Tuesday, May 17, 2016

తప్పు చేసిన వారినే పట్టుకొనవలెను


తప్పు చేసిన వారినే పట్టుకొనవలెను


సాహితీమిత్రులారా!

ఈ శ్లోకం చూడండి గోపిక - గోపాలుని మధ్య జరిగినది.
ఇందులో ధ్వని గమనించండి.

యుక్తం కిం చవ శర్వరీశముఖ! మద్వేణీ సమాకర్షణం
వీథ్యాం? త్వత్కుచ మండలం మమకథ గృహ్ణాతి చేతో జవాత్?
వ్యత్యస్తం క్రియతేత్వయా జహిజహి స్వామిన్! వచస్సాధుతే?
ఆగోయ: కురుతే స ఏవభవతా దండస్య యోగ్య: ఖలు!

గోపిక - చంద్రముఖా! నడివీథిలో నా జడ పట్టుకొనుట తగునా?
గోపాలుడు- నీ కుచములు నా మనస్సును హటాత్తుగా ఏల హరించినవి?
గోపిక- కృష్ణా! నీవు తారుమారుగా చేయుచున్నావు! చాలుచాలు విడువిడు! 
           ఏమి మాటయిది? తప్పుచేసినవారినే పట్టుకొనవలెను కాని ఇది యేమి?

(అంటే
మనస్సు హరించి తప్పు చేసినవి కుచములు
వాటిని వదలి జడను పట్టుకొంటావా?
కావాలంటే కుచాలనే పట్టుకోవలెనుకదా! -
అని ధ్వని.)

No comments: