Showing posts with label భోజమహారాజు - సమస్యాపూరణలు. Show all posts
Showing posts with label భోజమహారాజు - సమస్యాపూరణలు. Show all posts

Tuesday, September 14, 2021

భోజమహారాజు - సమస్యాపూరణలు - 5

 భోజమహారాజు - సమస్యాపూరణలు - 5




సాహితీమిత్రులారా!



ఒకరోజు భోజమహారాజు ధారానగరంలో విహరిస్తూ
దుర్గాదేవి ఆలయానికి పోగా అక్కడ ఒక యోగిని
ఒక కుర్రవానికి అనేకవిధాల లాలిస్తూ ముద్దుముచ్చట
లాడుతోంది. సర్వసంగ పరిత్యాగిగా ఉండవలసిన ఈమెకు
ఈ సంసారపు జంజాటము ఏమిటి అని అనుకొని. అయినా
ఆవిషయం తెలుసుకొందామని ఆమెతో -
 "అమ్మా! ఈ బాలుడు నీకేమి కావాలి? - అని ప్రశ్నించాడు.
దానికి ఆమె రాజును చూచి "మహాప్రభూ! ఈ కుర్రవాడు నాకు సోదరుడు,
మేనల్లుడు, మనుమడు, మామ, కొడుకు,పినతండ్రి, మరిది" - అని చెప్పింది.
ఈ విపరీతపు వావివరుస విని రాజు ఆశ్చర్యపోయాడు. మరునాడు
ఆ యోగిని చెప్పిన వావివరుసను ఒక సమస్యగా
కూర్చి పండితులందరికి ఇచ్చాడు -
సమస్య-
భ్రాత, ర్భ్రాతృవ్య, పౌత్ర, శ్వశుర, సుత, పితృ, వ్యేతి తం దేవరేతి

దీన్నివిన్న పండితులు ఏమీ చెప్పలేక ఉండగా
కాళిదాసు కాళికాప్రసాదంతో ఆ రహస్యాన్ని కనిపెట్టి ఇలా పూరించాడు.

జారోత్పన్నౌ తనయదుహితరౌ, దంపతీ దైవయోగా
ద్యోగిన్యా గర్హితా సా తదనుగమవశాద్యోగినీత్వం ప్రపేదే,
పశ్చాద్భార్యాకృతాంబాజనిత మధ శిశుం లాలయత్యబ్రవీత్సా
భ్రాతర్భ్రాతృవ్య పౌత్ర శ్వశుర సుత పితృవ్యేతి తం దేవరేతి


ఒక ఊరిలో ఒక జారిణి ఉండేది. ఆమె చిన్నవయసులో ఒకనితో
కలిసి ఒక కొడుకును కని అతన్ని పిల్లవాణ్ణి వదిలేసి ఇంకో ఊరిలో
ఇంకొకనితో ఉండెను. అతనివలన ఒక కుమార్తెను కని, వారిని వదలి
మరొక ఊరిలో వేశ్యావృత్తిలో ఉండినది. కొన్నాళ్ళకు ఆమెకు కలిగిన
కొడుకుకు, కూతురుకు దైవయోగంతో వివాహమయింది.
వారి జన్మరహస్యం గురించి ఒక యోగిని తెలియపరచడంతో
ఆ కన్య సంసారాన్ని వదలి యోగిని అయినది.(ఆమె భోజునికి కనిపించినది.)
ఆమె యోగిని అయిన తరువాత ఆమెను వెదకుచూ ఊరూరా తిరుగుతూ
కన్నతల్లి వేశ్యగా ఉన్న ఊరికి పోయి కామావేశంతో వేశ్యగా ఉన్న తల్లితో
కలియగా ఆమెకు ఒక కుమారుడు కలిగాడు. ఆ వేశ్య పిల్లవాన్ని విడిచిపెట్టింది.
ఆ శిశువు ఎట్లో ఈ యోగినికి దొరికాడు. ఆ యోగిని ఆత్మశక్తితో శిశువు
జన్మరహస్యం కనిపెట్టింది కావున ఇన్ని వావివరుసలు చెప్పింది.
వావివరుసలు-
1. సోదరుడు - తన తల్లి అయిన వేశ్యకు కుమారుడు కావున.
2. మేనల్లుడు - తను పెండ్లాడిన తన అన్నకు కొడుకు కావున.
3. మనుమడు - తనతల్లి అయిన వేశ్య తనభర్తకు భార్య అయింది. దీనివల్ల
                        తనతల్లి తనకు సవతి అయింది. ఆ సవితికి మొదట తనభర్త కొడుకు
                        కావున
                       తనభర్త తనకు కొడుకు అతని కొడుకు కావున మనుమడు

4. మామ - తనభర్తకు తల్లి అయిన వేశ్య తనకు అత్త, అత్త మొగుడు(తనభర్త)
                 తనకుమామ, ఈ వరుసన తనభర్త, ఈ పిల్లవాడు ఒకే గర్భవాసులు
                 అయినందున మామ.

5. కొడుకు - తనభర్తకు కొడుకు కావున తనకు కొడుకే

6. పినతండ్రి - తనతల్లికి మగడు తనభర్త. తనభర్తకు తనతల్లికి పుట్టినవాడు ఈ శిశువు.
                    తనతల్లికి భర్త అయిన వరుసలో తనకు తండ్రి, ఆ తండ్రికి ఈ శిశువు తమ్ముడు
                    కావున పినతండ్రి.
7. మరిది -  తనభర్తకు తల్లి అయిన వేశ్య తనకు అత్త ఆ అత్తకు రెండవ కొడుకు.
                  కావున భర్త తమ్ముడు మరిది

ఇన్ని సంబంధాలను మూడు పాదాలలో ఇమిడ్చి
సమస్యను పూర్తి చేశాడు కాళిదాసు.
అతని ఊహాపోహలకు ప్రతిభా విశేషానికి
భోజరాజు ఆశ్చర్యపడి
గొప్ప సన్మానము చేశాడు.

Friday, September 10, 2021

భోజమహారాజు - సమస్యాపూరణలు - 4

భోజమహారాజు - సమస్యాపూరణలు - 4




సాహితీమిత్రులారా!



భోజరాజు ఒకరోజు రాత్రి ఆకల్లాడక తీవ్రమైన ఉక్కతో
అంత:పురకాంతలను తాకనైనా లేక కేవలము
కనుసన్నలచేతనే ఆలింగనాదులన్నీ అనుభవించుచూ
సరససల్లాపమలచేతనే  కాలక్షేపము చేసి ఆ రాత్రి నిదురించెను.
మరునాడు సభలో తాను అనుభవించిన దాన్నిఒక సమస్యగా ఇచ్చాడు.
సమస్య - మరుదాగమవార్తయా2పి శూన్యే
              సమయే జాగ్రతి సంప్రవృద్ధతాపే

(గాలివచ్చు అనుమాట కూడలేని
   పెనువేసవికాలములో
  ఉమ్మదము, వేడిమి మిక్కిలి
  తీవ్రమవుచుండగా.....)

దీన్ని భవభూతి ఈవిధంగా పూరించాడు.
ఉరగీ శిశవే ఋభుక్షవే స్వా
మదిశత్ఫూత్కృతిమాననానిలేన

(ఆ సమయంలో ఆడుపాము ఆకలితో ఉన్న
తనపిల్లనోటిలో తన నోరుపెట్టి 'ఫూ' అని ఊది గాలిమేపు ఇచ్చెను.)

దానికి భోజుడు  - కవిచంద్రా! లోకోక్తిని చక్కగా సమర్థించి చెప్పావు
                         చాల సంతోషమైంది-
                                                         అని అన్నాడు.
తరువాత కాళిదాసు వైపుచూడగా
ఈవిధంగా పూరించాడు.

అబలాసు విలాసినో2స్వభూప
న్నయనై రేవ నవోపగూహనాని


(విలాసపురుషులు తమ ప్రియురాండ్ర ఎడ నూతన
ఆలింగనములను కన్నలచేతనే అనుభవించినవారైరి)
అని చెప్పగా
రాజు మనసులోని అభిప్రాయమునే
చూచినట్లు సూటిగా చెప్పినందులకు
చాల సంతోషముతో సన్మానము చేసెనట.

Saturday, September 4, 2021

భోజమహారాజు - సమస్యాపూరణలు - 3

భోజమహారాజు - సమస్యాపూరణలు - 3




సాహితీమిత్రులారా!



 ఒకమారు ముగ్గురు వ్యక్తులు భోజరాజు దర్శనానికి

వెళ్ళగా వారికి ఉచితరీతిని సత్కరించి మీరేమైనా
శ్లోకాలు రాశారా?  అని ప్రశ్నించాడు. దానికి వారు
ఇప్పటికి ఏమీ రాసుకొని రాలేదు నెలవైతే రాసుకొని
వస్తామని చెప్పి సెలవుతీసుకున్నారు.
కానీ కవిత్వమంటే ఏంటో వారికి తెలియదు
వారు రాయాలని ఆలోచన ప్రారంభించారు.
ఆశ చెడ్డదికదా! ఏలాగైనా నాలుగు పాదాలు కూర్చుకొని
ఒక శ్లోకమైనా పూర్తి చేయాలని ముగ్గురు కూడబలుక్కొని
ఒక్కొక్కపాదం ఒకరు పూర్తి చేసేవిధంగా మాట్లాడుకున్నారు.
ఎంత ప్రయత్నించినా ఎవరికీ ఏమీ తెలియడంలేదు.
వారిలో ఒకడు సాధారణంగా అనుకొనే ఒకపాదాన్ని
గుర్తుకురాగా అది చెప్పి గండం గడిచిందనుకున్నాడు.
ఆ పాదం-
అనిత్యాని శరీరాణి

రెండవవాడు ఎప్పుడో విన్న పాదం చెప్పి
తనగండం గడిచిందనుకున్నాడు.
రెండవ పాదం -
శాకాయ లవణాయ చ

మూడవవాడు చిన్నప్పుడు చదివిన
బాలరామాయణశ్లోకంలోని పాదం చెప్పి
ఊరకున్నాడు.
ఆ పాదం -
కూజన్తం రామ రామేతి

మూడు పాదాలు పూర్తయినాయి కాని నాలుగవపాదం
ఎంతప్రయత్నించినా వారి వల్లకాలేదు. మాటిమాటికి ఆ పాదాలనే
వల్లెవేస్తూ దారిలో వెళుతున్నవారిని కాళిదాసు వారి అవస్థనుచూచి
నాలుగవపాదం పూర్తిచేసి ఇక మీకు సన్మానం జరుగుతుంది రాజుదగ్గరకు
రండి అని చెప్పి లోనికి వెళ్ళాడు. కాళిదాసు పూర్తిచేసి ఇచ్చిన తర్వాత
కడతేరాం దేవుడా!  అనుకొని రాజుగారి ముందుకు వెళ్ళారు.
దాని్ని చూచిన రాజుగారు నాల్గవపాదం చెప్పినవారికి
అక్షరలక్షలు ఇచ్చితిని అనగా వారు రాజుగారికి
జరిగినదంతా చెప్పారు.
దానితో కాళిదాసును రాజుగారు సత్కరించాడు.
ఆ (పూర్తి)శ్లోకం -

అనిత్యాని శరీరాణి
శాకాయ లవణాయ చ
కూజన్తం రామ రామేతి
మత్వా మాగా గళం వహ

వీటి అర్థం-
అనిత్యాని శరీరాణి (శరీరము అనిత్యము)
శాకాయ లవణాయ చ (శాకమునకును, లవణమునకును)
కూజన్తం రామ రామేతి (రామ రామ అని కూయుచున్నది)
ఈ మూడు పాదములకు అతుకు పెట్టి క్రమాలంకారంలో చెప్పాడు కాళిదాసు.
మత్వా మాగా గళం వహ

అనిత్యాని శరీరాణి మత్వా 
(శరీరము అనిత్యమని తలచి)
శాకాయ లవణాయ చ మాగా: 
(శాకమునకును, లమణమునకును పోకుము)
కూజన్తం రామ రామేతి గళం వహ
(రామరామ అని కంఠమున వహింపుము)

దీని భావం -
ఓ నరుడా! శరీరము అనిత్యమని తలచి,
కూరగాయలు కావాలని ఉప్పు కావాలని వెంపర్లాడకు.
ఎల్లపుడు రామరామ అని కీర్తనను కంఠంనందు
వహించు అనగా ఎల్లపుడు రామనామాన్ని
సంకీర్తన చేస్తూ ఉండు - అని భావం.