Saturday, June 25, 2016

కపోలతటిపైఁ బాలిండ్లపై.....(అనుకరణ పద్యం)


కపోలతటిపైఁ బాలిండ్లపై.....(అనుకరణ పద్యం)


సాహితీమిత్రులారా!

ఇది పోతన భాగవతం(8-592)లోని పద్యం
ఇది వామన చరిత్రలో బలిచక్రవర్తి తన
గురువైన శుక్రాచార్యునితో అన్న పద్యం.

ఆదిన్ శ్రీసతి కొప్పుపైఁ, దనువుపై, సంసోత్తరీయంబుపైఁ
బాదాబ్జంబులపైఁ గపోలతటిపైఁ బాలిండ్లపై నూత్న మ
ర్యాదం జెందు రకంబు గ్రిం దగుట మీదై నా కరంబుంట మేల్
గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే

దీనికి అనుకరణ పద్యం
రాయకవి(అయ్యలరాజు) త్రిపురాంతకుని
"రఘువీరా! జానకీనాయకా!" శతకం(69)లోనిది
చూడండి.
పరనారీకుచకుంభపాలికలపైఁ బాదాబ్జయుగంబుపైఁ
గరమూలంబులపైఁ గపోలతటిపైఁ గంఠంబుపైఁ గొప్పుపైఁ
బరువుల్ వాఱెడు నాతలంపులు మిమున్ భావింపఁగాఁ జేసి స
ర్వరసాధీశ్వర నన్నుఁబ్రోవు రఘువీరా! జానకీనాయకా!

No comments: