Saturday, December 24, 2016

రుచించనివాడు పండితంమన్యుడై ఉండాలి


రుచించనివాడు పండితంమన్యుడై ఉండాలి


సాహితీమిత్రులారా!


కల్పలతా వివేకం అనే
అజ్ఞాత కర్తృక గ్రంధంలో
శబ్దాలంకారాలను వివరించిన
తరువాత ఈ శ్లోకం చెప్పాడు కవి
అది చూడండి-

యస్మైచ రోచతే నేదం 
నమస్తస్మై మనీషిణే
అపి భస్వన్న శక్నోతి 
భేత్తు మంతర్గుహం తమః

ఈ పుస్తకం ఎవరికి రుచించదో,
ఆ పండితునికొక నమస్కారం చేస్తాను.
ఎందుకంటే సూర్యుడు కూడ పర్వతగుహలోపల
ఉండే చీకటిని తొలగించలేడు కదా!

విజ్ఞాన, వినోద, పాండిత్య ప్రదర్శకమైన
నాయీ శబ్దచిత్రాలంకార గ్రంధం రుచించనివాడు
పండితంమన్యుడై ఉండాలి. అతనిలోని అజ్ఞానం
గుహలోపలి దట్టమైన చీకటివంటిదని గమ్యార్థం.

No comments: