Monday, October 31, 2016

శ్రీరంగేరం నిరంతరే స్థితమతినుత


శ్రీరంగేరం నిరంతరే స్థితమతినుత



సాహితీమిత్రులారా!

చిత్రకవిత్వంలో బంధకవిత్వం
లేదా ఆకారచిత్రం ఒక భాగం.
ఇందులో గోమూత్రికా బంధమును,
అష్టదళ పుష్పబంధమును, నాగబంధమును
తెలిసికొని ఉన్నాము.
ఇపుడు పుష్పమాలికాబంధమును గురించి
తెలుసుకుందాము.

ఇందులో అనేకరకములు ఉన్నాయి.
సంస్కృతభాషలో ఎక్కువగా పుష్పమాలికా
బంధాలను స్రగ్ధరావృత్తంలో చేశారు.
తెలుగులో చంపకమాలావృత్తంలో చేశారు.
దీనిలో ఒక్కొక్కపాదానికి 21 అక్షరాలు,
మొత్తం 84 అక్షరాలుంటాయి.
పుష్పమాలలోని ప్రతి పువ్వులో 7 అక్షరాలుంటాయి.
అందులో మనకు 5 అక్షరాలే కనిపిస్తాయి
దానికి కారణం ఒక అక్షరం మూడు పర్యాయాలు వస్తుంది.
ఇలా పువ్వుకు 7 అక్షరాల చొప్పున
84 అక్షరాలకు 12 పువ్వులు ఉంటాయి.
దీనిలో ఆవృత్తమయే అక్షరాలుపోగా మనకు
పుష్పమాలికలో 60 అక్షరాలు కనబడతాయి.

ఈ క్రింది శ్లోకం చూడండి-

శ్రీరంగేరం నిరంతే స్థితమతినుత రస్థేమ భూమక్షర్థిం
శ్రీవామావాసవాస్తూర సమసమసమగ్రాతిభూతిప్రతిష్ఠమ్
వన్దేహందేవదేవం వనజనయన మహాస్రదాస ప్రసన్నం
నోవేధావేదవేదానచ ఖచరదయా భ్యావమేవస్తువస్యమ్
                                                                          (అలంకారశిరోమణే -7-10)


శ్రీరంగంలో స్థిరంగా వెలసినవాడు.
భూమండలాన్ని అధికంగా స్థిరంగా
అభివృద్ధి అయ్యేట్లు చేసినవాడు.
లక్ష్మీదేవి నివాసానికి యోగ్యమైన
వక్షస్థలం కలవాడు, అసమానమైన
పరిపూర్ణమైన ఐశ్వర్యం యశస్సు కలవాడు,
కమలనయనుడు, దాసులయెడ అనుగ్రహం
కలవాడు అయిన శ్రీరంగనాథుని మహిమను
బ్రహ్మకూడా తెలిసికొనలేడు. గగన సంచారులైన
దేవతలు కూడా స్వామివారి మహిమను ఎరుగలేరు.
అలాంటి సర్వాతీత మహిమాన్వితుడైన దేవదేవుడైన
శ్రీరంగనాథునికి నమస్కారం. మమ్ములను రంగవిభుడు
భవబంధాలనుంచి రక్షించుగాక!


ఈ పద్యం మొదటి పాదంలోని శ్రీరంగేరం నిరంతే -
అనే అక్షరాలు ఒక పువ్వుగా ఈ క్రింది విధంగా ఏర్పడతాయి.

దీనిలో రం అనే అక్షరం మూడు పర్యాయాలు వస్తాయి.
అది పువ్వు మధ్యలోని దుద్ధుగా ఏర్పడుతుంది.
ఈ విధంగా పన్నెండు పూలతో మాల ఏర్పడుతుంది
ఆ మాలను ఈ చిత్రంలో చూడండి.


No comments: