Sunday, January 7, 2018

షోడశముఖీ కందము


షోడశముఖీ కందము




సాహితీమిత్రులారా!

ఒక పద్యంలో ఉన్న ఛందస్సులో
మరోరకం ఛందస్సును లేదా అదే రకానికి
చెందిన అనే పద్యాలు రావటాని వీలుగా
కూర్చబడిన ఛందోచిత్రాలు
వీటినే గర్భకవిత్వమని
గూఢకవిత్వమని అంటాము.
ఇక్కడ ఒక కందపద్యం ఛందస్సులోనే
16 కందపద్యాలు వచ్చేలా కూర్చిన
దాన్ని "షోడశముఖీ కందం" పేరున
తెలుసుకుంటున్నాము.
నాదెళ్ళ పురుషోత్తమకవి రచించిన
అద్భుతోత్తర రామాయణంలోనిది
సప్తమాశ్వాసంలోని 149వ పద్యం-

ధరజవు తరుచవు తఱుటను
దఱుగను దఱిగొన దఱికను తఱుగను దరుగన్
ధరజను దరిగొన దరమును
దరమును దఱుమను దఱియను దఱలును ద్వరగన్

దీనిలో ప్రతిగణం ఒక పద్య మొదలౌతుంది.
ఇందులో 16 గణాలున్నాయి. 16 కందపద్యాలు
అవుతున్నాయి.  గమనించండి.

1ధరజవు 2తరుచవు 3తఱుటను
4దఱుగను 5దఱిగొన 6దఱికను 7తఱుగను 8దరుగన్
9ధరజను 10దరిగొన 11దరమును
12దరమును 13దఱుమను 14దఱియను 15దఱలును 16ద్వరగన్

ప్రతి గణం రెండవ
అక్షరం ప్రాస అవుతూ ఉంటుంది. కాబట్టి
ర - అనే అక్షరం ప్రాస అవుతున్నది.

No comments: