Monday, May 31, 2021

అనేకార్థక కావ్యాలు - ద్వ్యర్థి కావ్యాలు

 అనేకార్థక కావ్యాలు - ద్వ్యర్థి కావ్యాలు





సాహితీమిత్రులారా!



సంస్కృతంలో భట్టీకావ్యం అని ఒక వ్యాకరణ గ్రంథం ఉంది.
దానికే రావణవధ అనే పేరూ ఉంది. అంటే రావణవధ అనే కావ్యం
ఒక వైపు వ్యాకరణం తెలిపేదిగా మరో వైపు ఈ కావ్యాన్ని రచించాడు.
అలాగే ప్రాకృతంలో హేమచంద్రాచార్యుడు "కుమారపాలచరితం" అనే
కావ్యాన్ని రచించాడు ఇందులో కుమారపాలుని కథ
చేబుతూనే వ్యాకరణం చెప్పడం జరిగింది.
అందువల్ల ఇలాంటివాటిని ద్వ్యాశ్రయకావ్యాలు అంటారు.
వీటినే మనం తెలుగులో ద్వ్యర్థి కావ్యాలు అంటాము.
వీటికి రాఘవపాండవీయం,
హరిశ్చంద్రనలోపాఖ్యానం లాంటివి చెప్పవచ్చు.

ఇపుడు ప్రాకృతభాషలోని కుమారపాలచరితం
నుండి ఒక గాథ చూద్దాం.

దీనిలోని ఐదవసర్గలో వర్షాహేమంతశిశిర
ఋతువులను వర్ణించాడు ఆసందర్భంలో
కవి యుష్మచ్చబ్ద(మధ్యమపురుష) -
ఏకవచన బహువచనరూపాలను ఉపయోగించి
ఈ గాథను రాశాడు.

తం తుం తువం తుహ తుమం అణేహ నవాఇం నీవకుసుమాఇం,
భే తుబ్భే తుమ్ హోయ్ హే తుయ్ హే తుజ్ఝాసణందేహ


ఓ సఖులారా! నువ్వూ, నువ్వూ, నువ్వూ, నువ్వూ, నువ్వూ(తం తుం తువం
తుహ తుమం - ఈ ఐదు యుష్మచ్ఛబ్ద ప్రథమ ఏకవచనరూపాలు)
క్రొత్త నీపపుష్పాలు తీసుకొనిరండి.
సఖులారా మీరూ, మీరూ, మీరూ, మీరూ, మీరూ
(భే తుబ్భే తుమ్ హోయ్ హే తుయ్ హే తుజ్ఝ - అనే
ఐదు యుష్మచ్ఛబ్ద ప్రథమా బహువచనాలు) అసనపుష్పాలను
తీసుకొనిరండి - అని భావం

(నీపపుష్పము - కడిమి(కదంబ)చెట్టుపూలు,
అనసపుష్పాలు - వాడని పుష్పములు)





No comments: