Sunday, February 6, 2022

నరహరి శతకం

 నరహరి శతకం



సాహితీమిత్రులారా!

మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట తాలూకాలోని మామిళ్ళపల్లిలో

ఉన్న నృసింహస్వామి ఆలయం ఎంతో పురాతనమైంది.

ఇక్కడున్న నృసింహస్వామిని స్తుతిస్తూ విద్యాశాఖలో వివిధ 

పదవులు నిర్వహించిన మొలగర రంగారావుగారు నరసింహ శతకం

1991లో రచించారు. తెలుగులో శతకమంతా ఒకేప్రాసగల

శతకాలు చాలానే వున్నాయి. కాని పేరును(నామ)ప్రాసగా

శతకం కూర్చారు రంగారావుగారు. మొదటి పద్యంలో నకార ప్రాసం,

రెండవ పద్యంలో ర(రేఫము) కార ప్రాసం, మూడవ పద్యంలో

హ కార ప్రాసం, నాలుగవ పద్యంలో ఇత్వరేఫము(రి) ప్రాసంగా

కూర్చారు. అంటే ఒకసారి నరహరి అని పూర్తికావటానికి 4 పద్యాలు

కావాలి. అలా 108 పద్యాలకు నరహరి నామం 27 మార్లు ఆవృత్తమౌతుంది. 

ఇలాంటి శతకాలు చాల తక్కువగా ఉన్నాయి.

ఇలాంటి శతకం భువనగిరి విజయరామయ్యగారు కూర్చినట్లు

చూచిఉన్నాను. ఇంకా కొందరు కూర్చి ఉండవచ్చు.

ఇక్కడ మానవ సహజనైజాన్ని తెలిపే 83వ పద్యం చూద్దాం-


మోహ విలగ్న చిత్తగతి మూర్ఖుడు గూలు నిరంతరాఘ సం

దోహ మహాహ్రదంబున ననూహ్యగతిన్ దనమేలుకైన య

య్యీ హ లొకింత గైకొనడికే విధి? నిన్ మది నూను? దుష్ట దం

భాహత బుద్ధియై నకట, మామిళపల్లి నృసింహ! యో! ప్రభూ!


No comments: