Friday, April 29, 2016

దేవం భియా నద్రన యాభి వందే


దేవం భియా నద్రన యాభి వందే


సాహితీమిత్రులారా!

ఒక పద్యపాదంకాని, శ్లోకపాదంకాని ఎటునుంచి చదివినా
ఒకలాగే ఉంటే దాన్ని "పాదభ్రమకం" అంటారు.
"అలంకారశిరోభూషణే" లోని పాదభ్రమక ఉదాహరణ చూడండి.

లంకాథినాథ గ్రథనాధికాలం
సంసార భూతి శ్రితి భూరసాసం
రంగేవరానన్న నరావగేరం
దేవం భీయా నద్రన యాభి వందే

ఈ శ్లోకం ప్రతిపాదం ముందనుండి చదివినా వెనుకనుండి చదివినా
ఒకటిగానే ఉంటుంది
కాదు............  ఉంది మీరు గమనించి చూడండి.
(రావణుని విజృంభణాన్ని మించి కావయముడైనవాడు, సంసార సంపదా సక్తుడు కానివాడు, మిక్కిలి సమీపాన కావేరీ నదీ జలాలు ప్రవహిస్తున్న ప్రదేశాన నివాసమున్నవాడు అయిన శ్రీరంగనాథుని భయభక్తులతో మంచి వాక్కులతో స్తుతించి నమస్కరిస్తాను.)

ప్రతి పాదంలో 11 అక్షరాలు ఉన్నాయి.
మొదటి 5 అక్షరాలను 6 అక్షరం వదలి 7వ అక్షరం నుండి త్రిప్పిరాసిన
పాదభ్రమకం అయినది. అంటే  1,2,3,4,5,6,5,4,3,2,1 ఈ అంకెల్లా కూర్చితే
పాదభ్రమకం అవుతుంది.
పై శ్లోకాన్ని గమనించి చూడండి.

పాదభ్రమకం అక్షరాల నడకలో చిత్రం
కావున దీనికి గతిచిత్రం అని పేరు.

No comments: