Showing posts with label మిశ్రమ శబ్దచిత్రం. Show all posts
Showing posts with label మిశ్రమ శబ్దచిత్రం. Show all posts

Sunday, January 12, 2020

సర్వలఘునిరోష్ఠ్య చిత్రం


సర్వలఘునిరోష్ఠ్య చిత్రం




సాహితీమిత్రులారా!

దీర్ఘాలైన అచ్చులు లేకుండా శ్లోకాన్ని లేదా
పద్యాన్నిరాయడాన్ని సర్వలఘుచిత్రం అంటాము.
అలాగే వర్ణముల ఉత్పత్తిస్థానాలను బట్టి కేవలం
కొన్నిటినే తీసుకొని వ్రాయటాన్ని స్థాన చిత్రం అంటాము.

ఈ క్రింది శ్లోకంలో ఈ రెండింటిని చూడవచ్చు చూడండి-

ఖలహనన కరణగరగళ
జలజజనత తరణ సకల జనదర హరణ
లలదజల శరణ జయకర
గలనన రథచరణ నతత ఖరకర శరణ
                                                     (అలంకారశిరోభూషణే - 7 - 21)
(ధర్మ భ్రష్టులైన దుష్టులను వధించువాడా!
విషధరుడైన శివునిచేత, పద్మభవుడయిన
బ్రహ్మచేత నమస్కరింపబడిన పాదాలు కలవాడా!
జనుల భయాన్ని హరించువాడా!
ముసలితనం లేని దేవతలకు దిక్కైనవాడా!
జయమును కలిగించువాడా!
నిరంతర సూర్యమండల వర్తీ రంగనాథా!
నీకు నమస్కారం)

మొదటిది-
దీనిలోనివన్నీ లఘువులే కావున
ఇది సర్వలఘుచిత్రం క్రింది వస్తుంది.
దీనిలో 2,4 పాదాలలోని చివరి అక్షరాలు
లఘువులైనా గురువులుగా పలికే
సాంప్రదాయం చిత్రకవిత్వంలో ఉంది.

రెండవది-
ప,ఫ,బ,భ,మ,వ - అనే హల్లులు
ఉ,ఊ,(ఒ),ఓ,ఔ - అనే అచ్చులు
పెదిమలచే పలుకబడతాయి
వీటిని ఓష్ఠ్యములు అంటారు.
వీటిని లేకుండా రాయడాన్ని నిరోష్ఠ్యము అంటారు.
ఇది స్థానచిత్రము- దీన్ని పెదిమలు తగలకుండా
పలుకవచ్చు చదివి గమనించండి.