Wednesday, February 1, 2023

ముక్కుమీద పద్యం

 ముక్కుమీద పద్యం 





సాహితీమిత్రులారా!


పారిజాతాపహరణం అనే కావ్యాన్నినందితిమ్మనరచించిశ్రీకృష్ణదేవరాయల

వారికి అంకిత మిచ్చినాడు. నందితిమ్మన ముక్కును గురించి ఒక

పద్యాన్ని   రచించినందుకు  ఆయనకు ముక్కుతిమ్మనఅనే వ్యవహారం కలిగిందని

 అంటారు.ముక్కును గురించిన ఆ పద్యాన్నితిమ్మనదగ్గర రామరాజభూషణుడు   కొంత 

 ద్రవ్యంఇచ్చి కొని తన వసుచరిత్రయందుఉపయోగించుకున్నా డంటారు.ఆ పద్యం---

నానాసూనవితానవాసనల నా-నందించు సారంగ మే

లా నన్నొల్లదటంచు గంధఫలి బ-ల్కాకం దపంబంది యో

షా నాసాకృతి దాల్చి సర్వసుమన-స్సౌరభ్య సంవాసియై

పూనెం బ్రేక్షణ మాలికా మధుకరీ - పుంజంబులిర్వంకలన్.

 పద్యం రామరాజభూషణకృతమే,ఐతే

కొన్ని అపప్రచారాలు ఇలా ప్రచారమౌ తుంటాయి.

అయితే----

ఈ పద్యానికిమూలమనదగినశ్లోకం పద్నాలుగవశతాబ్దంలోని 

అగస్త్యుని 'నలకీర్తికౌముది' అనే కావ్యంలో ఉంది.

ఆ శ్లోకం-----

      "భృంగా నవాప్తి ప్రతిపన్న భేదా

      కృత్వా వనే గంధఫలీ తపోలం,

      తన్నాసికాభః దనుభూత గంధా

     స్వపార్శ్వ నేత్రీ కృత భృంగ సేవ్యా"

             

వైద్యంవేంకటేశ్వరాచార్యులుగారి సౌజన్యంతో

No comments: