Thursday, March 17, 2022

పెదిమలు తగలని నాలుక మాత్రమే కదిలే పద్యం

 పెదిమలు తగలని నాలుక మాత్రమే 

కదిలే పద్యం




సాహితీమిత్రులారా!



పలికేప్పుడు పెదిమలు తగలని అక్షరాలతో

నాలుక మాత్రమే కదిలే పద్యం దీన్ని

నిరోష్ఠ్యాచలజ్జిహ్వము అంటాము. ఇక్కడ

ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములోని 832వ

పద్యాన్ని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు గమనించండి-


సగ్విణి వృత్తంలో కూర్చబడినది-

ఇది 832వ దండకంలో గర్భితమైన పద్యం

అంటే విడిగా ఈ పద్యం కనిపించదు మనం

ఇక్కడ విడిగా వ్రాసుకుంటున్నాం గమనించగలరు


నారదారాధనా నారతాహ్లాదితా

నీరదాశీల సన్నీల తేజః శ్రితా

సార దైత్యచ్ఛిదా చండ చక్రాంచితా

శ్రీ రసాలంకృతా శేషశైలస్థితా


గమనించండి దీనిలో ప,ఫ,బ,భ,మ - లు లేవు

పలికితే నాలుక మాత్రమే కదులుతుంది


2 comments:

శేషాచారి కొమాండూరి said...

ఇది చదువుతున్నప్పుడు నాకు స్వర్గీయ సుష్మా స్వరాజ్ సంస్కృతం గురించి ఇచ్చిన ఒక ప్రసంగం గుర్తుకువచ్చింది. దాని లింకు ఇచ్చాను. 6 నిమిషాల 30 సెకండ్ల వద్ద ఆ భాగము వుంది.


https://youtu.be/LuoJ2SK0m9g

ఏ.వి.రమణరాజు said...

కొమాండూరి శేషాచారిగారికి
ధన్యవాదాలు
మీరు చిత్రకవితా ప్రపంచం బ్లాగును ఫాలో అవుతూ ఉండండి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు