Thursday, November 30, 2023

సాహిత్యంలో దోమ

 సాహిత్యంలో దోమ




సాహితీమిత్రులారా!

    కుక్కపిల్లా అగ్గిపుల్లా సబ్బుబిళ్ళా హీనంగా చూడకు దేన్నీ! కవితామయమేనోయ్ అన్నీ! అన్నాడు మన మహాకవి శ్రీశ్రీ. అయినా మన కవుల కళ్ళు పడ్డాక జీవుడైనా, దేవుడైనా కిక్కురుమనకుండా వచ్చి ఏ పద్యంలోనో, శ్లోకంలోనో కూర్చోవలసిందే. మనుషులతో పాటు, పశువులు, పక్షులు, చెట్లు చేమలు, కొండలు గుట్టలు కూడా మన కవుల చేత వీరతాళ్ళు వేయించుకున్నాయి. కేవలం కొన్ని రోజుల పాటూ మాత్రమే బ్రతికే అల్పజీవులెన్నో మన కవుల పుణ్యమా అని చిర యశస్సును సంపాదించుకున్నాయి. అటువంటి ఘనతకెక్కిన జీవులలో ప్రధానమైనవి రెండు. మొదటిది నల్లి. రెండవది దోమ. 

    వెనకటికో కవిగారు నల్లి గొప్పతనం గురించి చెబుతూ శివుడద్రిని  శయనించుట - రవిచంద్రులు మింటనుంట - రాజీవాక్షుండవిరళముగ శేషునిపై పవళించుట - నల్లి బాధ పడలేక సుమీ అంటూ నల్లి ప్రయోజకత్వాన్ని పసందైన రీతిలో చెప్పుకొచ్చాడు. శివుడు మంచుకొండపై నివసించడానికి, సూర్యచంద్రులు నేలమీద కాకుండా ఆకాశంలో తిరగడానికి, విష్ణుమూర్తి ఆదిశేషునిపై పడుకోవడానికి గల కారణం బుల్లి జీవైన ఈ నల్లికి భయపడేనట. ఒకప్పుడు అంతటి వైభోగంతో బ్రతికిన నల్లి కాలప్రవాహంలో తన అస్థిత్వాన్నే కోల్పోయే స్థితికి చేరుకుంది. పల్లెటూళ్ళ నులక మంచాలు, సినిమా ధియేటర్లలో పీలికల కుర్చీలు అంతరించిపోవడంతో వాటికి నిలువ నీడ కరువయ్యింది. 

    నల్లి సంగతి అలా ఉంటే.. ఆ నల్లికి వేలు విడిచిన చెల్లిలాంటి దోమ మాత్రం నాగరికతా పరిణామలను, పర్యావరణ మార్పులను తట్టుకుంటూ తమ జాతిని విస్తరింపజేసుకుంటూ సాగిపోతోంది. దాని ప్రఖ్యాతి ఎంత గొప్పది కాకపోతే మనం హస్తిమశకాతరం అంటూ ఏనుగు ప్రక్కన దోమను నుంచోబెట్టి మరీ పోలిక చెబుతాం. ఆ మాట అలా ఉంచితే.. అసలు సమానత్వం చూపించడంలో దోమని మించిన జీవి లేదు. పేదా గొప్పా భేదం లేకుండా ఎవరి చెంప వాళ్ళు వాయించుకునేలా చేయగల సామ్యవాద జీవి మన దోమ. గురించి మన సాక్షీ వ్యాసాల పానుగంటి వారు, హాస్యబ్రహ్మ భమిడిపాటి వారు ఏకరువు పెట్టిన మెచ్చుతునకలను ఈరోజు చెప్పుకుందాం. 

Rajan PTSK గారికి ధన్యవాదాలు

Friday, July 21, 2023

ముద్రారాక్షసమ్ - చాణక్య

 ముద్రారాక్షసమ్ - చాణక్య 



సాహితీమిత్రులారా!

ఈరోజు మనం చెప్పుకోబోయేది సామాన్యమైన కథ కాదు. తన కోపంతో ఒక రాజవంశాన్ని పడగొట్టి, మరో రాజవంశాన్ని నిలబెట్టిన రాజనీతివేత్త కథ. ప్రపంచ చరిత్రలోనే అత్యంత మేధావిగా పేరు పొందిన ఆ రాజనీతివేత్త మన చాణక్యుడు. ఆయనకు వచ్చిన కోపం ఎంతో బలమైన నందరాజ వంశాన్ని నాశనం చేసింది. ఆయనకు కలిగిన అనుగ్రహం సుస్థిరమైన మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది. ఆయన రచించిన అర్థశాస్త్రం ఇప్పటికీ అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలకు వెన్నుదన్నుగా నిలిచింది. అటువంటి చాణక్యుని రాజనీతిపై, అతని ఎత్తులు పై ఎత్తులు ఎలా ఉంటాయన్న విషయంపై సుమారు పదిహేను వందల సంవత్సరాల క్రితం వ్రాయబడ్డ గ్రంథమే ఈ ముద్రా రాక్షసమ్. ఈ గ్రంథ రచయిత విశాఖదత్తుడు. ఈ విశాఖదత్తుడు ఒక రాజవంశీయుడు. తన తాతగారు ఒక సామంతరాజనీ, తన తండ్రి ఒక మహరాజనీ ఆయన ఈ గ్రంథంలోనే చెప్పుకున్నాడు. ఇక ముద్రారాక్షసం కథలోకి వద్దాం. ఈ నాటకానికి వ్యాఖ్యానం చేసిన డుంఢిరాజు ఉపోద్ఘాతంతో కలిపి చెప్పుకుంటే మనకు కథ స్పష్టంగా అర్థమవుతుంది. 

ఇక ముద్రారాక్షసమ్ కథలోకి ప్రవేశిద్దాం.

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు

Wednesday, July 12, 2023

పద్మబంధం

 పద్మబంధం




సాహితీమిత్రులారా!

నారంభట్ల లక్ష్మీనారాయణశర్మ గారి

దుంపెట శ్రీలక్ష్మీనారసింహ శతకం నుండి

పద్మబంధం

ఆస్వాదించండి-





Sunday, July 9, 2023

సప్తదళ గర్భ సీసం

 సప్తదళ గర్భ సీసం




సాహితీమిత్రులారా!

నారంభట్ల లక్ష్మీనారాయణశర్మ గారి

దుంపెట శ్రీలక్ష్మీనారసింహ శతకం నుండి

సప్తదళ గర్భ సీసం ఆస్వాదించండి-







Tuesday, July 4, 2023

నోరు తిరగని సరదా పద్యాలు

 నోరు తిరగని సరదా పద్యాలు



సాహితీమిత్రులారా!

తెలుగు భాషలో ఎన్నో చమత్కార పద్యాలున్నాయి. వాటిల్లో ఒకటి.. 

ఈరోజు చెప్పుకోబోయే న గుణింత అక్షరాలు మాత్రమే ఉండే ఏకాక్షరి పద్యం. ఇది Tongue twister లా ఉంటుంది. ఇది సరదాగా సాధన చేయండి. చూడకుండా చెప్పడానికి ప్రయత్నించండి. మీ పిల్లలతో కూడా చెప్పించండి. ఇటువంటి పద్యాలను కంఠస్థం చేయడం వల్ల మనకు నోరు బాగా తిరగడంతో పాటూ, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

 Rajan PTSK గారికి ధన్యవాదాలు

Saturday, July 1, 2023

కుదిరిన సంధి

 కుదిరిన సంధి




సాహితీమిత్రులారా!



కుదిరిన సంధి(సరదాగా చేసిన ఓ చిన్న ప్రయత్నం)

ఆస్వాదించండి-


అతి+అంత, అత్యంత సుందరమైన రాజ్యం "యణా దేశం"!  మహా+ఉన్నతమైన, మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు ఆ దేశపు మహారాజు "గుణ సంధుడు". దేశ+ఔన్నత్యం, దేశౌన్నత్యమే , ఏక +ఏక, ఏకైక లక్ష్యంగా తన రాజ్యాన్ని "వృద్ధి" చేశాడు అతడు. అటువంటి ఉన్నత సంస్కారం "కలవారి" ఇంట పుట్టినది, సౌందర్యంతో పాటు చక్కని గుణగణాలు "కలది" ఆ దేశపు యువరాణి "బహువ్రీహి" ! 

తన చుట్టూ "ఒకటి" కాదు, "రెండు" కాదు....అసంఖ్యాకమైన మిత్రులను ఏర్పరుచుకుని "ద్విగు మహారాజు" , పక్కనే ఉన్న "గసడదవా దేశాన్ని" రాజ్యము+చేయు, రాజ్యముసేయు చుండెను. ఆ దేశపు యువరాజు, అత్యంత పరాక్రమశాలి, చక్కటి శరీర+ఆకృతి, శరీరాకృతి కలిగి ఉండిన, సుందర+అతిసుందరుడు, సుందరాతిసుందరుడు అయిన  "సవర్ణ దీర్ఘ సుందరుడు", యణా దేశపు యువరాణి బహువ్రీహిని ప్రేమించాడు. 

ఓ విహార యాత్రలో సవర్ణ దీర్ఘ సుందరుడిని చూసి, తాను కూడా అతడిని మోహించింది, బహువ్రీహి! అదే విషయాన్ని మొదట+మొదట, మొట్టమొదట తన తల్లి అయిన "ఆమ్రేడిత" తో చెప్పింది. తండ్రి గుణ సంధుడు కూడా సంతోషంగా ఇందుకు ఒప్పుకుని, వారిరువురికీ వివాహం చెయ్యడానికి నిశ్చయించుకుని, అదే విషయాన్ని ద్విగు మహారాజుకి వర్తమానం పంపాడు. ద్విగు మహారాజు కూడా ఆనందంగా ఇందుకు ఒప్పుకున్నాడు. 

వారిద్దరి వివాహం ఖరారైన నేపథ్యంలో , బహువ్రీహి ప్రధాన  చెలికత్తె అయిన "ఉత్పలమాల" "భరనభభరవ... భళి భళి" అంటూ ఉత్సాహంతో ఎగిరి గంతేసింది. "తాన తానన తాన తానన తాన తానన తాన తా" అంటూ "రస(జజ)భరితంగా" యువరాణి గుణ గణాలను గానం చేసింది...."మత్తకోకిల" ! 

ఇదిలా ఉండగా....

వజ్రము+గనులు, వజ్రపుగనులు, మిక్కుటంగా కలిగి, ప్రపంచము+అంగడి, ప్రపంచపు అంగడిలో వ్యాపార లావాదేవీలను జరుపుతూ, మిక్కిలి సంపన్న దేశంగా వెలుగొందుతోంది "పుంప్వా దేశం". ఈ పై వివాహ విషయాన్ని వార్తాహరుల ద్వారా తెలుసుకుని గట్టిగా నిడు+ఊర్పు, నిట్టూర్చాడు ఆ దేశపు చక్రవర్తి, " ద్విరుక్త టకారుడు" ! ఇది ససేమిరా తనకు నచ్చలేదు. బహువ్రీహి పై తనకు ఎప్పటి నుండో మోజు ఉంది. సమయం కోసం వేచి చూస్తున్న ద్విరుక్త టకారునికి, ఇదే సరైన సమయం అని తోచి...అహంకార గర్వంతో, బహు వ్రీహి ని తనకు ఇచ్చి వివాహం చెయ్యమని, లేని పక్షాన "ద్వంద్వ"యుధ్ధానికి సిధ్ధం కమ్మని....తన వద్ద పనిచేసే అన్న-తమ్ముడు, అన్నదమ్ములు అయిన జయవిజయులను రాయబారానికి యణా దేశానికి పంపాడు. 

తాను ఒక్కడినే ద్విరుక్త టకారుని ఓడించడం కష్టమని, ద్వంద్వ యుద్దము లో ఓడిపోవడం ఖాయమని తలంచి యణా దేశపు రాజు గుణ సంధుడు, ద్విగు మహారాజు తో సమావేశం అయి పరిష్కారాన్ని కోరాడు. అందుకు ద్విగు మహారాజు ఒప్పుకుని, ఉత్తరాదిన ఉన్న తన మిత్రదేశాల రాజుల సహాయం కూడా కోర దలచి, అందరూ కలసి యుధ్దం చేస్తే ద్విరుక్త టకారుడిని జయించడం అంత కష్టమైన విషయం కాదని ఎంచి, ఉత్తర భారతానికి ప్రయాణం కట్టాడు ద్విగు మహారాజు. 

అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ, దారిలో వృద్ధురాలు,  పేద+ఆలు, పేదరాలు అయిన "రుగాగమ" ఆతిథ్యాన్ని స్వీకరించి, ఆమెకు అభయమొసగి, తిరిగి ప్రయాణం కొనసాగించి ఉత్తర భారతం చేరుకున్నాడు ద్విగు మహారాజు. 

"ఆ - ఈ - ఏ" అంటూ తన రాజ్యం లోనికి స్వాగతం పలికాడు "త్రిక సంధుడు" . విషయం విని తన మద్దతు ప్రకటించాడు. ఆ+కన్య, అక్కన్య వివాహం తమ చేతుల మీదుగా చేద్దాం అంటూ హామీ ఇచ్చాడు. 

సంధి కై ప్రయత్నించుదుము, సంధి కుదరని యెడల మనమెటుల ఊరడిల్లి+ ఉండు, ఊరడిల్లియుండగలము, కలసి పోరాడుదాం అంటూ "యడాగముడు" కూడా బదులిచ్చాడు. 

జగత్+నాటక, జగన్నాటక సూత్రధారి అయిన పరమాత్ముని అండ మనకి ఉండగా, ద్విరుక్త టకారుడిని దండించి తీరుదాం అని, పక్క దేశపు మహారాణి అయిన "అనునాసిక" తన మద్దతు తెల్పింది.

నా అంతః+ఆత్మ, అంతరాత్మ కూడా అదే చెబుతోంది అంటూ "విసర్గ" దేశపు పట్టపురాణి బదులు పలికింది. 

"అత్వ", "ఇత్వ", "ఉత్వ", "శ్చుత్వ", "జశ్త్వ" దేశాల రాజులు కూడా వంత పాడారు. 

అందరి మద్దతు కూడగట్టుకున్న ద్విగు మహారాజు మరియు గుణ సంధులు,  ద్విరుక్త టకారుడు భయము+పడె, భయపడేలా, నివ్వెరము+పాటు, నివ్వెరపాటు కి లోనయ్యేలా "పడ్వాదు"లను రాయబారానికి పంపి, ముందుగా సంధి ప్రయత్నం చేశారు.

విషయాన్ని గ్రహించిన ద్విరుక్త టకారుడు.... అన్ని దేశాల రాజులు కలసి తనపై యుధ్దం ప్రకటిస్తే, తనకు ముప్పు తప్పదని తెలుసుకున్నాడు. అంత బలగం ముందు తానొక చిరు+ఎలుక, చిట్టెలుక అని తెలుసుకుని, తాను ప్రతిపాదించిన విషయాన్ని వెనక్కి తీసుకుని,  సంధి కి ఒప్పుకున్నాడు! అంతే కాదు తన వాణిజ్యం కూడా దెబ్బ తింటుంది అని గ్రహించి, తనకున్న వజ్రపు గనులలో కొన్నిటిని సవర్ణ దీర్ఘ సంధుడు-బహువ్రీహిల  పేరిట 

రాసిచ్చి, దగ్గరుండి వారిద్దరి వివాహాన్ని కూడా జరిపించాడు. 

అందరూ ఎంతో సంతోషించి, గట్టిగా చప్పట్లతో తమ హర్షధ్వానాలు తెలియజేశారు!! 

ఒరేయ్.... ! లే....ఏవిటా చప్పట్లు, నువ్వూనూ. తెలుగు పరీక్ష అనేసరికి ఎక్కడలేని కలవరింతలు, పలవరింతలూను. ముందుగానే కొంచెం చదువుకుని ఉండొచ్చుగా! తెల్లారి అయిదు కావస్తోంది...లే...లేచి కూచుని చదువుకో, తొమ్మిదింటికి పరీక్ష కి వెళ్ళాలి....! 

తల్లి కేకతో, ఆమె అటుగా వెళ్లిన తరువాత సందు చూసుకుని సంధులు పక్కన పెట్టి, తయారై పరీక్షల సందడి లో మునిగిపోయాడు తొమ్మిదో తరగతి చదువుతున్న సందేశ్! 


ఇది వైద్యంవారి వాట్సప్ నుండి -

Saturday, June 24, 2023

చిత్రకవితా సౌరభం - పుస్తకావిష్కరణ ఛాయాచిత్రాలు

 చిత్రకవితా సౌరభం - పుస్తకావిష్కరణ ఛాయాచిత్రాలు




సాహితీమిత్రులారా!

చిత్రకవితా సౌరభం - 

11 జూన్ 2023 నాడు 

కడప సి.పి.బ్రౌన్ భాషాపరిశోధన కేంద్రంలో

జరిగిన పుస్తకావిష్కరణ ఛాయాచిత్రాలు

ఆస్వాదించండి-


ఆవిష్కర్త - చింతా రామకృష్ణారావు గారిని ఆహ్వానించిన ఛాయాచిత్రం
ఆహ్వానించిన వారు అలంకారం ఆదిత్య కుమార్, అలంకారం వసంతకుమార్


ఆవిష్కర్త - కందుల నాగేంద్ర వరప్రసాదు గారిని ఆహ్వానించిన ఛాయాచిత్రం
ఆహ్వానించిన వారు అలంకారం విజయ కుమార్, అలంకారం వసంతకుమార్
చిత్రకవితా సౌరభం - పుస్తకావిష్కరణ


ఎడమ నుండి కుడికి - శారదాప్రసన్నగారు, మూల మల్లికార్జునరెడ్డిగారు, కందుల నాగేంద్ర వరప్రసాదుగారు, చింతా రామకృష్ణారావుగారు, భూతపురి గోపాలకృష్ణశాస్త్రిగారు, చింతకుంట శివారెడ్డిగారు, అలంకారం వేంకట రమణ రాజు గారు, అవధానం అమృతవల్లిగారు