Friday, October 21, 2016

సీమాసీ మానభూమి:


సీమాసీ మానభూమి:


సాహితీమిత్రులారా!

ఇక్కడ అవ్యపేత చతుష్పాద
ఆదిమధ్యాంత యమకం గురించి చూద్దాం.
శ్లోకం లేక పద్యంలోని నాలుగు పాదాలలో
మొదట్లో, మధ్యలో, చివర్లో మూడు చోట్ల
వ్యవధానంలేకుండా అర్థభేదంతో మళ్ళీమళ్ళీ
వచ్చే వర్ణసముదాయాన్ని
అవ్యపేత చతుష్పాద ఆదిమధ్యాంత యమకం అంటారు.
ఉదాహరణ -
సీమాసీ మానభూమి: ఫణిబలవలనోద్భావిరాజీ విరాజీ
హారీ హారీతవద్భి: పరిసరసరణావ స్తమాలై స్తమాలై:
దేవాదేవా ప్తరక్ష: కృతభవ భవతోగ్రేన దీనో నదీనో
ముక్తాముక్తాచ్ఛరత్న: సితరుచిరుచిరోల్లాసముద్ర: సముద్ర:
                                                                      (సరస్వతీకంఠాభరణమ్ - 2-98)
హద్దులయందు నిలిచేవాడు, గౌరవస్థానమైనవాడు,
పాముల సమూహాలు ప్రాకటం చేత ఏర్పడిన
చాలుచేత విరాజిల్లువాడు, హరీతములనే పక్షులచేత
పరిసరమార్గములందు విసరబడిన మాలా సన్నివివేశములు
గలిగిన తమాలవృక్షములచేత మనోహరమైనవాడు,
దేవతలకు రాక్షసులకు రక్షణను గలిగించినవాడు,
ముత్యాలుగాక మిగిలిన స్వచ్ఛ రత్నములను గలిగినవాడు,
చంద్రుని కాంతిచేత ఉల్లాసముద్ర కలవాడు అయిన సముద్రుడు
నదీపతి నీ యెదుట దీనుడుకాడు. -  అని భావం.

సీమాసీ మానభూమి: ఫణిబలవలనోద్భావిరాజీ విరాజీ
హారీ హారీతవద్భి: పరిసరసరణావ స్తమాలై స్తమాలై:
దేవాదేవా ప్తరక్ష: కృతభవ భవతోగ్రేన దీనో నదీనో
ముక్తాముక్తాచ్ఛరత్న: సితరుచిరుచిరోల్లాసముద్ర: సముద్ర:

ఈ శ్లోకంలో
1వ పాదంలో మొదట సీమా, మధ్యలో బల, చివరలో విరాజీ
2వ పాదంలో మొదట హారీ, మధ్యలో సర, చివరలో స్తమాలై
3వ పాదంలో మొదట దేవా, మధ్యలో భవ, చివరలో నదీనో
4వ పాదం మొదట ముక్తా, మధ్యలో రుచి, చివరలో సముద్ర:
అనే వర్ణసముదాయాలు ఆవృత్తమైనవి. మొదట, మధ్యన రెండ
అక్షరముల గుచ్ఛము రాగా చివరలో మూడక్షరముల గుచ్ఛము
ఆవృత్తమైనది. అలాగే చిత్రకావ్యాలలో - కును, - కును
భేదములేదు అన్నవిషయం గమనించాలి మొదటి పాదం మధ్యలో
బల అన్నది ఆవృత్తిలో వల అని ఆవృత్తమైనది ఇది ఇందులో సరైనదే.

No comments: