Tuesday, May 29, 2018

ఆచార్య చింతామణి


ఆచార్య చింతామణి




సాహితీమిత్రులారా!

1600 - 85 మధ్యకాలంలో నివసించిన ఆచార్య చింతామణిగారు
ఢిల్లీ పాదుషా షాజహానుకు సమకాలికుడు. ఈయన హిందీ కవి,
ఆచార్యుడుగా ప్రసిద్ధుడు. ఇప్పటి కాన్పూర్(తికవాపూర్) నివాసి
అని తెలుస్తున్నది. ఈయన జీవిత విశేషాలు అంతగా తెలియరాలేదు.
ఇతడు ఆరు గ్రంథాలను రచించారు. అవి - పింగళ, కావ్యవివేకం,
కవికులకల్పతరు, కావ్యప్రకాశ, రసమంజరి, రామాయణం. వీటిలో
ఈయనకు విశేష కీర్తి తెచ్చినది కవికుల కల్పతరు. ఇందులో కావ్యశాస్త్ర
భాగాలు - కావ్య భేదాలు, కావ్య లక్షణం, గుణం, శబ్దాలంకారం, రీతి, దోషము,
శబ్దశక్తి, ధ్వని, రసము, నాయక నాయికా భేదాలు మొదలైన వాటిని గూర్చి
 8 ప్రకరణాల్లో వివరించారు. ఈ గ్రంథ నిర్మాణంలో
మమ్మటుడు, విశ్వనాథుడు,  ధనంజయుడు, అప్పయదీక్షితులు,
విద్యానాథుడు, భానుమిశ్రుడు మొదలైన వారి గ్రంథాలను ఆధారంగా
తీసుకున్నాడు. కవి ఈ గ్రంథంలోని లక్షణ భాగాన్ని పోరఠా
ఛందస్సులోనూ, ఉదాహరణ భాగాన్ని కవిత్త్, సవైయా ఛందస్సులలోనూ
 రచించారు. ఒకటి రెండు ప్రదేశాలలో గద్యాన్ని వాడాడు.
చింతామణి మొదటిసారిగా మమ్మటుడు, విశ్వనాథుల శైలిలో వివిధ కావ్యభాగాల
నిరూపణ కావించటం వలన ఇతనిని రీతికాలపు ప్రవర్తకుడు, ఆచార్యుడు అని భావిస్తారు.

పింగళ గ్రంథంలో ఛందశాస్త్ర వివరణ ఉంది.
వివిధ ఛందస్సుల లక్షణాలు, ఉదాహరణలు సరళమైన
వ్రజభాషలో వర్ణితాలు. కవిగా చింతామణి రస సిద్ధాంతవాది.
శృంగార రసచిత్రణలో సాఫల్యం లభించింది.
అక్బర్ షా అనే సామాన్య వ్యక్తి రచించిన శృంగారమంజరికి
హిందీలో ఛాయానుకరణం కూడా చింతామణి చేశారు.

No comments: