Monday, October 3, 2016

తండ్రి మధ్వాచారి తనయుడారాధ్యుండు (పేరడీ)


తండ్రి మధ్వాచారి తనయుడారాధ్యుండు (పేరడీ)


సాహితీమిత్రులారా!


వేణుగోపాల శతకంలోని ఈ పద్యం చూడండి

తండ్రి మధ్వాచారి తనయుడారాధ్యుండు
            తల్లిరామాన్జ మతస్థురాలు
తనదికూచి మతంబు తమ్ముడు బౌద్ధుడు
            సర్వేశ్వర మతంబు సడ్డకునిది
ఆలుకోమటిజాతి దక్క జంగమరాలు 
            బావగారిది లింగబలిజ కులము
ఆడుబిడ్డసుతారి అల్లుఁడు పింజారి
             మఱఁదలు కోడలు మారువాడి
కలియుగంబున వర్ణసంకరులు ప్రబలి
యుత్తమకులంబు లొకమూల కొత్తిగిల్లె
మదరిపువిపాల మునిజన హృదయలోల
వేణుగోపాల! భక్త సంత్రాణశీల!
                            (వేణుగోపాల శతకము - 38)

దీనికి దాశరథిగారి పేరడీ పద్యం చూడండి-

తండ్రి కాంగ్రెసువాది, తల్లి దేశమువాది
                     తనయుడు మార్క్సుస్టు తత్వవేత్త
కూతురు బీజేపి కోసము పోరాడు 
                     అల్లుడు జనతాను అనుసరించు
నిన్నటి జాతీయనేత నేడు విజాతి
                     సిద్ధాంతములు ప్రవచించసాగు
మొన్నటి ప్రాంతీయ మూర్తి ఈ రోజున
                      అఖిలభారతమని అలమటించు
ఓట్లకొరకయి యెన్నయోపాట్లుపడిరి
నోట్ల కట్టలు చూపి సంతోష పెట్టి
యెన్ని చేసినగాని ఓట్లిచ్చువారు 
తమకు తోచిన దారినే కదలినారు
(దాశరథిగారి పొలిటిగేషన్ ఒకే సీసపద్యం
హాస్యప్రియ మాసపత్రిక డిసెంబరు1984)

No comments: