Showing posts with label ఏకపాదాక్షర శ్లోకం. Show all posts
Showing posts with label ఏకపాదాక్షర శ్లోకం. Show all posts

Thursday, April 1, 2021

ఏకపాదాక్షర శ్లోకం

 ఏకపాదాక్షర శ్లోకం





సాహితీమిత్రులారా!



ఒక పాదానికి ఒక హల్లు మాత్రమే ఉపయోగిస్తూ నాలుగుపాదాలకు

నాలుగు వేరువేరు హల్లులను వాడటాన్ని ఏకాక్షర పాదం లేక

ఏకవ్యంజనపాదం అంటారు.


భారవి కిరాతార్జునీయంలో రాసిన

ఏకాక్షరపాద శ్లోకం గమనిద్దాం.


శ్లో. స సాసి: సాసుసూ: సాసో

     యేయాయేయాయయాయయ:

     లలౌలీలాం లలో2లోల:

     శశీశశిశుశీ: శశన్

                                          (కిరాతార్జునీయమ్ -15-5)

అర్థం :- సాసి: = ఖడ్గంతో ఉన్న, సాసుసూ: = ప్రాణాలను హరించే బాణాలు థరించినవాడు,సాస: = ధనువును థరించినవాడు, యేయ + అయేయ + అయయ + అయయ - వాహనంతోను, వాహనంలేకుండా శత్రువుని చేరి వారి వాహనాలను స్వాథీనం చేసుకున్నవాడు, లల: = అందమైనవాడు, అలోల: = చాపల్యంలేనివాడు, శశి +ఈశ + శశు + శీ: - ఈశ్వరుని కుమారుడైన కుమారస్వామిని పరుగెత్తింపచేసే, స: = అర్జునుడు, లీలాం = శోభను, లలౌ = పొందాడు.