శశిరేఖ ముఖవర్ణన
సాహితీమిత్రులారా!
తాలాంకనందినీ పరిణయంలో
సంఖ్యంలతో కూడిన శశిరేఖ ముఖవర్ణన
కూర్చారు ఆసూరి మఱింగంటి వేంకటనరసింహాచార్యగారు
గమనించండి-
సాహితీమిత్రులారా!
తాలాంకనందినీ పరిణయంలో
సంఖ్యంలతో కూడిన శశిరేఖ ముఖవర్ణన
కూర్చారు ఆసూరి మఱింగంటి వేంకటనరసింహాచార్యగారు
గమనించండి-
సాహితీమిత్రులారా!
చదివే సమయంలో
పెదవి మాత్రమే తగిలే పద్యం-
భూమీ భామాంబు భవా
వామాపా వైభవ భువి భావావాపా
వేమమ్మోముము భూభవ
భీమ భవాభావ భావ విభువామావిభా
చదివే సమయంలో పెదవులు తగలిది-
శ్రీశా సతత యశః కవి
తాశా ధాత్రీశ ఖండితాశా నిస్సం
కాశా నిరతారాధిత
కీశేశా హృష్ణ గగనకేశా యీశా
ఒక అక్షరం పెదవితగలినిది తరువాతి అక్షరం తగిలేది
అంటే పెదవి తగలనిది తగలేది ఈ పద్యం -
దేవా శ్రీమాధవ శివ
దా వేగాభిజ్ఞ మురభిదా మాధామా
జ్యావగ వంద్యా వాసవ
సేవితపద పగవిరామ శివ జపనామా
సాహితీమిత్రులారా!
కావ్యాలంకారసంగ్రహంలోని
ఈ పద్యం చూడండి-
ఇందులో క - నుండి మ- వరకు గల
25 అక్షరాలు వాడకుండా వ్రాయబడింది
దీన్ని వర్గపంచకరహితము అని అంటారు.
ఇది శబ్దచిత్రంలోని స్థానచిత్రానికి చెందినది.
హార హీర సారసారి హారశైల వాసవో
ర్వీరుహా హిహార శేషవేషహాసలాలస
శ్రీరసోరుయాశసాంశుశీల వైరివీరసం
హార సారశౌర్యసూర్య హర్యవార్యసాహసా
(కావ్యాలంకాసంగ్రహము -5- 245)
(హీరము - మణి, సారసారి - సంద్రుడు,
హారశైలము - కైలాసము, అహిహారుడు - శివుడు,
యాశసాంశుశీల - కీర్తికాంతచే ఒప్పువాడా,
సూర్యహర్యవార్య సాహసా - సూర్యుని అశ్వముల
చేతను వారింపరాని(చొరరాని) సాహసము కలవాడా)
ఈ పద్యంలో
క,ఖ,గ,ఘ,ఙ
చ,ఛ,జ,ఝ,ఞ
ట,ఠ,డ,ఢ.ణ
త,థ,ద,ధ,న
ప,ఫ,బ,భ,మ
అనే 25 అక్షరాలున్నాయేమో గమనించగలరు.
ఇవిలేవుకావుననే దీని వర్గపంచకరహిత పద్యం
అనే పేరు పెట్టారు.
సాహితీమిత్రులారా!
రొద్దము హనుమంతరావు గారి
శృంగారలహరి అను నామాంతరముగల
ఆంధ్ర వాసవదత్త లోని
ఈ పద్యాలు గమనించండి-
హీరనిభమధ్యనిర్మల
హీరవిభావిభవభాగహీనరదమహా
హీరసమనీలవేణిమ
హీరమణీయోరుకటిమహిన్ సతిదలఁపన్ (215)
(హీర- సింహము , వజ్రము, సర్పము)
హరిసమరమణీయానన
హరిరుచిరవచోవిలాస హరినిభవేణిన్
హరిమధ్యహరితనుద్యుతి
హరిహరియారమణి బొగడనలవియె యెందున్ (216)
(హరి- చంద్రుడు, చిలుక, సర్పము, సింహము, బంగారుచాయ)
వీటిలో ప్రతిపాదము ఒకే పదంతో ప్రారంభమయింది
మరియు నానార్థములతో పద్యం నడిచింది.
కావున ఇవి శబ్దచిత్రంగా చెప్పవచ్చు.
సాహితీమిత్రులారా!
రెండు దీర్ఘాచ్చులతో కూర్చిన పద్యం
లేక శ్లోకంను దీర్ఘ ద్వి స్వరచిత్రం అంటాం
దండి కావ్యాదర్శంలోనిది
శ్రీ దీప్తీ హ్రీ కీర్తీ ధీనీతీ గీ ప్రీతీ
ఏధేతే ద్వే ద్వే తేయే నేమే దేవేశే
(కావ్యాదర్శము- 3- 86)
(దేవేంద్రుని యందుకూడ లేని శోభాదీప్తులు,
లజ్జాకీర్తులు, బుద్ధినీతులు, వాక్ప్రేమలు
రెండు రెండు నీకు వృద్ధినొందుచున్నవి.)
దీనిలో మొదటి అర్థము అనగా శ్లోకము పూర్వభాగము అంతా ఈ - స్వరంతోను,
రెండవ భాగము అనగా ఉత్తరార్థశ్లోకం అంతా ఏ - స్వరం తోను కూర్చబడినది.
ఈ రెండును దీర్ఘ స్వరములే కాబట్టి దీన్ని దీర్ఘ ద్వి స్వరచిత్రం
అనికూడ అనవచ్చు
సాహితీమిత్రులారా!
ఏకాక్షరి, ద్వ్యక్షరి, త్య్రక్షరి ఇలా చూసి ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ సీసంలో ఒక అక్షంతో ఒక పాదం,
రెండక్షరాలతో రెండవపాదం, మూడక్షరాలతో మూడవ పాదం, నాలుగక్షరాలతో నాలుగపాదం,
ఐదక్షరాలతో ఐదవపాదం, ఇలా కూర్చటం జరిగింది గమనించండి
రారార రారర రూరూర రేరార
రేరార రీరర రూరరార
భాభీరు భీభర భారభేరీరేభి
భూరిభాభాభీ భూభూ భరాభ
నలినీ నివనైక లలనాకళానూన
లాలనలోలా కళంక లీల
దరదారి దర ధర కరదదాదోదర
దార కాదర కరోదారవరద
గోపబాలక పాలక పాపలోప
సాలక విలాస వేంకటశైలవాస
భవ్యభాస భవాకారదివ్యరూప
రాధికాస్పుటదిక్కరి కాధరాంగ
(ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము - 878)
1వ పాదము- 1- అక్షరం- ర
రెండవపాదం- రెండక్షరాలు - భ,ర
మూడవపాదం - 3 అక్షరాలు-క,న,ల
నాలుగవ పాదం- 4 అక్షరాలు - క,ద,ర,వ
ఐదవపాదం- 5 అక్షరాలు - క,గ,ప,బ,ల
ఆరవపాదం - 6 అక్షరాలు - క,ట,ల,వ,శ.స
ఏడవపాదం- 7 అక్షరాలు - క,వ,భ,ర,ప,ద,య
ఎనిమిదవపాదం- 8 అక్షరములు - క,గ,ట,ద,ధ,ప,స,ర
ఈ విధంగా కూర్చబడినది
సాహితీమిత్రులారా!
కపిలవాయి లింగమూర్తిగారి
ఆర్యా శతకంలోని పద్యం చూడండి
తాజెడిమసియగు తామసి
యేజగమున నున్నగాని ఇది నిక్కము సు
మ్మీ జనుడు దీనినెరిగిన
వేజన్మములైన జెడడు వినుమా యార్యా!
తామసగుణం కలవాడు తాను చెడిపోతాడు మసి అయిపోతాడు.
ఇది కనుక్కున్నవాడు ఎన్ని జన్మలెత్తినా చెడడు అంటున్నారు లింగమూర్తిగారు.
ఇందులో మరో చమత్కారం చూపించాడు కవిగారు. అదేమంటే
తామసిలోని - 'తా' జెడి - త అనే అక్షరం చెడిపోతే మసిమిగులపుతుంది
- అని శబ్దచిత్రాన్ని చూపించాడు.