Thursday, August 25, 2016

కనికరమూనక కపట మిడితి


కనికరమూనక కపట మిడితి

సాహితీమిత్రులారా!


యడవల్లి వేంకట కృష్ణశాస్త్రిగారి -
హరిశ్చంద్రోదయము నందలి
సంభాషణ చిత్రము చూడండి.

విష్ణుమూర్తికి స్త్రీరూపమున ఉన్న చంద్రునికి
మధ్య సంభాషణ
సీసపద్యంలో.
విష్ణువు - జాబిల్లినని పల్కి జాగుసేయగనీకు
                       నో భిల్ల కన్యకా యుచిత మగునె
స్త్రీ -       ఉచితమా ఇటు వల్క నుధధి కన్యావర
                      నిజము దెల్పిన నెనరు లేదె
వి-       నెనరుంచుట గాదె గన వచ్చినను నెద
                      కనికరమూనక కపట మిడితి
స్త్రీ -      కపట నటుండవె గావె నీవెప్పుడు
                      విపరీతములు బల్క వినుట లేదె
వి.-      వినక నిట వచ్చినాడనె వెలది మిన్న
స్త్రీ. -     మిన్న తనముకు నీ కన్న నెన్న గలరె
వి.-      గలిగి యుండిన నీవిట్లు పలుకుదువటె
స్త్రీ.-      బలికితినె సుంత విపరీత భావమిచట.
                                      (4 ఆశ్వాసము పుట. 70)

అని వాదోపవాదము గావించిరి.
 చివరకు విష్ణువు మాయచే భిల్లాంగనను వశపరచుకొనెను
వారిరువురి ప్రేమ ఫలితంగా చంద్రునకు బాలుడుదయించెను.
ఆ బాలుని సంతానములేక తపమాచరించు త్రిశంకునకు ఇచ్చివేసిరి.
చంద్రునకు శాపవిమోచనమైనది.
విష్ణువును వెదకుచూ లక్ష్మిరాగా విష్ణువు వెళ్ళెను.


No comments: