Saturday, September 24, 2016

శరణు! మహేశ! భూరితర........ (నాగబంధము)


శరణు! మహేశ! భూరితర........ (నాగబంధము)


సాహితీమిత్రులారా!

మన తెలుగులో నన్నెచోడుని కుమారసంభవములో
మొదటగా నాగబంధము కూర్చబడినది.
ఇది కుమారస్వామి జననం తరువాత ఇంద్రుడు
శివుని స్తుతించే సందర్భములో కవి నాగబంధాన్ని
చంపకమాలావృత్తంలో కూర్చాడు.
ఆ పద్యం చూడండి.

శరణు! మహేశ! భూరితర సార సుఖప్రద! కామ కాల సం
హర! భవరోగదారణ! సురాసుర వంద్య! శరీర దు:ఖ దు
స్తర కమలాపహార హిమధామ! సమస్తగ! సోమదేవ! వి
స్తరిత రమాదయారసయుతా యురులబ్దవిభావనామయా!
                                                           (కుమారసంభవము -10-84)
(మహేశ్వరా! మిక్కిలి అధికము శ్రేష్ఠమునైన సౌఖ్యమునిచ్చువాడా!
మన్మథుని యముని సంహరించినవాడా! సంసారమనెడి రోగమును
నశింపచేయువాడా దేవతలచేతను రాక్షసులచేతను నమస్కరింపబడువాడా!
శరీరదు:ఖములనెడు పద్మములను నశింపచేయు చంద్రుడా! అన్నిటిని బొందువాడా!
సోమదేవా! విస్తృతమైన సంపదతో, దయారసముతో కూడినవాడా! బాగుగా పొందబడిన
స్పష్టజ్ఞానముగలవాడా!  శరణు )
ఈ పద్యాన్ని ఈ క్రింద చూపిన బంధములో
తలనుండి తోకవరకు వరుసగా చదివిన
వస్తుంది. ఇది చంపకమాల కావున
ఇందులో పాదమునకు 21 అక్షరాలు
మొత్తం నాలుగుపాదాలకు 84 అక్షరాలుంటాయి.
ఇందులో 21 లేదా 20 స్థానాలలో ఉండే
అక్షరాలను రెండు మార్లు వచ్చేలా వ్రాయబడి ఉన్నది.
గమనించండి.

No comments: