Showing posts with label అనులోమ ప్రతిలోమ శ్లోకం - గతిచిత్రం. Show all posts
Showing posts with label అనులోమ ప్రతిలోమ శ్లోకం - గతిచిత్రం. Show all posts

Thursday, May 31, 2018

రామ రామ మహాబాహో


రామ రామ మహాబాహో




సాహితీమిత్రులారా!

గతిచిత్రంలో
ఒక పద్యాన్ని లేదా శ్లోకాన్ని త్రిప్పి వ్రాసిన
వచ్చే శ్లోకం లేదా పద్యం వేరు అర్థాన్ని
ఇచ్చే ఒక ఉదాహరణ యమక భారతం
నుండి ఇక్కడ చూద్దాం-

అనులోమ శ్లోకం-
రామ రామ మహాబాహో మాయా తే సుదురాసదా
వాదసాదద కబ లోకే పాదావేవ తవాసజేత్
                                        (యమక భారతం - 71)
భావం -
ఓ రామా! నీవు ఆజానుబాహునివి. ఈ జగత్తులో కేవలం
బ్రహ్మపాదమే సరిపోలుతుంది నీ పాదంతో. నీ మాయను
అనుసరించటం చాల కష్టం. నీవు జ్ఞానప్రదాతవు.

ప్రతిలోమ శ్లోకం -
జేత్సవాతవ వేదాపాకేలోకోదద సాదవా
దాసరాదుసుతేయామాహేబాహా మమ రామ రా(రాః)
                                              (యమక భారతం - 72)

(ముందు చెప్పబడిన  అనులోమ శ్లోకాన్ని క్రిందినుండి
చదివిన ఈ ప్రతిలోమ శ్లోకం వస్తుంది గమనించండి.)

భావం -
ఓరామ! నీవు గాలితో సహా ఈ విశ్వానికి బోధకుడవు.
నీవు జ్ఞానప్రదాతవు మరియు ప్రపంచానికి క్రియవు.
నీవు నీ భక్తులలో భయాన్ని పోగొట్టి సంతోషాన్ని
చ్చేవాడివి. నీవు ఈశ్వరుని, స్కందుని, గణపతిని,
లక్ష్మిని నీ అధీనములో ఉంచుకొన్నవాడివి. నీవు
నరసింహ స్వామిగా రుద్రుని ఉవాహన చేసినవాడివి.
నీవే నా సంపద.

Monday, May 28, 2018

పద్యప్రతిలోమము


పద్యప్రతిలోమము




సాహితీమిత్రులారా!


ఒక పద్యాన్ని మామూలుగా చదివితే
దాన్ని అనులోమ పద్యం అంటాం.
అదే పద్యాన్ని చివరనుండి మొదటికి
చదివిన ప్రతిలోమమవుతుంది
అంటే మరొక పద్యం అవుతుంది.
గతంలో ఒప పద్యాన్ని త్రిప్పి చదివినా
అదే పద్యం వచ్చేది చూచాము
దానికి భిన్నమైంది ఇది.
లక్ష్మిసహస్రకావ్యంలోని ఈ
పద్యం చూడండి.
ఇది విద్యున్మాలికా వృత్తంలో
కూర్చబడింది.
అనులోమ పద్యం -
సామాధామాసారాభీమా
కామారామాకామాభూమా
రామాధామారారాభామా
భామాకామాభామాభూమా

భావం -
సామవేదానికి పూర్ణ నివాసులగు పండితులకు నివాసమైనదానా
శ్రేష్ఠురాలా భయముగొలుపనిదానా కేవలము ఇహలోకమునందలి
కోరికలుగల వారియందు అనురాగం లేనిదానా భూదేవిరూపం
నొందిన లక్ష్మీ స్త్రీల యొక్క తేజస్సునకు స్థానమైనదానా
సత్యభామ అనే పేరుగలదానా రమ్ము రమ్ము స్త్రీలయొక్క
కోర్కెలయందు ఉండుదానా కాంతి సంపదయొక్క ఆధిక్యమునకు
స్థానమైనదానా రమ్ము రమ్ము


ప్రతిలోమ పద్యం - 
పై పద్యాన్ని క్రిందినుండి పైకి వ్రాసిన వచ్చు పద్యం

మాభూమాభామాకామాభా
మాభారారామాధామారా
మాభూమాకామారామాకా
మాభీరాసామాధామాసా

భావం -
భూమియొక్కయు, పార్వతిఅను స్త్రీ యొక్కయు, కోర్కెలయొక్క
విశేష ప్రకాశముగలదానా, (భూదేవి, పార్వతి లక్ష్మివలన సకల
సంపదలు పొందుతారని తెలుపుట), మాకు కష్టములైన
పనులందు ధైర్యము నిచ్చుదానా, రమ్ము మాతేజస్వరూపమైన
దానా రమ్ము, మాసంపదకు స్థానమైనదానా, మన్మథునియందు
పూరణమైన సంతోషంకలదానా విష్ణుపత్నీ, భయముగలవారికి
సుహృద్బలమైనదానా లక్ష్మీ ప్రదముకాని చోట తేజస్సు
ఉండనిదానా  రమ్ము రమ్ము

ఈ విధంగా భావం మారిపోతున్నది.

Wednesday, July 27, 2016

రామపాదగతాభాసా


రామపాదగతాభాసా


సాహితీమిత్రులారా!

అనులోమ ప్రతిలోమపాదము అని
మునుపు తెలుసుకొని ఉన్నాము.
ఇక్కడ మరొకటి.
ఒక పాదం మొదటినుండి చివరకు
చదివితే అది అనులోమము.
దాన్నే చివరినుండి మొదటికి
చదివితే అది ప్రతిలోమమం.
ఏలా చదివినా మారకుండా
అలాగే ఉండటం చేత దీన్ని
అనులోమ ప్రతిలోమపాదం అంటారు.
వేదాంతదేశికులవారి
పాదుకాసహస్రంలోని
ఈ శ్లోకం చూడండి.

రామపాదగతాభాసా
సాభాతాగదపామరా
కాదుపానఞ్చకాసహ్యా
హ్యాసకాఞ్చనపాదుకా
                        (పాదుకాసహస్రము -919)


(శ్రీరాముని పాదాలను ఆశ్రయించిన బంగారు
పాదుక స్వీయకాంతితో మిక్కిలి ప్రకాశించేది.
దేవతలను వారి విరోధుల వల్ల కలిగే
మానసిక వ్యాధులనుంచి రక్షించేది.
పాదుకలను ఉపాసిస్తూ జ్ఞానానుష్ఠానాలు
లేని పామరజనులకు వ్యాధులు రాకుండా సుఖాన్ని కలిగించేది.
చతుర్ముఖ బ్రహ్మచేత, ఆరాధించబడే శ్రీరంగనాథుడు
సూర్యవంశస్థుడైన ఇక్ష్వాకు మహారాజుకు ప్రసాదించడం వల్ల
పాదుకలు అయోధ్యకు చేరుకొన్నది.
అయోధ్యలో సూర్యునికన్నా
ఉజ్జ్వలంగా ప్రకాశిస్తూ ఉండింది.)

ఈ శ్లోకంలోని మొదటి పాదాన్ని
చివరనుండి మొదటికి చదివిన
2వ పాదము వస్తుంది.
అలాగే 3వ పాదం చివరనుండి చదివిన
4వ పాదం వస్తుంది.
కావున ఇది అనులోమ ప్రతిలోమపాదశ్లోకం 
అనబడుచున్నది.

Tuesday, May 24, 2016

అనులోమ ప్రతిలోమ శ్లోకం


అనులోమ ప్రతిలోమ శ్లోకం


సాహితీమిత్రులారా!

ఒకశ్లోకం మొదటి అక్షరం నుండి చివరి అక్షరం వరకు చదివితే ఒక అర్థం వస్తుంది.
ఆ శ్లోకాన్నే చివర నుండి మొదటికి చదివిన మరో శ్లోకం వచ్చి మరోఅర్థం వస్తుంది.
దీన్నే అనులోమ ప్రతిలోమ శ్లోకం అంటారు.

నసమాశనవాగారం నమేమత్వామజేయతం
తరసారమ్యనవ్యాభమరామాదయమా విభో
                                          (అలంకారశిరోభూషణే శబ్దాలంకారప్రకరణం - 34)

(ఆశలు కోరికలు లేని నిష్కాముల యొక్క యజ్ఞాలు
నిలయంగా కలవాడవు, జయింప వీలుకానివాడవు,
నిత్యనూతన తేజస్సుకలవాడవు, శీఘ్రంగా ఫలాలను
ఇచ్చేదయగలవాడవు. అయిన
లక్ష్మీ వల్లభా! రంగనాధా! నమస్కారం)

ఇదే శ్లోకాన్ని చివరినుండి మొదటికి రాయగా


భోవిమాయదమారామ భర్యా నమ్య రసారత
తం యజేమత్వామమేన రంగావాన శమాసన
                                     

(మాయా రహితులైన ఇంద్రియ మనోనిగ్రహాల
చేత క్రీడించు పుణ్యాత్ముల చేత నమస్కరింప
దగిన శ్రీరంగపుణ్యభూమి యందు
ఆసక్తి కలవాడా! ఆనందంగా ఉండేవాడా!
శ్రీరంగనిలయుడవాన నిన్ను
సన్నిధిలో సేవిస్తాను.)