Monday, February 5, 2018

గణిత ప్రశ్న(ప్రహేలిక)


గణిత ప్రశ్న(ప్రహేలిక)




సాహితీమిత్రులారా!



ఈ గణిత ప్రశ్నను చదివి సమాధానం చెప్పండి-

ఐదవపాలు దేవునకు, నందుల నాల్గవపాలు పత్నికిన్,
మోదము మీర శేషమున మూడవభాగము పట్టికిచ్చి, మ
ర్యాదగ నర్థమున్ హితున కంపి భుజించెను మూడు పండ్లు, తా
నాదిని నెన్ని పండ్లుకొనె, నాయజమానుడు, మాకు జెప్పుడీ

ఇందులో యజమాని మొదట ఎన్ని?
పండ్లుకొన్నాడో చెప్పమంటున్నాడు.
అందులో మూడు పండ్లుమాత్రమే
యజమాని తిన్నాడు మిగిలిన వన్నీ
పంచాడు. అందువల్ల యజమాని
మొదట కొన్నది 15 పండ్లు అనుకుంటే
దేవునికిచ్చినది = 15/5 = 3
మిగిలినవి  = 15 -3 = 12
భార్యకిచ్చినది = 12/4 = 3
మిగిలినవి = 12-3 = 9
సంతానానికిచ్చినది = 9/3 =3
మిగిలినవి = 9-3=6
మిత్రునకిచ్చినది = 6/2 = 3
మిదిలినవి = 6-3=3
మిగిలినవి = 3
ఆ మూడు యజమాని తిన్నాడు
సరిపోయిందికదా అందువల్ల
యజమాని మొదట కొన్నది = 15 పండ్లు.

No comments: