కుటొడళ్ళఁ బెట్టినృపపనందనమున్గయిసేసితేనెలే
యొల్కఁగఁ మాటనిచ్చిరి నవోత్పలచంపకమాలలామెకున్

దీనిలో గమనించవలసినదొకటి
ఇది ఉత్పలమాల దీనికి పాదానికి 20 అక్షరాలు
మరి చంపకమాలకు 21 అక్షరాలు పాదానికి
20 అక్షరాల ఉత్పలమాలలో 21 అక్షరాల చంపకమాల
ఎలాసాధ్యం ఇమిడ్చటానికి అంటే ఇందులో
కవి చమత్కరించినది ఒకటే మొదటి గణంలో
గురువు లఘువు లఘువు - భగణం కదా దాన్ని
నాలుగు లఘువులుగా మార్చిన చంపకమాల కనబడుతుంది.
ఇందులో కవి ప్రాసలో
కుల్కుచు అనేదాన్ని కులుకుచు - మొదటిపాదం
గొల్కుల - అనేదాన్ని - గొలుకుల - రెండవపాదం
దల్కు - అనేదాన్ని - దలుకు - మూడవపాదం
యొల్కఁగ - అనేదాన్ని - యొలుకఁగ - నాలుగవపాదం
మార్చిన చంపకమాల అవుతుంది గమనించండి.

కులుకుచుఁవారు తీరమున కుంజనిసార్ద్రపటమ్ములూడ్చి హొం
గొలుకుల పట్టుపుట్టములఁ గొబ్బునఁదాల్చి  సువర్ణభూష లం
దలుకుటొడళ్ళఁ బెట్టినృపపనందనమున్గయిసేసితేనెలే
యొలుకగఁ మాటనిచ్చిరి నవోత్పలచంపకమాలలామెకున్


Monday, February 19, 2018

విద్యున్మాలా గర్భిత విశ్వదేవీ వృత్తము


విద్యున్మాలా గర్భిత విశ్వదేవీ వృత్తము




సాహితీమిత్రులారా!



ఆచార్య వి.యల్.యస్.భీమశంకరంగారి
"రసస్రువు"లోని పద్యం ఇది-
విద్యున్మాలా గర్భిత విశ్వదేవీ వృత్తము
విశ్వదేవీ వృత్తంలో విద్యున్మాలావృత్తం
ఇమిడ్చి కూర్చబడినది.

విశ్వదేవీ వృత్తం -
ఉద్యఃస్ఫూర్తిన్ వెల్గున్ నరోద్ఘుండు, వీడో
విద్యా విఖ్యాతుండో గవేషుండు కాడో,
సద్యఃకర్ముండౌనో విచారింప , ఈడీ
చోద్యంబెంతో వింతౌను, చోక్షంబు చూడన్

దీనిలోగర్భితమైన విద్యున్మాలా వృత్తం-
ఉద్యఃస్ఫూర్తిన్ వెల్గున్ నరోద్ఘుండు, వీడో
విద్యా విఖ్యాతుండో గవేషుండు కాడో,
సద్యఃకర్ముండౌనో విచారింప , ఈడీ
చోద్యంబెంతో వింతౌను, చోక్షంబు చూడన్

విద్యున్మాలా వృత్తం-
చూడన్ ఉద్యఃస్ఫూర్తిన్ వెల్గున్
వీడో  విద్యా విఖ్యాతుండో
కాడో సద్యఃకర్ముండౌనో
ఈడీ చోద్యంబెంతో వింతౌ


Sunday, February 18, 2018

భట్టీకావ్యం - రావణవధ


భట్టీకావ్యం - రావణవధ




సాహితీమిత్రులారా!




భట్టి కవి సంస్కృతంలో రావణవధ అనే కావ్యాన్ని కూర్చాడు.
దీనికి ఈ కవిపేరు మీదే భట్టీకావ్యం అనే పేరు వ్యవహారంలో
రూఢి అయింది. మల్లినాథసూరి, జయమంగళ, కుముకుదా
నంద మొదలైన వ్యాఖ్యాతలు దీన్ని భట్టికావ్యంగానే పేర్కొన్నారు.
దీనిలో 22 సర్గలున్నాయి. దీనిలోని ఇతివృత్తం రామునిచరిత్ర.
వాల్మీకి రామాయణకథనే అనుసరించినా అక్కడక్కడా చిన్నచిన్న 
మార్పులు చేశాడు. ఇందులో ఉత్తరకాండ రచించలేదు. 
అయితే కవిగారు ఇందులో సంస్కృతవ్యాకరణం బోధించాలనుకున్నాడు.
అదే ఇందులోని ప్రత్యేకత. వ్ాయకరణాన్ని సరళంగా బోధించడంకోసం
ఈ కథను వాడుకున్నాడు. ఇతివృత్తం రామకథ అయితే విషయబోధన
వ్యాకరణం. ఈ రెండింటిని సమన్వయించాడు. ఇందులో వ్యాకరణం
విషయక్రమం ఈ విధంగా  ఉంది-

సర్గలు 1-5 - ప్రకీర్ణక కాండాలు - (తిఙంతరూపాలను చెప్పేవి)
సర్గలు 6-9 - అధికారకాండాలు - (అధికార సూత్రాలను చెప్పేవి)
సర్గలు 10-13 - ప్రసన్నకాండాలు -(గుణ,అలంకారలకు లక్ష్యాలు)
సర్గలు 14-22 - తిఙంతకాండాలు - (లకారరూపాలు)

ఈ విధంగా భట్టికవి, వ్యాకరణానికీ, అలంకారశాస్త్రానికి సంబంధించిన 
అనే విషయాలను శ్రీరాముని ఇతివృత్తంతో జోడించి రచించాడు.
భట్టికావ్యానికి 22 వ్యాఖ్యలున్నాయి. 

Saturday, February 17, 2018

భర్గా శతకం


భర్గా శతకం




సాహితీమిత్రులారా!



కపిలవాయి లింగమూర్తిగారి
దుర్గాశతకాన్ని గురించి
ముందు తెలుసుకున్నాం-
ఇప్పుడు రెండవదైన
భర్గా శతకం గురించి వివరంగా తెలుసుకుందాం-
దుర్గా శతకం ఆటవెలదులతో ప్రతిపద్యం
ఒక అలంకారంలో మొత్తం శతకమంతా
దుర్గ అవతారాన్ని అష్టాదశ శక్తిపీఠాలను
దుర్గ తత్వాన్ని మొదలైన అంశాలతో
కూర్చగా భర్గా శతకం శివుడు యతీశ్వరుడు
కావున యతిశతకంగా ఆయన లీలలతో
కూర్చారు. ఇందులోని విషయం
ఈశ్వరుని గురించైతే ప్రతి దానిలో
ఛందస్సుకు సంబంధించి యతులకును
గురించిన లక్ష్యగ్రంథంగా కూర్చారు.
ఉమాదేవిని(దుర్గను) ఆటవెలదిలో స్తుతించగా
శివుని గీతపద్యాలలోని మరోరకమైన తేటగీతిని
శివస్తుతికి వాడారు. దీనిలో 120 పద్యాలను కూర్చాడు.
దీనిలో ఛందోవిషయంగా-
యతిగవేషణం - 22 పద్యాలు
వ్యంజనాక్షర విరతులు - 35 పద్యాలు
ఉభయవళులు - 35 పద్యాలు
ప్రాసయతులు - 28 పద్యాలు
మొత్తం    - 120 పద్యాలు

స్వరయతి -

మృత తత్వంబు నీయది, ది పురుష
త్మరూపంబు నీయది, ఐంద్రవినుత
ఐంద్రజాలికుడవు నీవు కలాప
పనిషదర్థమవు నీవు భవ భర్గ - 01


వ్యంజనాక్షర యతి -

కంతు కడగంట గాల్పడే కాయికముగ
కాలఫణినైన దాల్పడే కైవసముగ
కైపు విసమైన నిల్పడే గౌరవముగ
కౌశికీపతి నినుమది నునె  భర్గ   - 23

ఉభయవళులు-

చలజా వల్లభా యస్మజ్ఞత మది
లచి యిడుముల నిడ కస్మ దార్తి బాపి
దుకొనవయ్య నే యుష్మదంఘ్రి యుగము
నెపుడు నమ్మితి నను భవదీయు భర్గ     - 58







Thursday, February 15, 2018

దుర్గా శతకం


దుర్గా శతకం




సాహితీమిత్రులారా!



"కపిలవాయి లింగమూర్తి"గారు
చేసిన "దుర్గా శతకం"
చిత్రకవిత్వంలో చెప్పదగినది.
నిజానికి జంట శతకాలు
దుర్గ - భర్గ శతకాలు అని
కూర్చారు. మనం ఇక్కడ కేవలం
దుర్గ శతకాన్నే చెప్పుకుంటున్నాము.
ఒకవైపు దుర్గకు సంబంధించి
మరోవైపు అలంకారాలను వివరించడం
ఇందులోని చిత్రం. సంస్కృతంలో
కూర్తబడిన భట్టీ రావణవధ తదితర
కావ్యాల్లో ప్రధానకథ ఒక అర్థంగాను
మరో అర్థంలో వ్యాకరణం ఉండేవిధంగా
కొన్ని కావ్యాలున్నాయి. వాటికోవలో
ఈ శతకం ఒకవైపు దుర్గగురించి
మరోవైపు ఒక్కొక పద్యం ఒక్కొక అలంకారంగా
కూర్చారు కపిలవాయి లింగమూర్తిగారు.
ఇంకా వివరాల్లోకెళితే
తెలంగాణాలోని ఉమామహేశ్వర క్షేత్రంలోని
ఉమాదేవి త్రిపురసుందరి కనుక
అలంకారశతకంలో ఆమె సౌందర్యలీలలు
వర్ణిస్తూ ఆటవెలది స్త్రీ కావున అవ్నీ
ఆటవెదులుగానే కూర్చారు.
దుర్గ నవదుర్గ కావున నవ సంఖ్య వచ్చే విధంగా
వాటిని కూర్చారు.
ఇందులో వారు 109 పద్యాలను కూర్చారు.
దుర్గ అంగ వర్ణన             - 40 పద్యాలు
అష్టాదశ శక్తిపీఠ వివరం  - 18 పద్యాలు
అవతార కథనం              - 09 పద్యాలు
దుర్గ తత్వము                  - 19 పద్యాలు
అభ్యర్థనము                      - 23 పద్యాలు
                                              --- ------------
మొత్తం -                             109 పద్యాలు
                                              ------------

మొదటి పద్యం - అంగవర్ణనలో చూడండి-

అతసి కుసుమ కాంతి నవరాజితా సుమ 
చ్ఛవిని బొలుచు నీవు శివుని గూడి
గంగతోడనున్న కాళిందివలె నొప్పి
తివి మనోహరముగ నవని దుర్గ

ఇది ఉపమాలంకారంలో ఉన్నది.

అష్టాదశ శక్తిపీఠము వివరము లోని పద్యం -

లంకయందు నీవు శాంకరివనుపేర
వెలసితీవు భక్తసులభ - అయిన
లంక యిమిడినట్టి లవణాబ్దియందు నీ
యశము నిముడ జాలదయ్యె దుర్గ   - (41)

ఇది అధికాలంకారంలో ఉంది

అవతారకథనంలోని పద్యం-

విధిని వేధ వెట్టు మధుకైటభులఁబట్టి
నలిచినావు గుమిలి వలెనె యింక
శంబరాదు లెంత జగతి మహామాయ
వైన నాడు నీకు నవని దుర్గ  -  (59)

ఇది అర్థపత్తి అనే అలంకారంలో ఉంది.

ఈ విధంగా 109వ పద్యం -

సుఖమునిచ్చు సిరులు సుదతి మనోహరి
యరయకాపురంబె యవని స్వర్గ
మైననేమి బ్రతుకు లంగనాపాంగ చం
చలములగు గదమ్మ జగతి దుర్గ - (109)

ఇది విరుద్ధరససమావేశము అనే అలంకారంలో ఉంది.
ఇలాగా 109 పద్యాలు నూటతొమ్మిది అలంకారాల్లో కూర్చిన
ఈ కవిగారు ఎంతైనా అలంకారప్రియులకు అలంకారాలతో
విందు చేయించినారు. చాల చిన్న చిన్న మాటలతో కూర్చిన
ఈయనకు భాషపైనగల పట్టునకు నిదర్శనము.



Tuesday, February 13, 2018

రాతికి రత్నంబు తోఁడ రమణియు దొరకెన్


రాతికి రత్నంబు తోఁడ రమణియు దొరకెన్



సాహితీమిత్రులారా!



సమస్య - 
రాతికి రత్నంబు తోఁడ రమణియు దొరకెన్


వేలూరి శివరామశాస్త్రిగారి పూరణ-

ఆతఱిఁ సింగముఁజంపిన 
యాతని భల్లూక రాజు నటుతుములములో 
భీతిల్లఁజేసిన మురా
రాతికి రత్నంబు తోఁడ రమణియు దొరకెన్

రాతికి రత్నముతోపాటు రమణికూడ దొరకడం ఏమిటి
ఇది అసంగతమేకదా కాని కవిగారి చాతుర్యంతో
రాతిని - మురారాతి(విష్ణువు/ కృష్ణుడు) గా మార్తడంతో
సుసంగతమైంది సమస్య సమసింది.

(తుములము - దొమ్మి యుద్ధము, బాహాబాహి)

Saturday, February 10, 2018

అవ్వ తాతా, టంకానగారా, రారాపోరా, మేనాసవారి


అవ్వ తాతా, టంకానగారా, రారాపోరా, మేనాసవారి




సాహితీమిత్రులారా!



దత్తపది -
అవ్వ తాతా
టంకానగారా
రారాపోరా
మేనాసవారి - అనే పదాలను దత్తపదిగా
అర్జునుడు తిరస్కరించిన ఊర్వశి విరహానికి
అన్వయిస్తూ పూరించాలి

శ్రీపాద కృష్ణమూర్తిగారి పూరణ-

ఆపాకారి కుమారుఁడిట్లు విభవంబ వ్వారిగా రాఁగ, రా
రా పోరాయను సందడింబడు సుధర్మం జూచి నే నవ్వ తా
తా పాల్మాల వరింపకేగెనను వాఁడం కానగారా కహా
మీ పాలం బడితింజెలున్ మనుపరే మేనా నవారించితిన్

Friday, February 9, 2018

ఇది నాపేరేనండి


ఇది నాపేరేనండి




సాహితీమిత్రులారా!



ఈ పొడుపు ప్రశ్నకు సమాధానం
చెప్పగలరేమో చెప్పండి-

నాపేరులో ఐదక్షరాలున్నాయి
అందులో
మొదటి అక్షరానికి అగ్ని అని అర్థం
మధ్యనున్న అక్షరానికి ముల్లు అని అర్థం
చివరనున్న అక్షరానికి కీర్తి అని అర్థం
నాలుగవ అక్షరానికి బంగారని అర్థం
మొదటి రెండక్షరాలకు స్రీ అని అర్థం
రెండవ అక్షరం మొదటక్షరం కలిపిచదివితే కీలు అని అర్థం
నాలుగు రెండు అక్షరాలను కలిపిన సీతాపతి అని అర్థం
ఒకటి మూడు అక్షరాలను కలిపిన సమరమని అర్థం
చివరి రెండక్షరాలు కలిపిన మన్మథుని మామ అని అర్థం
నాలుగు మూడు అక్షరాలను కలిపిన ప్రీతి అని అర్థం
ఇంతకు నా పేరేమో చెప్పగలరా
నాపేరు (సమాధానం) తెలిసినవారు
దయచేసి తెలుపగలరు
అని అడిగాను దానికి
జవాబు - రమణరాజు
ఎలాగంటారా
మొదటి అక్షరానికి అగ్ని అని అర్థం
ర - అగ్ని
మధ్యనున్న అక్షరానికి ముల్లు అని అర్థం
ణ - ముల్లు
చివరనున్న అక్షరానికి కీర్తి అని అర్థం
జు - కీర్తి
నాలుగవ అక్షరానికి బంగారని అర్థం
రా - బంగారు
మొదటి రెండక్షరాలకు స్రీ అని అర్థం
రమ - స్త్రీ
రెండవ అక్షరం మొదటక్షరం కలిపిచదివితే కీలు అని అర్థం
మర - కీలు
నాలుగు రెండు అక్షరాలను కలిపిన సీతాపతి అని అర్థం
రామ - సీతాపతి
ఒకటి మూడు అక్షరాలను కలిపిన సమరమని అర్థం
రణ -  యుద్ధం, సమరం
చివరి రెండక్షరాలు కలిపిన మన్మథుని మామ అని అర్థం
రాజు - చంద్రుడు, మన్మథుని మేనమామ
నాలుగు మూడు అక్షరాలను కలిపిన ప్రీతి అని అర్థం
రాణ - రమణ యొక్క రూపాంతరం - ప్రీతి
ఇది నాపేరు రమణరాజు

Thursday, February 8, 2018

నాపేరేమిటో చెప్పండి?


నాపేరేమిటో చెప్పండి?




సాహితీమిత్రులారా!


పొడుపు ప్రశ్నకు సమాధానం
చెప్పగలరేమో చెప్పండి-

నాపేరులో ఐదక్షరాలున్నాయి
అందులో 
మొదటి అక్షరానికి అగ్ని అని అర్థం
మధ్యనున్న అక్షరానికి ముల్లు అని అర్థం
చివరనున్న అక్షరానికి కీర్తి అని అర్థం
నాలుగవ అక్షరానికి బంగారని అర్థం
మొదటి రెండక్షరాలకు స్రీ అని అర్థం
రెండవ అక్షరం మొదటక్షరం కలిపిచదివితే కీలు అని అర్థం
నాలుగు రెండు అక్షరాలను కలిపిన సీతాపతి అని అర్థం
ఒకటి మూడు అక్షరాలను కలిపిన సమరమని అర్థం
చివరి రెండక్షరాలు కలిపిన మన్మథుని మామ అని అర్థం
నాలుగు మూడు అక్షరాలను కలిపిన ప్రీతి అని అర్థం
ఇంతకు నా పేరేమో చెప్పగలరా
నాపేరు (సమాధానం) తెలిసినవారు
దయచేసి తెలుపగలరు 

Wednesday, February 7, 2018

రాముని చరిత్రమ్ముఁజదివి రాక్షసుఁడయ్యెన్


రాముని చరిత్రమ్ముఁజదివి రాక్షసుఁడయ్యెన్




సాహితీమిత్రులారా!





సమస్య-
రాముని చరిత్రమ్ముఁజదివి రాక్షసుఁడయ్యెన్

సింహాద్రి శ్రీరంగంగారి పూరణ-

రాముని చరితము జదివిన
పామరుఁడును మోక్షపథముఁ బడయఁగవచ్చున్
ఏమివిచిత్రంబెవ్వఁడు
రాముని చరిత్రమ్ముఁజదివి రాక్షసుఁడయ్యెన్

అసంగత విషయాన్ని ప్రశ్నార్థకా మార్చి
సంగతమైనదిగా మార్చాడు కవి.

Tuesday, February 6, 2018

వనజ భవుకంటెఁగడు వెఱ్ఱివాఁడుఁగలఁడె


వనజ భవుకంటెఁగడు వెఱ్ఱివాఁడుఁగలఁడె




సాహితీమిత్రులారా!


సమస్య- 
వనజ భవుకంటెఁగడు వెఱ్ఱివాఁడుఁగలఁడె


సింహాద్రి శ్రీరంగంగారి పూరణ-

కాయకష్టంబుఁజేసెడి ఘనునికింత
గుడువ, ముడువను, వసింపఁగూర్చకుండ
నీడఁగూర్చుండువానికి నిఖిలమిచ్చు
వనజ భవుకంటెఁగడు వెఱ్ఱివాఁడుఁగలఁడె

బ్రహ్మకంటె వెఱ్ఱివాడుండా - అని ప్రశ్నించగలమా?
బ్రహ్మ వెఱ్ఱివాడా మనం అనగలమా?
కవి అవుననే అంటున్నాడు
ఎలాగంటే కష్టం చేసేవానికి తిండి బట్ట గూడు
ఇవ్వకుండా నీడనున్నవానికి అఖిలాన్నిస్తున్నాడు
కాబట్టి వెఱ్ఱివాడంటున్నాడు ఈ విధంగా నిజమేకదా!

Monday, February 5, 2018

గణిత ప్రశ్న(ప్రహేలిక)


గణిత ప్రశ్న(ప్రహేలిక)




సాహితీమిత్రులారా!



ఈ గణిత ప్రశ్నను చదివి సమాధానం చెప్పండి-

ఐదవపాలు దేవునకు, నందుల నాల్గవపాలు పత్నికిన్,
మోదము మీర శేషమున మూడవభాగము పట్టికిచ్చి, మ
ర్యాదగ నర్థమున్ హితున కంపి భుజించెను మూడు పండ్లు, తా
నాదిని నెన్ని పండ్లుకొనె, నాయజమానుడు, మాకు జెప్పుడీ

ఇందులో యజమాని మొదట ఎన్ని?
పండ్లుకొన్నాడో చెప్పమంటున్నాడు.
అందులో మూడు పండ్లుమాత్రమే
యజమాని తిన్నాడు మిగిలిన వన్నీ
పంచాడు. అందువల్ల యజమాని
మొదట కొన్నది 15 పండ్లు అనుకుంటే
దేవునికిచ్చినది = 15/5 = 3
మిగిలినవి  = 15 -3 = 12
భార్యకిచ్చినది = 12/4 = 3
మిగిలినవి = 12-3 = 9
సంతానానికిచ్చినది = 9/3 =3
మిగిలినవి = 9-3=6
మిత్రునకిచ్చినది = 6/2 = 3
మిదిలినవి = 6-3=3
మిగిలినవి = 3
ఆ మూడు యజమాని తిన్నాడు
సరిపోయిందికదా అందువల్ల
యజమాని మొదట కొన్నది = 15 పండ్లు.

Sunday, February 4, 2018

రంభాఫల మెంత విషమో


రంభాఫల మెంత విషమో 




సాహితీమిత్రులారా!



సమస్య-
రంభాఫల మెంత విషమో రసికుఁడెఱుఁగున్
(అరటి పండెంత విషమో రసికునికి తెలుసును)

గాడేపల్లి వీరరాఘవశాస్త్రిగారి పూరణ-
రంభారావణ సంవాదంలో
రంభ రావణునితోను
రావణుడు రంభతోను
అన్నట్లుగా పూరించాడు

గంభీరవాక్కులేటికి
శుంభద్గర్వా విషమ్ము సు మ్మధరమనన్
రంభకు రావణుడనె నిటు
రంభాఫల మెంత విషమో రసికుఁడెఱుఁగున్

రంభాఫలంకాదిక్కడ
రంభా ఫలం ఎంత విషమో
అని రంభను సంబోధించినట్లుగా
కవి మార్చివేశాడు. కావున అరటిపండు విషం
అనే అసంగతం తొలగిపోయింది.

Saturday, February 3, 2018

అంత్యోత్తర చిత్రం


అంత్యోత్తర చిత్రం




సాహితీమిత్రులారా!




ప్రహేళికకు సమాధానం అంతంలో ఉంటేదాన్ని
అంత్యోత్తర ప్రహేళిక అంటారు.

కః పత్రీ? కా స్థిరా ?కార్క సంబుద్ధిః? కీ దృశోర్భకః?
కః సేవ్యః? కః పతి ర్బైమ్యాః? "వీరసేన సముద్భవః"

దీనిలో ఆరు ప్రశ్నలున్నాయి వాటి కన్నటికి
సమాధానం - వీరసేన సముద్భవః
విః - రసా - ఇన - సముత్ - భవః
అనేవి ఐదు ప్రశ్నలకు సమాధానాలు కాగా
ఆరవదానికి మొత్తం పదమంతా సమాధానమౌతుంది.

1. కః పత్రీ?
     పక్షి ఏది?
      - విః(పక్షి)

2.    కా స్థిరా ?
       స్థిరమైనదేది?
         - రసా(భూమి)

3.    కార్క సంబుద్ధిః?
       సూర్యసంబోధనమేది?
        - ఇన(ఓ సూర్యుడా)

4. కీ దృశోర్భకః?
    బాలుడెట్టివాడు?
       - సముత్(సంతోషంతో కూడినవాడు)

5. కః సేవ్యః?
    సేవింపదగినవాడు ఎవరు?
       - భవః(ఈశ్వరుడు)

6.   కః పతి ర్బైమ్యాః?
      భీముని కూతురు(దమయంతి) భర్త ఎవరు?
       - వీరసేన సముద్భవః(వీరసేనుని కుమారుడగు నలుడు)

Friday, February 2, 2018

సన్యాస శతకం


సన్యాస శతకం



సాహితీమిత్రులారా!


"సన్యాసమే మేలురా" అనే మకుటంతో
వ్రాయబడిన శతకం ఈ సన్యాసశతకం.
అయితే ఈ శతకానికి ఒక ప్రత్యేకతవుంది.
అదేమిటంటే ఒకే కవి దీన్ని వ్రాయలేదు.
నల్గొండజిల్లా మిర్యాలగూడకు చెందిన
ముడుంబ కృష్ణమాచార్యులు, సూలూరు 
శివసుబ్రహ్మణ్యం, కాటేపల్లి లక్ష్మినరసింహమూర్తి
అనే మిత్రులు వరుసగా పాదైక రచనా నియమంతో
ఒకే రాత్రిలో కూర్చారు. ముగ్గురు ఒకచోట కూర్చొని
తలా ఒక పాదం చొప్పున మూడు పాదాలు చెప్పాక
నాలుగవ పాదం పద్యం మొదలు పెట్టిన కవి పూర్తిచేస్తాడు.
ఈ క్రమంలో రెండవ పద్యాన్ని ఇంకొకరు, మూడవ
పద్యాన్ని మరొకరు మొదలుపెడతారు. పద్య ప్రారంభించిన
వాడు తను చెప్పదలచుకొన్నది మిగతా ఇద్దరికి వివరిస్తాడు.
వాళ్ళు ఆ విషయాన్నే అతని శైలిలో తమవంతుపాదాలను
పూర్తి చేస్తారు. అయితే ఇక్కడ మరో ప్రత్యేకత వుంది అదేమంటే
ఆ కవులకు ఇదే తొలిరచన.

ఈ శతకంలో నవనాగరికత వ్యామోహం వల్ల సమాజం
ఎదుర్కొంటున్న దుష్పరిణామాలను వివరించి, తమ
ఆవేదనను ఈ కవులు సన్యాసమే మేలురా
అనే మకుటంతో వెల్లడి చేశారు.
ఇందులో మద్యపానం చేసి వాహనాలు నడిపేవారిని(32),
మామూళ్లని డబ్బులు దోచుకునేవారిని(22),
మన్మథవికారంతో వేశ్యవాటికలకు పోయేవారిని(61)....
చూసి ఈ కవులు సన్యాసమే మేలని తీర్మానించారు.
బీపీ పెంచుకొని, రోషావేశులై ఇతరులను తూలనాడేవారిని
గురించి ఈ సన్సాస కవులు ఇలా పేర్కొన్నారు(74)లో.

రుధిరా పీడన పీడితుల్, తమ మనోరుద్రాంగణంబందు దా
మధిరావేశమునం జరించుచున్ నైజాపత్యముం దూలగా,
నధమోత్కంపము మీర, జిత్తములు నిత్యంబుం గృషింపగ, దో
ష ధురాబాధితముం బొనర్తు రకటా సన్యాసమే మేలురా

జంటకవులెలా చెబుతారో కవిత్వాన్ని ఇప్పుడెవురూ చూడలేదు.
కానీ ఇలాంటి పద్ధతిలో కవిత్వం చెప్పడం కొంతవకు కాదు
పూర్తిగా ప్రత్యేకం మరియు ప్రశంసనీయం.
ఈ శతకం 1992లో ప్రకటించబడింది.

(విషయ సమాచార సేకరణ - 
కె.వి.రమణాచారి, పద్యకవిత్వం - వస్తువైవిధ్యం) 

Thursday, February 1, 2018

కందగర్భగీతం


కందగర్భగీతం




సాహితీమిత్రులారా!


అష్టకాల నృసింహరామశర్మ కృత
"పురుషోత్తముడు" కావ్యంలోని
ఈ గర్భచిత్రం చూడండి-
గీతపద్యంలో కందం ఇమిడ్చి
చెప్పాడీకవి -

గరుడ గమన! శర్వవినుత! సురసుత పద
శ్రీకర! శశి సూర్యనయన! నాకరిపుహ!
మురహర! కరుణాకర! మునివరవినుత చ
రణ! కరివరపాలా! రిపుగణహర! హరి!

ఈ ఆటవెలది పద్యం కందపద్యం దాగి ఉంది
అది-

గరుడ గమన! శర్వవినుత! సురసుత పద
శ్రీకర! శశి సూర్యనయన! నాకరిపుహ!
మురహర! కరుణాకర! మునివరవినుత చ
రణ! కరివరపాలా! రిపుగణహర! హరి!

గరుడ గమన! శర్వవినుత! 
సురసుత పద శ్రీకర! శశి సూర్యనయన! నా
కరిపుహ! మురహర! కరుణా
కర! మునివరవినుత చరణ! కరివరపాలా!