Tuesday, July 6, 2021

ఐదక్షరాల పద్యం

 ఐదక్షరాల పద్యం




సాహితీమిత్రులారా!



ఇక్కడ మనం కేవలం 5 హల్లులతో కూర్చబడిన పద్యం
మన తెలుగు కవులు నంది మల్లయ- ఘంట సింగయ.
వీరే మన తెలుగులో మొదటి జంటకవులు వీరు వ్రాసిన
వరాహపురాణంలో కూర్చిన పద్యం చూడండి-


పంచాక్షరి-
నమశ్శివాయ పంచాక్షరీ సీసము
ఇందులో --శ--య - అనే
హల్లులను ఉపయోగించి కూర్చబడినది.

 నిమాయా నివే నో
                    మౌనిశ్యాయ శ్శివా
యానామాన నానా యన నవా
                    మ్నా యా శ్శివా
యోని యామినీ మేశ శశ్యంశు
                   న్ననాయ శ్శివా
వ్యోమానుయాయి మా యామావా
                   మాననాశాయ శ్శివా
ని విము ముని యమును విశ్వ
ను మ్మున నెమ్మినై నున్న నన్ను
నెమ్మమ్మున నమ్మిన నెమ్మినేను
నోము నీశా యిమ్మన్నదేమి నిన

                                                           (వరాహపురాణము - 10 - 56)

దీనిలో గీతపద్యం చివరిపాదంలో (దే) అన్నది తప్ప
మిగిలిన పద్యమంతా పంచాక్షరాలతోటే సాగింది.
మీరును గమనించండి.


No comments: