Showing posts with label కల్పలతా వివేకం. Show all posts
Showing posts with label కల్పలతా వివేకం. Show all posts

Saturday, December 24, 2016

రుచించనివాడు పండితంమన్యుడై ఉండాలి


రుచించనివాడు పండితంమన్యుడై ఉండాలి


సాహితీమిత్రులారా!


కల్పలతా వివేకం అనే
అజ్ఞాత కర్తృక గ్రంధంలో
శబ్దాలంకారాలను వివరించిన
తరువాత ఈ శ్లోకం చెప్పాడు కవి
అది చూడండి-

యస్మైచ రోచతే నేదం 
నమస్తస్మై మనీషిణే
అపి భస్వన్న శక్నోతి 
భేత్తు మంతర్గుహం తమః

ఈ పుస్తకం ఎవరికి రుచించదో,
ఆ పండితునికొక నమస్కారం చేస్తాను.
ఎందుకంటే సూర్యుడు కూడ పర్వతగుహలోపల
ఉండే చీకటిని తొలగించలేడు కదా!

విజ్ఞాన, వినోద, పాండిత్య ప్రదర్శకమైన
నాయీ శబ్దచిత్రాలంకార గ్రంధం రుచించనివాడు
పండితంమన్యుడై ఉండాలి. అతనిలోని అజ్ఞానం
గుహలోపలి దట్టమైన చీకటివంటిదని గమ్యార్థం.