Wednesday, January 8, 2020

బృహత్కథను పైశాచిక భాషలో ఎందుకు వ్రాశారు?


బృహత్కథను పైశాచిక భాషలో ఎందుకు వ్రాశారు?




సాహితీమిత్రులారా!

కథాకావ్యాల్లో ప్రసిద్ధమైన బుద్ధస్వామి కృత బృహత్కథాశ్లోక సంగ్రహం, క్షేమేంద్రుడు వ్రాసిన బృహత్కథామంజరి, సోమదేవుడు వ్రాసిన కథాసరిత్సాగరం ఈ మూడింటికి మూలం బృహత్కథ పైశాచిక భాషలో వ్రాయబడింది.
అది ఎందుకు వ్రాయబడిందో దానికి ఒక కథ ప్రచారంలోవుంది.
ఆ కథ..............

శాతవాహనరాజు ఆస్థానంలో గుణాఢ్యుడు ఆస్థానకవి. రాజుగారు ఒకరోజు
రాణితో జలవిహారం చేస్తున్న సమయంలో రాజుగారు రాణిపై నీరు చల్లడం మొదలు పెట్టాడు అప్పుడు రాణి విసుగ్గా మోదకైస్తాడయ(నీళ్లతో నన్ను కొట్టకు)అంది. దానికి పొరపాటుగా అర్థం చేసురున్న రాజు మోదకాల(లడ్డుల)ను తెప్పించి రాణిమీద విసరడం ప్రారంభించాడు. దానికి రాణి పరిహాసం చేసింది. దానితో రాజు అవమానం చెంది ఎలాగైనా అతిత్వరలో సంస్కృతం నేర్చుకోవానుకున్నాడు. ఆస్థాన పండితులను పిలిపించి తన కోరిక తెలిపాడు దానికి గుణాఢ్యుడు కనీసం 6 సంవత్సరాలైనా పడుతుందన్నాడు. దానికి కామందవ్యాకరణకర్త అయిన శర్వవర్మ తాను 6 నెలల్లో నేర్పుతానన్నాడు. దానికి గుణాఢ్యుడు అలా నేర్పగలిగితే తాను సంస్కృత ప్రాకృత దేశభాషలను త్యజిస్తానని శపథం పట్టాడు.

శర్వవర్మ రాజుకు 6 నెలల్లో సంస్కృతం నేర్పాడు. దానితో 
గుణాఢ్యుడు శపథం ప్రకారం సంస్కృత, ప్రాకృత విడిచివేసి
రాజుగారి ఆస్థానం కూడా వదలి వెళ్లాడు. ఆ తరువాత 
పైశాచిక భాషలో బృహత్కథను వ్రాశాడు. 
ఇదీ బృహత్కథ పైశాచిక భాషలో వ్రాయడానికి గల కారణం.

No comments: