Friday, November 25, 2016

మధురవాణీ విలాసములోని చిత్రకవిత


మధురవాణీ విలాసములోని చిత్రకవిత




సాహితీమిత్రులారా!


మధురవాణీవిలాసమును రచించిన
చింతపల్లి వీరరాఘవయ్యగారు క్రీ.శ.1660
ప్రాంతంలో మహబూబునగర్ జిల్లా,
వట్టెం గ్రామంలో నివసించారు.
ఈ కావ్యం అయిదు ఆశ్వాసాలు గలది
దీనిలో మధురవాణీ కార్తవీర్యుల కథ కూర్చబడినది.
ద్వితీయాశ్వాసంలోని చిత్రకవిత్వంలోని
ఏకాక్ష , ద్వ్యక్ష   త్య్రక్షర - పద్యాలను చూడండి-

ఏకాక్షరకందపద్యం-

''- అనే ఒకే హల్లుతో కూర్చిన కందము.

నిన్నే నెన్నేనని నే
నెన్నైనను నెన్నునిన్నని నేనా
ని న్నాన నూన నేనిన్
నన్నానును నాననాను నననీనన్నా (2-11)

ద్వ్యక్షర కందము-

'', '' - అనే హల్లులుపయోగించి కూర్చినది.

నానా నాకౌకోనీ
కేనాన నిన్నెకాక నినేనొనై
నానెన్ని కిను నూన
కానుకకైకొన్న నిన్ను న్నా నికఁనే (2-12)


, - అనే రెండు హల్లులతో
కూర్చిన ద్వ్యక్షరకందం-

నేమమ్మున నీనామము
మామమున నమ్మినాము మము మనును మో
మామానినాన నెమ్మిని
మే మనుమామ్ముమామి మ్మెన్నేమా (2-13)


త్య్రక్షరకందము-

ద,,- అనే మూడు హల్లులను
ఉపయోగించి కూర్చిన
కందపద్యం ఇది

దావవవవదా
నానావిద్వన్నవీ నిదానా
దీనానాదీదా
నానుదు నె నీదువాదు నావినోదా (2-14)

ఈ కావ్యంలోని మరికొన్ని విషయాలను
తరువాత తెలుసుకొందాము.

No comments: