Sunday, August 20, 2017

కవిని పట్టిచ్చిన చక్రబంధం


కవిని పట్టిచ్చిన చక్రబంధం 




సాహితీమిత్రులారా!

తెలుగులో బిల్హణీయం అనే కావ్యాన్ని
పిండిపెద్ది కృష్ణస్వామి రచనగా ముద్రింపబడి
ప్రచారంలో ఉంది. దీన్ని పిండిపెద్ది కృష్ణస్వామి
గారు వ్రాయలేదని పరిశోధకులు తేల్చారు.
దీని వెనుక కథ-
దీని అవతారికలో చిత్రకవి సింగనార్యుని కుమారుడు
నారసింహకవి వచ్చి మెచ్చి కృష్ణస్వామిని బిల్హణకృతి
రచించటానికి ప్రోత్సబించినట్లు చెప్పబడి ఉన్నది.
అదే కృతి ప్రథమాశ్వాసాంతంలో ఒక చక్రబంధం
కూర్చబడింది. చక్రబంధంలో మూడవ వలయంలో
కవిపేరు,ఆరవ వలయంలో గ్రంథము పేరు,
లేదా కృతిపతిపేరు రావాలి. ఈ గ్రంథంలో
3వ వలయంలో సింరార్యకవి - అనే పేరు
కవిపేరుగా కూర్చబడింది. దీని బట్టి
సింగరార్య కుమారునికి కృష్ణస్వామి ద్రవ్యమిచ్చి
తను వ్రాసివిధంగా మార్చి ఉంటాడని తెలుస్తున్నది.
అంటే కవిని చక్రబంధం పట్టిచ్చినది తెలుస్తుంది.
ఆ చక్రంబంధ పద్యం-

ధన్యాసింహభచంద్రకీర్తివరవిద్యాపండితార్యక్రమా
గణ్యార్విధనంజయాశిపదముక్తాకృత్స్రగంప్రభా
జన్యారాజితభూరిశాత్రవకుభృజ్జాతిప్రభావిక్రమా
మాన్యారాధనత్యాగభోగజయధామానవ్యభాగోత్తమా

సింగరాచార్యుడు తన మరోకృతి అయిన
రాఘవవాసుదేవీద్వర్థికావ్యంలో
బిల్హణీయం కూర్చినట్లు చెప్పియుండటం
వలన ఇది సింగరాచార్యుడే వ్రాసినదని
రూఢియైనది.

No comments: