Thursday, June 23, 2016

మధుర్మధూని గాంధర్వమందిరం


మధుర్మధూని గాంధర్వమందిరం


సాహితీమిత్రులారా!

వృత్త్యనుప్రాసలో 1. కార్ణాటీ, 2. కౌంతలీ, 3. కౌంకీ - ను
గురించి తెలుసుకున్నాము.
ఇప్పుడు నాలుగవది కౌంకణీ గురించి తెలుసుకుందాము.
'త' - వర్గక్షరాలు పెక్కమార్లు ఆవృత్తమైన అది
కౌంకణీ వృత్త్యనుప్రాసము అనబడుచున్నది.

మధుర్మధూని గాంధర్వమందిరం మదిరేక్షణా
ఇందు రైందీవరం దామ కామ మానందయన్తి న:

వసంత ఋతువు, మధువులు, సంగీతమందిరము, మదిరేక్షణ,
చంద్రుడు, నల్లకలువల హారము మాకు పూర్తిగా ఆనందము
కలుగజేయును - అని భావం

ఈ శ్లోకంలో "త" - వర్గాక్షరాలైన "ద,ధ,న" వర్ణములు
పున: పున: ప్రయుక్తములైనవి.
'త' వర్ణము ఒక్కచోటమాత్రమే వచ్చింది.
శ్లోకంలోని పూర్ణబిందువులన్నీ  త - వర్గాక్షరమునకు ముందే
ఉండటం వల్ల "న" కార ఉచ్ఛారణమునే కలిగి ఉండును.
"మదిరేక్షణ" అనే పదానికి ముంగన్న బిందువుమాత్రం
మకార ఉచ్ఛారణ కలిగి ఉన్నది.
దీనిలో తవర్గక్షరముల  అనేకముగ ఆవృత్తము
అగుట వలన ఇది కౌంకణీ వృత్త్యనుప్రాసమగుచున్నది.

No comments: