Tuesday, April 19, 2016

పేరడీ పద్యాలు


పేరడీ పద్యాలు


సాహితీమిత్రులారా!
ఒక పాటనుగాని, పద్యంగాని, శ్లోకాన్నిగాని అనుకరిస్తూ
అదేవిధంగా రాస్తే అది  అనుకరణ అని
వ్యంగ్యంగా అనుకరిస్తే పేరడీ అని  చెప్పబడుతూంది.

ఈ పద్యం కాసుల పురుషోత్తమకవి ఆంధ్రనాయక శతకంలోనిది
ఇది ఆంధ్రమహావిష్ణువును గూర్చి రాసినది.

ఆలు నిర్వాహకురాలు భూదేవియై యఖిలభారకుఁడను నాఖ్యఁదెచ్చెనిష్టసంపన్నురాలిందిర భార్యయై కామితార్థదుఁడన్న ఘనతఁ దెచ్చెగమలగర్భఁడు సృష్టకర్తతనూజుఁడై బహుకుటుంబికుఁడన్న బలిమిఁ దెచ్చెగలుష విధ్వంసిని గంగ కుమారియై పతితపావనుఁడన్న ప్రతిభఁ దెచ్చె
నాండ్రు బిడ్డలు దెచ్చు ప్రఖ్యాతిగానిమొదట నుండియు నీవు దామోదరుఁడవెచిత్రచిత్రప్రభావ, దాక్షిణ్యభావ,హతవిమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ.


దీనికి ఇలపావులూరి సుబ్బారావుగారు వైద్యవిద్యకు అన్వయించి పేరడీ రాశారు
నవ్వులు-నవ్వులు(పుట.41)లో చూడండి.

చెవుల స్టెతస్కోపు చెప్పి గుండియ బీటు హార్టు స్పెషలిష్టనునాఖ్యదెచ్చె
జ్వరమాని దేహాన వరలు నుశ్ణతఁదెల్పి ఫీవర్ల వైద్యుడన్ పేరుదెచ్చె
బీపీని తెలియ జెప్పెడి సాధనము నీకు రక్తపోటెఱిగెడి శక్తినిచ్చె
ఎక్సురే విరిగిన యెముకలు చూపింప బోన్సు స్పషలిష్టుగా పొగడబడితి
వంతె యిసుమంత యెఱుగవు సుంతయేని
అన్యులెవరును చదువంగ నలవికాని
లిపిని దివ్వౌషధముల పేర్లెల్ల వ్రాసి
వ్యాధి కుదిరింతు వయ్యయో వైద్యవిద్య

No comments: