Sunday, July 17, 2016

చెలులం జర్చింపగా పాడియే?


చెలులం జర్చింపగా పాడియే?


సాహితీమిత్రులారా!


చమత్కారమంజరిలో
నాయకుని దగ్గర ఉన్న యువతులను వర్ణించు
సందర్భములోనిది ఈ పద్యం.
దీనిలోని ప్రత్యేకతను గమనించండి.

బిగువుం జన్నులు గాంచి మాను నల జంబీరంబు బీరంబు! క్రొం
జిగి మోముం గని సిగ్గునన్ వదలు రాజీవంబు జీవంబు! విం
తగు భ్రూరేఖలు గాంచి భీతినిడు కోదండంబు దండంబు!
జ్జగతీనాథుని మ్రోలనున్న చెలులం జర్చింపగా పాడియే?
                                                                    (చమత్కారమంజరి - 2-43)

దీనిలో జంబీరము - బీరము
           రాజీవము - జీవము
           కోదండము - దండము
పదాలను గమనించిన మొదటి పదాలలోని మొదటి అక్షరం లోపించి
రెండవపదం వస్తూన్నది. దీన్నే చ్యుతాక్షర చిత్రం అంటాము.

ఆ యువతుల బిగువు చన్నులను చూచి
జంబీరము(గజనిమ్మ) బీరములాడుట మానినదట.
క్రొత్తకాంతితో వెలిగే మోమును చూచి
రాజీవము(పద్మము) జీవములేనిదయిందట.
భ్రూరేఖలు చూచి కోదండము (ధనుస్సు) దండము(నమస్కారము) పెట్టినదట.
రాజు దగ్గరున్నవారిని గురించి చర్చించడం ధర్మమే? (ధర్మంకాదని) - అని భావం.

No comments: