Friday, April 3, 2020

కావ్యం కరోమి............


కావ్యం కరోమి............




సాహితీమిత్రులారా!

భోజరాజు గొప్ప కవితాప్రియుడు.
తన రాజ్యంలో ప్రతిఒక్కరు కవిత్వం అల్లగలిగి ఉండాలి.
కవితాశక్తి లేనివారిని దేశంనుండి తరిమివేయండని భటులకు ఆజ్ఞాపించాడు.
వారు వెదికి వెదికి ఒక సాలెవానిని పట్టుకొని రాజు ఎదుట పెట్టారు.
"కవిత్వం చెప్పగలవా?" అని భోజుడు ప్రశ్నించాడు.
ఆ సాలెవాడు భోజునివంక చూచాడు.
(భోజుని ముఖం చూడగానే ప్రతి వ్యక్తికి కవిత్వం హృదయం నుండి
తన్నుకొని వస్తుందంటారు అదే విధంగా)
వెంటనే
ఆ సాలెవాడు
ఈ క్రింది విధంగా సమాధానం చెప్పాడు -


కావ్యం కరోమి నహి చాతురం కరోమి
యత్నాత్ కరోమి యది చాతురం కరోమి
భూపాలమౌళి మణిరంజిత పాదపీఠ
హో సాహసాంక కవయామి - వయామి - యామి


కావ్యం వ్రాయగలను,
కాని అందంగా రచింపలేను.
ప్రయత్నిస్తే వ్రాయగలను.
రాజులు మణి కిరీట కాంతులతో ప్రకాశించు
పాదపీఠముగల చక్రవర్తీ!
కవయామి(కవనమల్లగలను) -
వయామి(నేతనేయగలను) -
యామి(వెళ్ళుచున్నాను) -
అని భావం.

No comments: