Showing posts with label ముక్కుతో పలుకని పద్యం. Show all posts
Showing posts with label ముక్కుతో పలుకని పద్యం. Show all posts

Friday, November 20, 2020

ముక్కుతో పలుకని పద్యం

 ముక్కుతో పలుకని పద్యం





సాహితీమిత్రులారా!



ముక్కుతో పలికే అక్షరాలను

అనునాసికాలు అంటారు

ఙ,ఞ,ణ,న,మ - అనేవి అనునాసికాలు

ఇవిలేకుండా పద్యం వ్రాస్తే ముక్కుతో పనిలేదు

వాటిని నిరనునాసికాలు అంటాం.

ఇక్కడ నిరనునాసిక చంపువు అనే కావ్యం నుండి

ఒక ఉదాహరణ చూద్దాం-

లక్ష్మణుడు శూర్పనఖకు ముక్కుచెవులు కోసిన తర్వాత

అన్న అయిన రావణుని దగ్గరకు వెళ్ళి 

ఈ విధంగా చెప్పిందట


హా! హా! రాక్షస దుష్పరిభవగ్రస్తస్య ధిక్ తే భుజా

విద్యుజ్జిహ్వువిపత్తిరేవ సుకరా క్షుద్రపప్రతాప త్వయా

ధ్వస్తాపత్రప పశ్య పశ్య సకలైశ్చక్షుర్భిరేతాదృశీ

జాతా కశ్యచిదేవ తాపసశిశోఃశస్త్రాత్తవైవ స్వసా

                                                                          (నిరనునాసిక చంపువు - 2)

ఓ రాక్షసరాజా! నీకు నీ 20 చేతులకు అవమానం, 

దయనీయమైంది నీ శౌర్యం, నీ 20 కళ్లతో బాగా చూడు

ఆ మునికుమారుని కత్తి నీ సోదరికి ఎంత బాధాకరమైన 

అవమానం కలిగించిందో (ముక్కు చెవులు కోసివేయబడినాయి)


ఈ పద్యంలో ఒక అక్షరమైనా ముక్కుతో పలుకుతుందేమో చూడండి.