Monday, September 26, 2016

వికాశమీయుర్జగతీశమార్గణా


వికాశమీయుర్జగతీశమార్గణా


సాహితీమిత్రులారా!



భారవి కిరాతార్జునీయమ్ లో 15వ సర్గలో
చిత్రకవిత్వంతో కూడిన రచన చేశాడు అందులోనిది
ఈ క్రింది శ్లోకం ఇందులో అన్ని పాదాలు ఒకేలా ఉన్నాయి.
కావున దీన్ని ఏకపాది అంటాము.
శ్లోకం చూడండి-

వికాశమీయుర్జగతీశమార్గణా
వికాశమీయుర్జగతీశమార్గణా:
వికాశమీయుర్జగతీశమార్గణా
వికాశమీయుర్జగతీశమార్గణా:
                             (కిరాతార్జునీయమ్ - 15- 52)

ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేసే అర్జునుని
పరీక్షించ వచ్చిన కిరాతుని రూపంలో ఉన్న
శివునికి అర్జునునికి జరిగే పోరాటంలోని
విషయం తెలిపేదీ శ్లోకం-

అర్జునుని బాణాలు విస్తరిస్తుండగా
శివుని బాణాలు భంగమవుతున్నాయి.
రాక్షసులు చూచి శంకరుని బాణాలు కూడా
వ్యర్థమవుతున్నాయని ఆశ్చర్యం పొందగా,
ఋుషులు దేవతలు ఆకాశంలో చేరి భయంకరమైన
యుద్ధాన్ని చూడటానికి ఒకే చోటికి చేరారు - అని పద్య భావం.

No comments: