Showing posts with label చిత్రకథలు. Show all posts
Showing posts with label చిత్రకథలు. Show all posts

Sunday, August 20, 2017

కవిని పట్టిచ్చిన చక్రబంధం


కవిని పట్టిచ్చిన చక్రబంధం 




సాహితీమిత్రులారా!

తెలుగులో బిల్హణీయం అనే కావ్యాన్ని
పిండిపెద్ది కృష్ణస్వామి రచనగా ముద్రింపబడి
ప్రచారంలో ఉంది. దీన్ని పిండిపెద్ది కృష్ణస్వామి
గారు వ్రాయలేదని పరిశోధకులు తేల్చారు.
దీని వెనుక కథ-
దీని అవతారికలో చిత్రకవి సింగనార్యుని కుమారుడు
నారసింహకవి వచ్చి మెచ్చి కృష్ణస్వామిని బిల్హణకృతి
రచించటానికి ప్రోత్సబించినట్లు చెప్పబడి ఉన్నది.
అదే కృతి ప్రథమాశ్వాసాంతంలో ఒక చక్రబంధం
కూర్చబడింది. చక్రబంధంలో మూడవ వలయంలో
కవిపేరు,ఆరవ వలయంలో గ్రంథము పేరు,
లేదా కృతిపతిపేరు రావాలి. ఈ గ్రంథంలో
3వ వలయంలో సింరార్యకవి - అనే పేరు
కవిపేరుగా కూర్చబడింది. దీని బట్టి
సింగరార్య కుమారునికి కృష్ణస్వామి ద్రవ్యమిచ్చి
తను వ్రాసివిధంగా మార్చి ఉంటాడని తెలుస్తున్నది.
అంటే కవిని చక్రబంధం పట్టిచ్చినది తెలుస్తుంది.
ఆ చక్రంబంధ పద్యం-

ధన్యాసింహభచంద్రకీర్తివరవిద్యాపండితార్యక్రమా
గణ్యార్విధనంజయాశిపదముక్తాకృత్స్రగంప్రభా
జన్యారాజితభూరిశాత్రవకుభృజ్జాతిప్రభావిక్రమా
మాన్యారాధనత్యాగభోగజయధామానవ్యభాగోత్తమా

సింగరాచార్యుడు తన మరోకృతి అయిన
రాఘవవాసుదేవీద్వర్థికావ్యంలో
బిల్హణీయం కూర్చినట్లు చెప్పియుండటం
వలన ఇది సింగరాచార్యుడే వ్రాసినదని
రూఢియైనది.