Saturday, February 29, 2020

కృష్ణగాథ లేక కృష్ణప్పాట్టు


కృష్ణగాథ లేక కృష్ణప్పాట్టు




సాహితీమిత్రులారా!

మలయాళంలో 15వశతాబ్దానికి చెందిన
చెరుస్సెరి నంబూదిరి మణిప్రవాళ శైలి
ప్రచారంలో ఉన్నప్పటికి ఒక ప్రత్యేక పంథాలో
కృష్ణగాథ(కృష్ణప్పాటు) కావ్యాన్ని రచించారు.

కృష్ణగాథ భాగవతాన్నుసరించి రచించిన కావ్యం.
ఇందులో వస్తువు, భాష, శైలి విషయాలలో,
కవి నవ్యమార్గాన్ని అనుసరించారు.
కవి మణిప్రవాళ శైలిలోకాని, కథావస్తువును బట్టి
సంస్కృత బాహుళ్యం గల శైలినిగాని అనుసరించక
వాడుక భాషను ప్రయోగించి తన కావ్యం జనసామాన్యులు
అలరారే విధంగా కూర్చాడు. సంస్కృతంలో
మహాపండితుడైన చెరుస్సెరి నంబూదిరి బ్రాహ్మణుడు
కావడం చేత, ఆర్య సంస్కృతి సంప్రదాయాల మధ్య
పెరిగినప్పటికి ముందుగా తాను మలయాళీననే విషయాన్ని
తన కావ్యంలో నిరూపించాడు. ఈ కావ్యాన్ని తన ప్రభువైన
కొలాత్తునాడు పాలకుడైన ఉదయవర్మ కోరికపై వ్రాసినట్లు చెప్పికొన్నాడు.

కృష్ణగాథ కృష్ణప్పాట్టు అనే పేర ప్పాట్టు సంప్రదాయానికి
చెందినప్పటికి విస్తృతమైన పరిధిలో కావ్యం వలె సాగిన రచన.
సులభశైలి, వ్యవహారిక పదబాహుళ్యం, లయాత్మకమైన
గేయమాధుర్యం ముఖ్యంగా కావ్యవస్తువులోని భక్తిప్రాచుర్యం
కృష్ణగాథను అత్యుత్తమ జనరంజక కావ్యంగా నిలిపాయి.
కేరళ పండితకవులలో బహుళ ప్రచారం పొందిన కవిగా,
చెరుస్సెరి నంబూదిరిని పేర్కొంటారు.


ఈ కవి మరో రచన భారతగాథ ఉదయవర్మ కాలంలోనే,
ఆ ప్రభువు ఆశ్రయంలోనే వెలువడింది. అయితే
రచనావిధానం, శైలి కొంత వాసితక్కువగా ఉండటంచేత
చెరుస్సెరి కృతంగా ప్రచారం చేసి ఉండవచ్చని
కావ్య పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

No comments: