Thursday, May 24, 2018

చిదంబర సుమతి


చిదంబర సుమతి



సాహితీమిత్రులారా!




"చిదంబర సుమతి" అనే కవి విజయనగరరాజు
"వేంకటరాయల"(క్రీ.శ. 1586-1614) ఆస్థానంలో
ఆస్థానకవిగా ఉండినవారు. రెండు కథలను
జోడించి ఒక కథగా కూర్చడాన్ని ద్వ్యర్థికావ్యం
అంటారు. అలాగే మూడు కథలను జోడించి
చెప్పడాన్ని త్య్రర్థికావ్యం అంటారు.
ఈ చిదంబర కవిగారు సంస్కృతంలో
"రాఘవపాండవ యాదవీయం" అనే
త్య్రర్థికావ్యాన్ని కూర్చారు. దీనిలో
రామ, పాండవ, కృష్ణుల కథలను
మూడింటిని జోడించి కూర్చారు.
ఇది ఎంతటి క్లిష్టమైనదో చెప్పడానికి
వీలుకాదు. అలాంటి కావ్యంతోపాటు
ఈయన ఐదు కథల జోడింపుతో
మరో కావ్యం కూర్చారు. దాని పేరు
"పంచకల్యాణచంపువు". ఈ కవి తనకు
శ్లేషలో గల ప్రావీణ్యాన్ని, శబ్దాధికారాన్ని
ప్రకటించుకున్నారు. ఈ కావ్యంలో రామ,
కృష్ణ, శివ, విష్ణు, సుబ్రహ్మణ్యుల ఐదుగురి
వివాహాలు ఒకేసారి శ్లేష సహాయంతో వర్ణించబడినవి.
కానీ ఈ కావ్యంలోని విషయం వివాహ వర్ణన కావున
పంచార్థాలున్న శ్లోకాల అవసరం కవికి అంత ఎక్కువగా
కలగలేదని చెప్పవచ్చు. ఈ కావ్యంలో రెండు స్తబకాలున్నాయి.
అలాగే దీనికి ఆయనే స్వయంగా టీకా వ్రాశారు.
ఏది ఏమైనా ఆ మేథాశక్తికి జోహారు అనవలసిందే కదా!

No comments: