Friday, September 1, 2017

కువలయంబు నేలు గొప్ప రాజ


కువలయంబు నేలు గొప్ప రాజ




సాహితీమిత్రులారా!


పోకూరి కాశీపత్యవధానిగారి
సారంగధరీయము(త్య్రర్థికావ్యము) నుండి
ఈ పద్యం చూడండి-

కువలయంబు నేలు గొప్పరాజడఁగ లో
కంబు దెల్లవాఱు కరణి నాఁడు
కువలయంబు నేలు గొప్పరాజడఁగ లో
కంబు దెల్లవాఱెఁగా తలంప
                                              (సారంగధరీయము-3-67)

ఇందులో 1,3 పాదాలు ఒకలాగే ఉన్నాయి
అలాగే 2,4 పాదాలు దాదాపు ఒకలాగే ఉన్నాయి.
దాన్నే ద్విపాది అంటారు.

ఇక అర్థంలో కెళితే-
తలంపన్ - ఊహించగా,
కువలయంబు నేలు - భూమిని పాలించే,
గొప్పరాజడఁగన్ - అధికుడైన రాజు నశించగా,
లోకంబు తెల్లవాఱుకరణిన్ - ప్రజలు తెల్లబాఱు విధంగా,
నాఁడు - అప్పుడు,
కువలయంబు నేలు - కలువలను పోషించునట్టి,
గొప్పరాజడఁగన్ - అధికుడైన చంద్రుడు గ్రుంకగా,
లోకంబు - భువనము(ప్రపంచము)
తెల్లవాఱెఁగా - సూర్యోదయ సమయమాయెను కదా

No comments: