పెదిమలు తగలని నాలుక మాత్రమే
కదిలే పద్యం
సాహితీమిత్రులారా!
పలికేప్పుడు పెదిమలు తగలని అక్షరాలతో
నాలుక మాత్రమే కదిలే పద్యం దీన్ని
నిరోష్ఠ్యాచలజ్జిహ్వము అంటాము. ఇక్కడ
ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములోని 832వ
పద్యాన్ని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు గమనించండి-
సగ్విణి వృత్తంలో కూర్చబడినది-
ఇది 832వ దండకంలో గర్భితమైన పద్యం
అంటే విడిగా ఈ పద్యం కనిపించదు మనం
ఇక్కడ విడిగా వ్రాసుకుంటున్నాం గమనించగలరు
నారదారాధనా నారతాహ్లాదితా
నీరదాశీల సన్నీల తేజః శ్రితా
సార దైత్యచ్ఛిదా చండ చక్రాంచితా
శ్రీ రసాలంకృతా శేషశైలస్థితా
గమనించండి దీనిలో ప,ఫ,బ,భ,మ - లు లేవు
పలికితే నాలుక మాత్రమే కదులుతుంది