Tuesday, September 27, 2016

తండ్రి కొడుకులొక్క తరుణిని ....


తండ్రి కొడుకులొక్క తరుణిని ....


సాహితీమిత్రులారా!




ఈ పద్యం చూడండి.

తండ్రి కొడుకులొక్క తరుణిని రమియింప,
పుత్రు లిద్ద రొంది, పోరు గలుగ
ఒకని జంపి, రాజ్య మొకని కిచ్చిన ప్రభు
వాత డిచ్చు మాకు నఖిల సిరులు

ప్రార్థనలు కూడ ఎంత చిత్రంగా  ఉంటాయో!
దీన్ని చూస్తే తెలుస్తుంది

తండ్రి, కొడుకులు ఒకే స్త్రీని కూడటం వల్ల
 వారివలన ఇద్దరు కుమారులు పుడితే
వారు ఇద్దరు పొరు సలిపితే అందులో ఒకని చంపి
ఒకనికి రాజ్యమిచ్చిన ప్రభువు
మాకు అఖిల సంపదలు ఇచ్చుగాక అని భావం.

ఏమిటిది అయోమయం జగ్నాథం అన్నట్లు.
ఏమి అర్థం ఆలోచిస్తే ఇది ఒక కథ ఇందులో ఉంది-
అది భారతంలోనిది వివరంగా చూద్దాం-

తండ్రి సూర్యుడు- కొడుకు యముడు-
వీరిద్దరు కుంతిని కలిశారు.
సూర్యనివల్ల కర్ణుడు, యమునివల్ల ధర్మరాజు పుట్టారు.
వీరీద్దరు యుద్ధంలో పోరాడారు.
వీరిలో ఒకరిని(కర్ణుని) చంపి
ఒకరి(ధర్మరాజు)కి రాజ్యమిచ్చినవాడు కృష్ణుడు.
ఆ కృష్ణుడు మాకు సర్వసంపదలు ఇచ్చుగాక!
అని ప్రార్థించాడు కవి.

No comments: