Friday, January 17, 2020

''ఈ జగత్తంతా బాణుని ఉచ్ఛిష్టమా?''


''ఈ జగత్తంతా బాణుని ఉచ్ఛిష్టమా?''



సాహితీమిత్రులారా!

సంస్కృతంలో కాదంబరి అనే ఒక కథాకావ్యాన్ని బాణుడు రచించాడు.
అది ఎంతటి కావ్యంమంటే కాదంబరీ ప్రబంధం చదివి
ఆస్వాదత రుచిచూచిన తరువాత వారికి ఎంతటి ఆస్వాద్యమైన
ఆహారంకూడా రుచించదట. అందుకే కాదంబరీ రసజ్ఞానాం,
ఆహారోపి నరోచతే - అనే నానుటి వచ్చింది.
ఈ కాదంబరీ ఇతివృత్తం ప్రేమకథాకలితం.
దీనిలో కాదంబరీచంద్రాపీడుల ప్రణయం,
మహాశ్వేతా పుండరీకుల ప్రణయవృత్తాంతం అద్భుతంగా వర్ణించబడ్డాయి.
దీనిలో చంద్ర, గంధర్వ, మానవ లోకాలకు సంబంధించిన పాత్రలతో,
సంఘటనలతో విస్మయావహంగా ఈ కావ్యం సాగుతుంది.
దీనిలోని రచన, శైలి, అలంకార నిర్వహణ అపూర్వమైనవి.
ఇందులో చిత్రమేమంటే కథారచన పూర్తికాకమునుపే
బాణుడు మరణించాడు ఆ మిగిలిన భాగాన్ని అతని కుమారుడు
భూషణభట్టు పూరించాడు. బాణుని కుమారుడు తండ్రిగారి శైలిలోనే కావ్యం
పూర్తి చేయడం వల్ల ఎక్కడా అతుకు పడిన విధంగా అనిపించదు.

సరే అసలు విషయం మరిచాంకదా లేదు లేదు
ఇంతకీ అసలు కథ ఏంటంటే మన బాణుడు సాహిత్య చరిత్రలో
ప్రకటించిన భావాన్నిదేన్నీ మరి ఎవరూ ప్రకటించి ఉండలేదు.
తరువాత వచ్చిన రచనలన్నీ బాణుని ఉచ్ఛిష్టంగా చేబుతారు
అదే ''బాణోచ్ఛిష్టం జగత్సర్వం''
అనే నానుడికి సంబంధించిన విషయం.



No comments: