Friday, September 30, 2016

పుత్రక యెందు బోయితివి?


పుత్రక యెందు బోయితివి?


సాహితీమిత్రులారా!


గరుడాచలకవి కృత
కౌసలేయ చరిత్రము లోని
సంభాషణచిత్రం చూడండి.
గద్వాలవారి ఆడబడుచుఅయిన గిరియమ్మ
కవులను సత్కరించటం, విద్యార్థుంకు చదువు చెప్పించటం,
దేవాలయాలను, తోటలను నిర్మించటం, తీర్థయాత్రలను చేయటం
వంటి ధర్మకార్యాలెన్నో చేసింది. ఆమె గరుడాచలకవితో
కౌసలేయ చరిత్రం వ్రాయించి కేశవస్వామికి అంకితం చేయించింది.
ఆమె ధర్మసత్రం గురించిన సంభాషణ ఈ పద్యంలో కనిపిస్తుంది

పుత్రక యెందు బోయితివి? బోర్వెలిలో గిరియమ్మ వెట్టు బ
ల్సత్రములో భుజించపటకు! సత్ర విశేషములేమి? చూడు నా
గాత్రము!  త్రావితో సుధ? జగజ్జనులందరు ద్రావద్రావుటే
చిత్రము? నేనటంచు వచియించును బ్రహ్మకు నారదుండటన్

ఇది బ్రహ్మ - నారద సంభాషణ -
బ్రహ్మ - కుమారా! నారదా! ఎక్కడికి వెళ్ళావు?
నారదుడు - బోర్వెల్లి అనే గ్రామంలో గిరియమ్మ పెట్టిన
                  ధర్మశాలలో భుజించుటకు వెళ్ళాను.
బ్రహ్మ - ఏమి ఆ సత్రపు విశేషాలు?
నారదుడు - నాశరీరాన్ని చూడు,నీకే తెలుస్తుంది
బ్రహ్మ - అమృతం త్రాగావా ఏమి?
నారదుడు - లోకంలోని జనమంతా
                  త్రాగగాలేనిది నేను అమృతం
                  సేవించటంలో  వింతేమి!


No comments: