Showing posts with label విచిత్ర పద్యాలు. Show all posts
Showing posts with label విచిత్ర పద్యాలు. Show all posts

Tuesday, January 30, 2018

పత్రికా వార్తల పద్యం


పత్రికా వార్తల పద్యం



సాహితీమిత్రులారా!




రోజూ మనం చూచే వార్తాపత్రుకల్లోని
రెండుమూడురోజుకకొకసారైనా కనిపించే
సాధారణ శీర్షికలతో చామర్తి కృష్ణమూర్తిగారు
ఒక శార్దూల పద్యం మలిచారు
ఆ పద్యం -

లారీఢీ, పదిమంది ఠా, పడవ బోల్తా, యాత్రావాసుల్ హరీ,
సారాబాబుల పట్టివేత, ఒక కబ్జాదారుపై కేసు, రా
స్తారాకో, అధికారి ఇంట ధరనా, సర్పంచి కిడ్నాపుతో
చోరీ - అంచు పత్రికా ప్రకటనల్ శోభిల్లు ముప్పొద్దులన్
                                                     (పద్యారామం, బేతవోలు రామబ్రహ్మం పుట. 82)