Wednesday, June 3, 2020

ప్రతి పాదానికి ఒక హల్లు వచ్చే పద్యం

ప్రతి పాదానికి ఒక హల్లు వచ్చే పద్యం




సాహితీమిత్రులారా!

ఒక పాదానికి ఒక హల్లు మాత్రమే ఉపయోగిస్తూ నాలుగుపాదాలకు
నాలుగు వేరువేరు హల్లులను వాడటాన్ని ఏకాక్షర పాదం లేక
ఏకవ్యంజనపాదం అంటారు.

భారవి కిరాతార్జునీయంలో రాసిన
ఏకాక్షరపాద శ్లోకం గమనిద్దాం.

శ్లో. స సాసి: సాసుసూ: సాసో
     యేయాయేయాయయాయయ:
     లలౌలీలాం లలో2లోల:
     శశీశశిశుశీ: శశన్
                                          (కిరాతార్జునీయమ్ -15-5)
అర్థం :- సాసి: = ఖడ్గంతో ఉన్న, సాసుసూ: = ప్రాణాలను హరించే బాణాలు థరించినవాడు,సాస: = ధనువును థరించినవాడు, యేయ + అయేయ + అయయ + అయయ - వాహనంతోను, వాహనంలేకుండా శత్రువుని చేరి వారి వాహనాలను స్వాథీనం చేసుకున్నవాడు, లల: = అందమైనవాడు, అలోల: = చాపల్యంలేనివాడు, శశి +ఈశ + శశు + శీ: - ఈశ్వరుని కుమారుడైన కుమారస్వామిని పరుగెత్తింపచేసే, స: = అర్జునుడు, లీలాం = శోభను, లలౌ = పొందాడు.

Monday, June 1, 2020

త,థ,ద,ధ,న - లతో పద్యం


త,థ,ద,ధ,న - లతో పద్యం




సాహితీమిత్రులారా!

కేవలం తవర్గంలోని త,థ,ద,, - అనే 5 అక్షరాలతో
మాత్రమే కూర్చబడ్డ పద్యం తవర్గ పద్యం.
ఇది ‌హరవిజయంలోనిది.

తథా దధా 2నో తనుతాం నిధీనాం ధూతాననో 2 నూనధునీ ననాదః
తేనైధితానాం నిధనం తదానీం నూనం న తేనే న ధనాధినా ధః

గమనించండి ఇందులో త,థ,ద,ధ,న -లు తప్ప వేరేమైనా ఉన్నాయేమో?

Friday, May 29, 2020

వచ్చిన హల్లు మళ్ళీ రాని పద్యం


వచ్చిన హల్లు మళ్ళీ రాని పద్యం





సాహితీమిత్రులారా!

ఒక పద్యం లేక శ్లోకం వచ్చిన హల్లు మళ్ళీరాకుండా(అపునరుక్తం) రాయడమే
వచ్చిన హల్లు మళ్ళీ రాని పద్యం(అపునరుక్తవ్యంజనము) అంటారు.

ఈ శ్లోకం చూడండి వచ్చిన హల్లు మళ్ళీ వచ్చిందేమో.

హతోచ్చండో ఢాఘ ఝాటావేల్లిదోషా మిళచ్ఛఠం
ఫణిశయ్యం రఙ్గనాథం భజే బుధ సుఖావకమ్

                                                     (అలంకారశిరోభూషణే శబ్దాలంకారప్రకరణం-20)

(క్రూరపాపులు అయిన రాక్షసులను హతమార్చిన వానిని,
నాగేంద్రునిపానుపుగా కలిగిన వానిని,
దేవతలకు జ్ఞానులకు సుఖములను కూర్చువానిని
శ్రీరంగనాథుని సేవిస్తాను.)

Tuesday, May 26, 2020

'ఉ'-కార పద్యం(కొమ్ముల పద్యం)


'ఉ'-కార పద్యం(కొమ్ముల పద్యం)




సాహితీమిత్రులారా!


హ్రస్వమైన ఒకేఒక స్వరాన్ని ఉపయోగించి పద్యం
కూర్చటాన్ని హ్రస్వ ఏక స్వరచిత్రం అంటారు.
ఇందులో స్వరం ఒకటే ఉంటుంది కాని వ్యంజనాలు
ఏవైనా ఉండవచ్చు.
ఇక్కడ స్వరం యొక్క దీర్ఘ, హ్రస్వములేకాని
గురు లఘువులతో సంబంధంలేదు.


ఉరుగుం ద్యుగురుం యుత్సు చుక్రుశు స్తుష్టువు: పురు
లులుభు: పుపుర్షుర్ముత్సు ముముహుర్ను ముహుర్ముహు:
                                                                                 (సరస్వతీకంఠాభరణము - 2 - 276)

(విలువైన వాక్కులు గల దేవతా గురువైన బృహస్పతిని
యుద్ధములందు భటులు శరణు కోరిరి మిక్కిలి స్తుతించిరి
మోదములందు లోభమును పొందిరి పుష్టినొందిరి
మరి మాటి మాటికిని మోహము నొందిరి.)

ఇందులో హ్రస్వ "ఉ" - కారమును ఒక్కదానినే
మొదటినుండి చివరవరకు ఉపయోగించారు.
ఒకే స్వరము అదియు హ్రస్వము ఉపయోగించుట
వలన ఇది హ్రస్వ ఏక స్వరచిత్రమగుచున్నది.

Saturday, May 23, 2020

దవడలు తాకని పద్యం


దవడలు తాకని పద్యం





సాహితీమిత్రులారా!

అక్షరముల ఉత్పత్తి స్థానమును బట్టి
కంఠము, తాలువు, మూర్దము, దంతము, ఓష్ఠ్యము అని ఐదు
విధములని తెలుసుకొని ఉన్నాము.
వీటిలో కేవలము కంఠస్థానమున పుట్టెడి అక్షరములతో
పద్యం కూర్చిన అది కంఠ్యము అని,
ఒకవేళ కంఠస్థానమున ఉత్పత్తి అయ్యే అక్షరములను వదలి
మిగిలిన వాటితో పద్యం కూర్చిన కంఠ్యములు లేనిది
నిష్కంఠ్యము అని పిలువబడుచున్నది.
అలాగే తాలువులతో కూర్చిన తాల్యము అని,
తాలువులతో కాక మిగిలిన వాటితో కూర్చిన నిస్తాలవ్యమని అందురు.
మరి, తాలువు = దవుడ, దవుడ నుండి పుట్టేవాటిని తాలువులు అంటారు.
తాలువులయందు పుట్టు అక్షరములు - ఇ-వర్ణము(స్వరము),
చ- వర్గము(చ,ఛ,జ,ఝ,ఞ), య-కారము, శ-కారము ఇవి తాలవ్యములు.
ఇవి లేకుండా పద్యం లేక శ్లోకం కూర్చిన అది నిస్తాలవ్యము.

ఉదాహరణ గమనిద్దాం-
స్ఫురత్కుండల రత్నౌఘ మఘవద్ధను కర్బుర:
మేఘనాదో2థ సంగ్రామే ప్రావృట్కాలవదాబభౌ
                                                                          (సరస్వతీకంఠాభరణము -2-268)

(ప్రకాశించుచున్న కర్ణభూషణరత్న సమూహమనెడి
హరివిల్లుచేత పొడలుగలిగినవాడై సంగ్రామమునందు మేఘనాధుడు(ఇంద్రజిత్తు) ప్రావృట్కాలము వలె ప్రకాశించెను.)
(ప్రావృట్టు = వర్షర్తువు)

ఈ శ్లోకంలో పై చెప్పిన అక్షరాలు ఉన్నాయేమో? గమనించండి.
ఉంటే భోజమహారాజును నిలదీద్దాం.
ఆ అక్షరాలు మరొక్కసారి చూస్తారా- ఇవే
ఇ-వర్ణము(స్వరము), చ- వర్గము(చ,ఛ,జ,ఝ,ఞ), య-కారము, శ-కారము. 

Wednesday, May 20, 2020

ఉపమా గొప్పదనం


ఉపమా గొప్పదనం





సాహితీమిత్రులారా!

సాహితీలోకంలో ఉపమాలంకారం తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు.
దీని వైశిష్ట్యాన్ని తెలిపే శ్లోకం ఇది ఆస్వాదించండి.

విదుషాంప్రమదాయ సోపసర్గా
గరుదాంకస్యముదే గతోపసర్గా
అపకారవతీ ప్రియాయ శంభో:
ఉపమా సాప్రతి భాత్యనేకరూపా

అలంకారాల్లో ఉపమాలంకారాన్ని మించినది మరొకటి లేదు. ఎందుకంటారా !................
"ఉప" సర్గతో కూడి ఉన్నది ఉన్నట్లు ఉంటే, విద్వాంసులకు ఆహ్లాదం కలిగిస్తుంది.
(కవులకు ఉపమా ఎంతో ఇష్టంకదా!)
ఉపసర్గ లేకుండా అయితే (మా - లక్ష్మిదేవి) సాక్షాత్తు విష్ణువునే అలరిస్తుంది.
ఇక మధ్యలోని "ప"కారం లేకపోతే (ఉమా - పార్వతీదేవి)
పరమశివునే పరవశింప చేస్తుంది.
ఈ విధంగా ఉపమ అనేక రూపాల్లో (శబ్దపరమైన రూపాల్లో)
ప్రకాశిస్తూ ఎందరో ప్రముఖుల్ని రంజింప చేస్తున్నది.

Monday, May 18, 2020

కవిచమత్కారం


కవిచమత్కారం






సాహితీమిత్రులారా!

కృష్ణదేవరాయల వాకిటిని కాపలాకాయు
 తిమ్మనికి రాజుగారు ఎప్పుడో మంచి
సేవలకుగాను ఒక సేలువా ఇచ్చాడట.
దాన్ని కప్పుకొని తిరుతున్న సమయంలో
దాన్ని తెనాలి కామకృష్ణుడు చూచాడట.
ఎలాగైనా దాన్ని కాజేయాలని ఎదురు చూస్తున్నాడు.
ఒకరోజు అతనికి ఒక పద్యమైనా కృతి తీసుకోమని సలహా ఇచ్చాడు.
అది ఊరకే ఇవ్వరుకదా అని అనగా
పద్యంలో నాలుగు పాదాలు నలుగురిని అడుగు
అప్పుడు ఎవరికి ఏమీ ఇవ్వకుండా
సరిపోతుందని ఉపాయం చెప్పాడు.
అది సరైనదేనని మరునాడు సభలోకి
వెళ్ళే కవులను తనకోరిక చెప్పి
పెద్దనను మొదట అడిగాడు దానికి
ఆయన ఒక చరణం చెప్పాడు
తరువాత భట్టుమూర్తి రెండవ చరణం చెప్పాడు,
మూడవ చరణం తిమ్మన చెప్పాడు
నాలుగవచరణం తెనాలిరామకృష్ణుడు చెప్పాడు
ఆచరణంతో చివరకు ఆ శాలువా మారుపలక్కుండా ఇచ్చాడట.
ఆ పద్యం-


పెద్దన -               వాకిటికావలితిమ్మా!
భట్టుమూర్తి-        ప్రాకటమగు సుకవివరుల పాలిటి సొమ్మా!
తిమ్మన -             నీకిదె పద్యము కొమ్మా!
రామకృష్ణుడు -    నా కీ పచ్చడమె చాలు నయమున నిమ్మా!

ఈ పద్యం నలుగురు చెప్పినా
అంత్యనుప్రాసలో చెప్పడం గమనార్హం.