Monday, June 29, 2020

పాల్కురికి సామనాధుడు


పాల్కురికి సామనాధుడు







సాహితీమిత్రులారా!

తెలుగు శివకవులలో ప్రసిద్ధుడు పాల్కురికి సోమనాధుడు
ఆయన  కవితను గురించి  డా. జంధ్యాల జయకృష్ణ బాపూజి గారి ప్రసంగం
వీడియో ఆస్వాదించండి -

Saturday, June 27, 2020

నవరసాలు ఒకే పద్యంలో


నవరసాలు ఒకే పద్యంలో





సాహితీమిత్రులారా!

శ్రీరామకర్ణామృతములోని
ఈ శ్లోకంలో నవరసములు
చూప బడ్డాయి చూడండి-

శృంగారం క్షితినందనీవిహరణే వీరం ధనుర్భంజనే
కారుణ్యం బలిభోజనే ద్భుతరసం సింధౌగిరిస్థాపనే
హాస్యం శూర్పణఖాముఖే భయవహే భీభత్సమన్యాముఖే
రౌద్రం రావణవర్దనే మునిజనే శాంతం వపుః పాతు నః

సీతతో విహరించునపుడు శృంగారరసమును,
శివునిధనుర్భంగమునందు వీరరసమును,
కాకాసురుని యందు దయను,
సముద్రమున పర్వతములుంచునపుడు ఆశ్చర్యమును,
శూర్పనఖ మోమునందు హాస్యమును,
ఇతర స్త్రీలమోమున భీభత్సమును(అసహ్యమును),
రావణసంహారమందు రౌద్రమును,
మునీశ్వరులయందు శాంతరసమును,
అయి సర్వము మమ్ము రక్షించుగాక- అని భావం.

శృంగారం క్షితినందనీవిహరణే వీరం ధనుర్భంజనే
కారుణ్యం బలిభోజనే ద్భుతరసం సింధౌగిరిస్థాపనే
హాస్యం శూర్పణఖాముఖే భయవహే భీభత్సమన్యాముఖే
రౌద్రం రావణవర్దనే మునిజనే శాంతం వపుః పాతు నః

ఇందులో అన్ని రసముల పేర్లు రావడం వలన
ఇది నవరస శబ్ద చిత్రం అనబడుచున్నది

Thursday, June 25, 2020

కన్నడ, హిందీ లలో ఏకాక్షరి


కన్నడ, హిందీ లలో ఏకాక్షరి





సాహితీమిత్రులారా!

కన్నడ భాషలో 12వ శతాబ్దికి చెందిన నాగవర్మ "కావ్యావలోకనం"లోని ఏకాక్షరి ఉదాహరణ.

ಶ್ಲೋ. ನಿನ್ನಿ ನೇನಿನ್ನ ನಾನನ್ನ |
         ನಿನ್ನ ನೆನ್ನ ನನೂನನಂ||
         ನುನ್ನ ನೈನನ್ನ ನೈನೇನೇ|
         ನೆನಿನ್ನನ್ನಂ ನಿನ್ನೆ ನಾನುನಂ||
                                (ಕಾವ್ವಾವಲೋಕನಂ - 8 - 584)
పై కన్నడ శ్లోకానికి తెలుగులిపి
                  శ్లో. నిన్న నీనిన్న నానన్న
                   నిన్ననెన్న ననూననం
                   నున్న నైనన్న నైనేనే
                   నెన్నిన్నం నిన్నెనానునం

హిందీలో లేఖరాజకవి రచిత "గంగాభరణ్ "లోని ఏకాక్షరి.

गंगी गोगो गो गगे, गुंगी गो गो गुंग ।
गंगा गंगे गंग गा, गंगा गंगे गंग ।। 
పై దోహేకు తెలుగులిపి
                                         గంగీ గోగో గోగ గే, గుంగీ గోగో గుంగ
                            గంగా గంగే గంగ గా, గంగా గంగే గంగ

Tuesday, June 23, 2020

ఒకేపాదంలో ఎంత వింత


ఒకేపాదంలో ఎంత వింత







సాహితీమిత్రులారా!

మాడుగుల మహారాజును
ఇద్దరు కవీశ్వరులు ఇలా దీవించారు-

అ శ్లోకం చూడండి -

విక్రమేణార్జున ముఖా: కృష్ణభూపాల! తే హితా:
విక్రమేణార్జున ముఖా :కృష్ణభూపాల! తే హితా:


రెండు పాదాలు
ఒకలానే ఉన్నాయి కదా!

ఇద్దరూ ఒకే పాదాన్ని చెప్పారా? అంటే చూద్దాం మరి

మొదటికవి చెప్పిన పాదానికి అర్థం-

ఓ కృష్ణభూపాలా!
విక్రమేణ అర్జునముఖా: -
పరాక్రమంలో (పాండవ మధ్యముడైన) అర్జునుడు మొదలైనవారు,
తే హితా: - నీకు సమాన స్నేహితులుగా పోల్చదగినవారు
.
రెండవకవి చెప్పిన పాదానికి అర్థం -

ఇందులో తే2హితా - అని తీసుకోవాలి
అపుడు
ఓ కృష్ణభూపాలా!
తేऽహితా: = తే అహితా: = నీ శత్రువులు,
విక్రమేణ - పరాక్రమంలో
అర్జున ముఖా: -
తెల్లమొగంతో వెలవెల పోతున్నారు.

Sunday, June 21, 2020

అక్షరవిన్యాసం


అక్షరవిన్యాసం






సాహితీమిత్రులారా!

వెల్లూరు నరసింగకవి కృత
రాచకన్యకాపరిణము అవతారికలోని
శబ్దచిత్రం చూడండి-

కోదండరామరెడ్డి స
దా దానపు భా గురుత్వ తత్వము తనరం
గా దరణిజ శశి శిబి బలు
లా దివిగవి పగిది లఘువులైరి తలంపన్
                                         (రాచకన్యకాపరిణయము - 1-23)

కోదండరామరెడ్డి దానపు భా - దానకాంతి గురువైనది.
అనగా గొప్పదైనది. దీనిలో  భా - గుర్వక్షరము-
అలఘువు. అపుడు తరణిజ(కర్ణుడు), శశి, శిబి,
బలులు(బలిచక్రవర్తి మొదలైనవారు), ఆ దివిగవి
(కామధేనువు) పగిది లఘువులైరి అనగా చులకనైనారు
- చేవలేనివారు అయినారు. ఇందులో కర్ణాదులు
లఘువులుగా కూర్చబడినది.

ఇది అర్థానికి అనుగుణంగా
అక్షరవిన్యాసం కూర్చబడిన
శబ్దచిత్రము.

Friday, June 19, 2020

పద్యమంతా లఘువులే


పద్యమంతా లఘువులే






సాహితీమిత్రులారా!

ఒక మాత్రా కాలంలో అంటే ఒక చిటిక వేసేంత కాలంలో పలుకగలిగే అక్షరాన్ని లఘువు అంటాం. ఏ పద్యంలోనైనా అన్నీ లఘువులే ఉంటే దాన్ని సర్వలఘువు అంటాం. అదే కందపద్యంలో అన్ని గణాలు లఘువులయితే దాన్ని సర్వలఘుకందం అంటాం. కానీ రెండు, నాలుగు పాదాంతాలలో గురువు ఉంటుంది. ఇలాంటిది తెలుగులో మొదట నన్నెచోడుడు కుమారసంభవం(10వ ఆశ్వాసం 187వ పద్యం)లో రచించాడు.

తగుఁదగదని మనమున మును
వగవఁగ నొడఁబడఁగ వగవ వగవఁగఁబడయున్
దగుఁదగ దని వగ వని వగ
వగవఁగఁ బని గలదె తనకు వగ మఱి జగతిన్

తారకాసురునితో శుక్రాచార్యుడు - కుమారస్వామితో యుద్ధానికి వెళ్ళేసమయులో కొంత నీతిబోధ చేస్తూ అన్న పద్యమిది.
"ఈ పని చేయతగును ఈ పని చేయకూడదని మనసులో ముందుగా విచారించాలి. అలా ఆలోచించగా కర్త్యం బోధపడుతుంది. ఇది చెయ్యవచ్చు ఇది చెయ్యకూడదు అని ముందుగా ఆలోచింపని విధం తనకు లోకానికి మిక్కిలి దుఖం కలిగిస్తుంది తరువాత విచారించి ప్రయోజనంలేదు."  అని భావం.

ఇలాంటి పద్యమే పోతన గజేంద్రమోక్షణంలో గజేంద్రుని రక్షింపబోవు విష్ణువుతో లక్ష్మీదేవి తత్తరపడుతూ వెళుతూన్న ఆమె మనసులోని భావాన్ని ఈ పద్యంగా చిత్రించారు పోతన.

అడిగెదనని కడువడిఁజను
నడిగినఁ దను మగుడ నుడువడని నడయుడుగున్
వెడవెడ సిడిముడి తడఁబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్  
                                                                 (శ్రీమదాంధ్రమహాభాగవతం - 8- 103)

Wednesday, June 17, 2020

య ర ల వ శ ష స హ - లతో పద్యం


య ర ల వ శ ష స హ - లతో పద్యం





సాహితీమిత్రులారా!

హల్లులలో క - వర్గము, చ - వర్గము,ట - వర్గము,
త - వర్గము,ప - వర్గము అని 5 వర్గాలు.
క - మొదలు మ - వరకు ఉన్న హల్లులు కాకుండా
మిగిలిన య ర ల వ శ ష స హ - లను (హల్లులను)
ఉపయోగించి పద్యం కూర్చడం
దీన్నే వర్గపంచకరహితము అంటాం

హార,హీర, సారసారి, హారశైల, వాసవో
ర్వీరుహా, హిహార, శేషవేషహాసలాలస
శ్రీరసోరుయాశసాంశుశీల వైరివీరసం
హార! సారశౌర్యసూర్య హర్యవార్యసాహసా
                                            (కావ్యాలంకారసంగ్రహము 5-245)

(హీరము - మణి, సారసారి - చంద్రుడు,
హారశైలము - కైలాసము, అహిహారుడు - శివుడు,
యాశసాంశుశీల - కీర్తికాంతులచే ఒప్పువాడు,
సూర్యహర్యవార్య సాహసా - సూర్యుని అశ్వములచేతను
వారింపరాని (చొఱవగల) సాహసము కలవాడా)

ఈ పద్యంలో క - మొదలు, మ - వరకు గల హల్లులు
ఏవికూడ వాడలేదు
కావున
ఇది వర్గపంచకరహిత పద్యమైనది.
ఇది శబ్దచిత్రంలోని ఒక రకము.

Tuesday, June 16, 2020

కేవలం గొంతు మాత్రమే పలికే పద్యం


కేవలం గొంతు మాత్రమే పలికే పద్యం





సాహితీమిత్రులారా!

కంఠము, తాలువు, మూర్ధము, దంతము, ఓష్ఠము అనే
ఈ అయిదు వర్ణ ఉత్పత్తి స్థానములు.
కంఠం(గొంతు) నందు పుట్టేవాటిని కంఠ్యములు అని అంటారు.
ఒక ఉత్పత్తిస్థానంనుండి పుట్టే వాటిని తీసుకొని కూర్చిన
దాన్ని ఏకస్థాన చిత్రం అంటారు.
మిగిలిన వర్ణోత్పత్తి స్థానాలను
పరిహరించడం జరుగుతుంది.

ఈ శ్లోకం దండి కావ్యాదర్శంలోనిది చూడండి.

అగా గాం గాంగకాకాంక గాహకాఘక కాకహా
అహాహాంగఖగాం కాగగ కంకాగ ఖగాంకగ

(హానిలేని అంగముగల సూర్యుని(గరుడుని)గుర్తుగా
ధరించిన పర్వతము(మేరువు)నందు సంచరించు
కంఖములనెడి పర్వతపక్షులచేత
ప్రస్తుతిగొన్న గమనము కలవాడా!
గంగాజలము నందలి కుటిలమైన
అంకమునందు వ్రేలాడుచున్న కుత్సితపాప
మనెడి కాకమును(చంపినవాడవేని)చంపి
స్వర్గమునకు పోయితివి.)

అ,ఆ,క,ఖ,గ,ఘ,ఙ,హ,(విసర్గ)-
అనేవి కంఠము(గొంతు)నుండి పుట్టేవి
కావున
వీటిని కంఠ్యములు అంటారు.
ఈ శ్లోకంలో ఈ చెప్పబడిన వాటినుండి మాత్రమే
తీసుకొని శ్లోకం కూర్చడం జరిగింది.
కావున
ఇది ఏకస్థానచిత్రం అనదగినదే.

Saturday, June 13, 2020

నాలుగు అచ్చుల పద్యం


నాలుగు అచ్చుల పద్యం






సాహితీమిత్రులారా!

పాదానికి ఒక అచ్చు చొప్పున నాలుగు పాదాలకు
నాలుగు అచ్చులతో కూర్చిన పద్యం ఇది
దండి కావ్యాదర్శం లోనిది.

అమ్నాయానా మాహాన్త్యావాగ్గీతీ రీతీ: ప్రీతీభీతీ:
భోగోలోగో మోదో మోహోధ్యేయే వేచ్ఛేద్ధేశేక్షేమే
                                                              (కావ్యాదర్శమ్ -3-84)
అర్థం -
అమ్నాయానాం - వేదాలలో, అన్త్యా - చివరిదైన ఉపనిషత్తు, గీతీ: - గానములను, ఈతీ: - ఈతిబాధలుగాను,  ప్రీతీ: - దారాపుత్రాదులందు ప్రేమలను, భీతీ: - భయస్వరూపములైనట్టివిగాను, అహ - చెప్పుచున్నది. భోగ: - విషయోపభోగము, రోగ: - రోగహేతువు, మోద: - సాంసారిక సుఖానుభవము, మోహ: - అవివేకరూపమైనది, అందుచే, క్షేమే - పరమాదరహితమైన, దేశే - ఏకాంత ప్రదేశంలో, ధ్యేయేవా - ధ్యేయమగు పరమాత్మస్వరూపంనందు, ఇచ్ఛేత్ - మనసును నిలుపుటకు కోరుకొనవలెను.

అమ్నాయానా మాహాన్త్యావా
గ్గీతీ రీతీ: ప్రీతీభీతీ:
భోగోలోగో మోదో మోహో
ధ్యేయే వేచ్ఛేద్ధేశేక్షేమే

మొదటిపాదంలో అకారము(అ,ఆ - అచ్చులు)
రెండవపాదంలో ఇకారము (ఇ,ఈ - అచ్చులు)
మూడవపాదంలో ఓ కారము(ఒ, ఓ - అచ్చులు)
నాలుగవపాదంలో ఏ కారము(ఎ,ఏ - అచ్చులు)
లతో కూర్చబడింది. గమనించగలరు.

Thursday, June 11, 2020

ఒకే సమాస చిత్రం


ఒకే సమాస చిత్రం





సాహితీమిత్రులారా!

ఒక పద్యంలోగాని శ్లోకంలోగాని దీర్ఘసమాస అంతాకాని,
ఎక్కువ భాగంగాని కూర్చడం ఒకే సమాస (ఏకసమాస) చిత్రం అనబడుతున్నది.
ఈ పద్యం చూడండి.

మోచర్ల వెంకన అనే కవి వినుకొండపురమునకు వెళ్ళినపుడు
శ్రీరాజామలరాజు వేంకటనరసింహరాయ ప్రభువును దర్శించగా
ఆ ప్రభువు - ఇతఁడేనా వెంకన - అనెనట అప్పుడు కవి -
అయ్యా!  వెంకన ఇతఁడేకాని,-

ఇతఁడేనా? వినుకొండనామకమనోభీష్టార్థకృత్పట్టణ
స్థితసామ్రాజ్యరమాదయామృతఝరీచంచత్కటాక్షేక్షణ
ప్లుతసర్యాంగసమస్తశోభనకళాపుంఖీభవత్ స్తుత్యసం
గతమాల్రాజవరాన్వయప్రభవవేంకట్నర్సధాత్రీశ్వరుం;
డితఁడేనా - ఇతఁడేనా -

అనెనట ప్రభువుగారు వెంకనకవీంద్రుని అసాధారణాశుధారాపాండిత్యానికి,
ధైర్యానికి సంతోషించి బహుమానమిచ్చి పంపిరట.

ఈ పద్యంలో రంగులో చూపబడినదంతా ఒక సమాసమే కావున ఇది ఏకసమాస చిత్రం.
ఇతఁడేనా?  వినుకొండనామకమనోభీష్టార్థకృత్పట్టణ
స్థితసామ్రాజ్యరమాదయామృతఝరీచంచత్కటాక్షేక్షణ
ప్లుతసర్యాంగసమస్తశోభనకళాపుంఖీభవత్ స్తుత్యసం
గతమాల్రాజవరాన్వయప్రభవవేంకట్నర్సధాత్రీశ్వరుం;
డితఁడేనా - ఇతఁడేనా -

Tuesday, June 9, 2020

రెండు హల్లులతో పద్యం


రెండు హల్లులతో పద్యం





సాహితీమిత్రులారా!

రెండు హల్లులు ఉపయోగించి కూర్చిన పద్యాన్ని ద్వ్యక్షరి అంటారు.
ఇపుడు రెండు హల్లుల శ్లోకాన్ని చూద్దాం.
దీనిలో "క-" అనే రెండు హల్లులను ఉపయోగించారు
గమనించండి.
ఇందులో హల్లులు రెండే
వాటికి అచ్చులు ఏవైనా ఉండవచ్చు.

కాలేకిలాలౌకికైక
కోలకాలాలకేలల
కలికాకోలకల్లోలా
కులలోకాలిలాలికా

దీని అర్థం-
అలౌకిక = లోకవిలక్షణమైన, ఏక = ముఖ్యమైన,
కోల = ఆదివరాహస్వామియొక్క, కాలాలకే = భార్యవైన,
ఓ లక్ష్మీ,(కాల = నల్లని, అలకే = ముంగురుగలదానా!)
కలి = కలికాలమనే, కాకోల = విషముయొక్క,
కల్లోల = అభివృద్ధిచే, ఆకుల = బాధపడుచున్న,
లోక + అలి = ప్రజాసమూహమును, లాలికా = రక్షించుచున్న,
(త్వమ్) నీవు, కాలేకిల = అపాయసమయమున మాత్రము,
లల = సాక్షాత్కరించి ప్రకాశింపుము.

Sunday, June 7, 2020

నాలుక మాత్రమే కదిలేపద్యం


నాలుక మాత్రమే కదిలేపద్యం




సాహితీమిత్రులారా!

అచలజిహ్వ - అని నాలుక కదలకుండా
చదివే పద్యలను శ్లోకాలను చూశాము.
ఇపుడు చలజిహ్వ అంటే కేవలం నాలుకమాత్రమే
కదులుతూ చదివే శ్లోక - పద్యాలు.
చూడండిమరి.

దనుజారిర్నతో ధాతృ ధూర్జటీన్ద్రాది నిర్జరైః
దురితం తటినీరత్నోదరే దో ధోతునిద్రితః

                              (అలంకారశిరోమణే శబ్దాలంకారప్రకరణం-36)

(బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు మొదలయిన దేవతలచే
నమస్కరించబడిన వాడున్నూ,
నదులనూ రత్నాలనూ గర్భంలో నిలుపుకొన్న
సముద్రమునందు నిద్రించు వాడున్నూ
రాక్షస వైరియూ అయిన
శ్రీరంగనాధుడు
మా పాపాలను విదలించి
రూపుమాపుగాక!)
చదివారుకదా నాలుక మాత్రమే కదలుతూందికదా!
ఇది ఏ అక్షరాలకు నాలుక కదలుతుందో
వాటిచే మాత్రమే కూర్చబడినది.

Friday, June 5, 2020

వేదాంతదేశికుల పాదుకాసహస్రం


వేదాంతదేశికుల పాదుకాసహస్రం




సాహితీమిత్రులారా!
శ్రీ వేదాంతదేశికులవారు శతాధిక గ్రంథకర్త.వారి గ్రంథాలన్నీ కూడా విద్వద్వత్కవితా గంగాలహరీ విలసితాలు.  వాటిలో 'పాదుకా సహస్రం'అనే గ్రంథరాజం శ్రీరంగనాథులవారి పాదుకలను స్తుతిస్తూ ఆశువుగా 1008 శ్లోకాలలో ఒక్క రాత్రిలో   రచించారు. దీనికి కారణం  మరొక  ఆశుకవితో  కలిగిన  స్పర్థ మూలమని "వేదాంతాంచార్యవిజయం" అనే సంస్కృత గ్రంథంలోనూ మరికొన్ని పూర్వగ్రంథాలలోనూ ఉంది.

పాదుకాసహస్రం 32 (భాగాలు)పద్ధతులుగా రచించబడింది.
అవి-1ప్రస్తావనపద్ధతి,2సమాఖ్య,3 ప్రభావ,4.సమర్పణ, 
5ప్రతిప్రస్థాన,6అధికార పరిగ్రహ,7అభిషేక,8నిర్యాతన,
9వైతాళిక,10శృంగార,11సంచార,12పుష్ప,13పరాగ,
14నాద,15రత్నసామాన్య,16బహురత్న,17పద్మరాగ,
18ముక్తా,19మరకత,20ఇంద్రనీల,21బింబప్రతిబింబ,
22కాంచన,23శేష, 24 ద్వంద్వ,25సంనివేశ,26యంత్రికా,
27రేఖా,28సుభాషిత,29ప్రకీర్ణ,30చిత్ర,31నిర్వేద,32ఫలపద్ధతి.

    వీటిలో30 క్రమసంఖ్యగల "చిత్రపద్ధతి"లో 
చిత్రకవిత్వం ఉంది.
    చిత్రపద్ధతి 911శ్లోకం నుంచి మొదలై 950శ్లోకంతో ముగుస్తుంది.
అంటే చిత్ర పద్ధతిలోని శ్లోకాలు 40.
     సకలచిత్రాలకూ ఆస్పదమైన శ్రీరంగనాథులవారి మణీ
మయ పాదుకాదేవిని ప్రపత్తిపొందుతూ  ఈ పద్ధతిలోని 1వశ్లోకం
 ప్రారం భించబడింది.2వ శ్లోకంలో భగవంతునికన్న
పాదుకాశీలంమిన్నఅనేచిత్రప్రశంసఉంది.3వశ్లోకంగోమూత్రికా
బంధం,4వశ్లోకంలో గూఢచతుర్థం అనే శబ్దచిత్రం ఉంది.
5వశ్లోకం నిరోష్ఠ్య శబ్దచిత్రం,6క్రియాగుప్త చిత్రం, 7అకార విభక్తి చిత్రం,8పాదావృత్తియమకచిత్రం,9పాదానులోమప్రతిలోమ
ప్రతిలోమయమకచిత్రం,10 అపునరుక్తవ్యంజన చిత్రం, 11
మురజబంధచిత్రం,12అనతిరిక్త పదపదార్థానులోమ ప్రతిలోమ శబ్దచిత్రం,13 శరబంధచిత్రం,14గరుడగతి చక్రబంధచిత్రం,15ద్విశృంగాటక చక్రబంధ చిత్రం, 16ద్విచతుష్క చక్రబంధ చిత్రం,17చతురరచక్రబంధచిత్రం/
అష్టదళపద్మబంధచిత్రం,18 స కర్ణిక షోడశదళ పద్మబంధ చిత్రం,
19స్తుతి, 2౦ చతురంగ తురంగ పదబంధ చిత్రం,
21అర్ధభ్రమక యమక చిత్రం,22సర్వతోభద్రబంధచిత్రం, మళ్లీ
23సర్వతోభద్రబంధచిత్రం,24త్ర్ర్యక్షర యమక చిత్రం, 25ఏక
హల్  శ్లోకచిత్రం,26మహాయమకచిత్రం-దీనిలో గోమూత్రిక,
కంకణ,మురజ,పద్మబంధాలూ ,అనులోమప్రతిలోమగతి
చిత్రమూ,అర్ధయమక-పాదచతురావృత్తియమక పాదార్థాష్టా
వృత్తియమక-పాదషోడశవృత్తియమక-ఏకాక్షర ద్వాత్రింశత్
ఆవృత్తి యమకచిత్రాలూ ఉన్నాయి.27పాదచతుష్టయభాగా
వృత్తియమకచిత్రం,28పాదభాగ చతురావృత్తి యమకచిత్రం,
29షోడశావృత్తియమకచిత్రం, దీనిలోనే షోడశదళపద్మ బంధచిత్రం,
అష్టదళ పద్మబంధచిత్రం చతుర్దళ పద్మబంధ చిత్రం-అనేవీ  ఉన్నాయి,
30కవినామాంకిత అష్టదళపద్మ బంధచిత్రం,31 కావ్యనామాంకిత కవినామాంకిత
మహాచక్రబంధ చిత్రం,32చతురంక(అనుష్టుప్ శ్లోకగర్భిత)అష్టారచక్ర
బంధచిత్రం,33,34అనులోమగోమూత్రికాబంధచిత్రం,35,36
భిన్నవృత్తానులోమ గోమూత్రికాబంధచిత్రం, 37,38 భిన్న వృత్తానులోమ ప్రతిలోమ చిత్రం,39పాదుకాయుగళ గర్భక
ర్ణికమష్టదళ పద్భబంధచిత్రం(ఈ పాదుకాబంధం దేశికుల
వారి స్వీయ ప్రతిభా జనితం)'40 పాద ద్వయభాగ ద్వయావృత్తి యమకచిత్రం

Wednesday, June 3, 2020

ప్రతి పాదానికి ఒక హల్లు వచ్చే పద్యం

ప్రతి పాదానికి ఒక హల్లు వచ్చే పద్యం




సాహితీమిత్రులారా!

ఒక పాదానికి ఒక హల్లు మాత్రమే ఉపయోగిస్తూ నాలుగుపాదాలకు
నాలుగు వేరువేరు హల్లులను వాడటాన్ని ఏకాక్షర పాదం లేక
ఏకవ్యంజనపాదం అంటారు.

భారవి కిరాతార్జునీయంలో రాసిన
ఏకాక్షరపాద శ్లోకం గమనిద్దాం.

శ్లో. స సాసి: సాసుసూ: సాసో
     యేయాయేయాయయాయయ:
     లలౌలీలాం లలో2లోల:
     శశీశశిశుశీ: శశన్
                                          (కిరాతార్జునీయమ్ -15-5)
అర్థం :- సాసి: = ఖడ్గంతో ఉన్న, సాసుసూ: = ప్రాణాలను హరించే బాణాలు థరించినవాడు,సాస: = ధనువును థరించినవాడు, యేయ + అయేయ + అయయ + అయయ - వాహనంతోను, వాహనంలేకుండా శత్రువుని చేరి వారి వాహనాలను స్వాథీనం చేసుకున్నవాడు, లల: = అందమైనవాడు, అలోల: = చాపల్యంలేనివాడు, శశి +ఈశ + శశు + శీ: - ఈశ్వరుని కుమారుడైన కుమారస్వామిని పరుగెత్తింపచేసే, స: = అర్జునుడు, లీలాం = శోభను, లలౌ = పొందాడు.

Monday, June 1, 2020

త,థ,ద,ధ,న - లతో పద్యం


త,థ,ద,ధ,న - లతో పద్యం




సాహితీమిత్రులారా!

కేవలం తవర్గంలోని త,థ,ద,, - అనే 5 అక్షరాలతో
మాత్రమే కూర్చబడ్డ పద్యం తవర్గ పద్యం.
ఇది ‌హరవిజయంలోనిది.

తథా దధా 2నో తనుతాం నిధీనాం ధూతాననో 2 నూనధునీ ననాదః
తేనైధితానాం నిధనం తదానీం నూనం న తేనే న ధనాధినా ధః

గమనించండి ఇందులో త,థ,ద,ధ,న -లు తప్ప వేరేమైనా ఉన్నాయేమో?