Sunday, July 4, 2021

తెలుగులో మూడు హల్లుల పద్యం

 తెలుగులో మూడు హల్లుల పద్యం




సాహితీమిత్రులారా!



మధురవాణీవిలాసమును రచించిన
చింతపల్లి వీరరాఘవయ్యగారు క్రీ.శ.1660
ప్రాంతంలో మహబూబునగర్ జిల్లా,
వట్టెం గ్రామంలో నివసించారు.
ఈ కావ్యం అయిదు ఆశ్వాసాలు గలది
దీనిలో మధురవాణీ కార్తవీర్యుల కథ కూర్చబడినది.
ద్వితీయాశ్వాసంలోని చిత్రకవిత్వంలోని
ఏకాక్షర , ద్వ్యక్షర,  త్య్రక్షర - పద్యాలున్నాయి
వాటిలో త్య్రక్షర కందం చూడండి-
ద,,- అనే మూడు హల్లులను
ఉపయోగించి కూర్చిన
కందపద్యం ఇది

దావవవవదా
నానావిద్వన్నవీ నిదానా
దీనానాదీదా
నానుదు నె నీదువాదు నావినోదా (2-14)





No comments: